-
ఏపీలో దాడులపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సీరియస్
న్యూఢిల్లీ, సాక్షి: ఇక నుంచి దేశంలో వికసిత్ భారత్ ఎజెండాగా పనిచేస్తామని మరోసారి కేంద్ర మంత్రిగా ఎన్నికైక బీజేపీ సీనియర్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అంటున్నారు. తెలంగాణతో పాటు ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపైనా సోమవారం ఢిల్లీలో సాక్షితో ఆయన ఎక్స్ క్లూజివ్గా మాట్లాడారు. ‘‘ఎన్నికలైపోయాయి, ఇక ప్రతిపక్షాలన్నీ అభివృద్ధికి సహకరించాలి. వికసిత్ భారత్ ఎజెండా పనిచేస్తాం. పేద ప్రజలకు కోట్లాది ఇల్లు నిర్మిస్తాం. తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయల నిధులు తెచ్చాం. తెలంగాణకు నేను నిధులు తీసుకురాలేదనే వారు మూర్ఖులు. అలాంటి మూర్ఖుల మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. రీజినల్ రింగ్ రోడ్డుకు రాష్ట్రం తరఫున నిధులను జమ చేయడం లేదు. కేంద్రం ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదు’’ అని విమర్శించారాయన. .. రాబోయే రోజుల్లో తెలంగాణలో 88 సీట్లు టార్గెట్గా పని చేస్తామని, తెలంగాణలో కచ్చితంగా అధికారాన్ని సాధిస్తామని అంటున్నారాయన. వచ్చేసారి తెలంగాణలో అసెంబ్లీ , లోక్సభ ఎన్నికల ఒకేసారి జరుగుతాయి. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేస్తున్న బీఆర్ఎస్ ఓటు బదిలీ ఆరోపణలపై స్పందిస్తూ.. తెలంగాణ ఒక పార్టీ గుత్తాధిపత్యం నడవదు. కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా .. తెలివి తక్కువగా మాట్లాడుతోంది. మాకు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ ఓట్లు కూడా బదిలీ అయ్యాయి’’ అని అన్నారు. ఇక ఏపీలో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలపైనా ఆయన స్పందించారు. ఏపీలో ఎన్నికల తర్వాత దాడులు మంచిది కాదు. అలాంటి దాడులను క్షమించే ప్రసక్తి లేదు. ఆ తరహా దాడులపై జీరో టాలరెన్స్ తో వ్యవహరిస్తాం’’ అని కేనంద్ర మంత్రి కిషన్రెడ్డి హెచ్చరించారు. -
బరితెగించి దాడులకు పాల్పడుతున్న టీడీపీ నాయకులు
-
వేల్పూరు ఎస్సీ కాలనీవాసులపై టీడీపీ కార్యకర్తల దాడి
వినుకొండ (నూజెండ్ల): మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వగ్రామమైన శావల్యాపురం మండలం వేల్పూరులోని ఎస్సీ కాలనీ వాసులపై ఆదివారం టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. వైఎస్సార్సీపీకి ఓటు వేశారనే అక్కసుతో 50 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు దాడిచేసి నలుగురిని గాయపరిచారు. ఎన్నికల అనంతరం బూత్ల వారీగా ఓట్లు లెక్కేసుకున్న టీడీపీ నాయకులు ఎస్సీ కాలనీలో వైఎస్సార్సీపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయని ఆ కాలనీ వాసులతో గొడవకు దిగారు. అదేమని ప్రశ్నించిన బీర్నీడి దినేష్ కుమార్, తిరుపతి, రోశయ్య, నాగమ్మపై దాడిచేసి కొట్టి గాయపరిచారు. గాయపడిన వారిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నారు. వినుకొండ రూరల్ సీఐ సుధాకర్, టౌన్ సీఐ సాంబశివరావు గ్రామానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.పెరికీడులో వైఎస్సార్సీపీ నేత ఇంటిపై రాళ్ల దాడి» రాళ్లదాడితో కిటికీ అద్దాలు ధ్వంసం»ఘటనపై హనుమాన్జంక్షన్ » పోలీసులకు బాధితుల ఫిర్యాదుహనుమాన్జంక్షన్ రూరల్ (గన్నవరం): కృష్ణాజిల్లా బాపులపాడు మండలం పెరికీడులో వైఎస్సార్సీపీకి చెందిన వైస్ ఎంపీపీ పండు రాణి, మాజీ ఉప సర్పంచ్ పండు నాగార్జున దంపతుల నివాసంపై ఆదివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు దాడిచేసి బీభత్సం సృష్టించారు. ఇంటిపైకి రాళ్లు విసురుతూ దుర్భాషలాడారు. మద్యంతాగి బైక్లపై వచ్చిన టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ భయానక వాతావరణం సృష్టించారు. బైక్లపై చక్కర్లు కొడుతూ ఇంట్లో ఉన్న పండు రాణి, వారి కుమార్తెను తీవ్ర భయాందోళనలకు గురిచేశారు. టీడీపీ కార్యకర్తల రాళ్లదాడితో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో గ్రామాంతరం వెళ్లిన పండు నాగార్జున ఈ ఘటనపై హనుమాన్జంక్షన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టీడీపీ కార్యకర్తలు వెళ్లిపోయారు. ఎస్ఐ–2 పి.ఆర్జమ్మ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని ఎస్ఐ తెలిపారు. వణుకూరులో టీడీపీ, జనసేన దాడి, బెదిరింపు పెనమలూరు: కృష్ణాజిల్లా పెనమలూరు మండలం వణుకూరులో వైఎస్సార్సీపీ అభిమానులపై టీడీపీ, జనసేన నేతలు దాడులు చేశారు. ఆలస్యంగా అందిన సమాచారం ప్రకారం.. వణుకూరులో తాపీమే్రస్తిగా పనిచేస్తూ మసీదు సమీపంలో నివాసం ఉంటున్న మైనార్టీ వ్యక్తి ఇంటిపై రెండురోజుల కిందట టీడీపీ నేతలు రాళ్లువేశారు. ఇంట్లో ఉన్న వారిని అంతుచూస్తామంటూ బెదిరించారు. ఇంటి బయట ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వణుకూరు గ్రామంలో ఉంటున్న వైద్యుడి ఇంటికి జనసేన నేతలు వెళ్లి బెదిరించారు. మహిళలను అసభ్య పదజాలంతో దూషించారు. టీడీపీ, జనసేన నేతల వైఖరి పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడిచిత్తూరు జిల్లా చిన్నరెడ్డిపల్లిలో ఎనిమిది మందికి గాయాలు యాదమరి (పూతలపట్టు): చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలంలోని చిన్నరెడ్డిపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై టీడీపీ కార్యకర్తలు ఆదివారం దాడికి పాల్పడ్డారు. చిన్నరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైన ఓ యువకుడు పనికి వెళుతుండగా అడ్డగించి టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. ఆ యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి టీడీపీ కార్యకర్తలను ప్రశ్నించడంతో మరింత రెచ్చిపోయి కర్రలతో వారిని కూడా చితకబాదారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు యాదమరి పోలీసులు గ్రామానికి వచ్చి పరిశీలించారు. గాయపడిన యువకుడిని, అతని కుటుంబ సభ్యులను టీడీపీ కార్యకర్తలు కొన్నిరోజులుగా ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. కాగా, మంగళవారం ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. మద్యం తాగి వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లపై రాళ్లు విసరడం, ఇళ్లలోని వస్తువులు, బైక్లను ధ్వంసం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ సానుభూతిపరులు కోరుతున్నారు.వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడికదిరి అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కౌలేపల్లిలో ఆదివారం టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నాయకుడు హిదయతుల్లాపై దాడిచేసి గాయపరిచారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. హిదయతుల్లా ప్రెసిడెంట్గా ఉన్న కౌలేపల్లి దేవరచెరువు సొసైటీలో 40 మంది సభ్యులున్నారు. వీరంతా చెరువులో చేపలు వదిలి జీవనం సాగిస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ గెలవగానే గ్రామానికి చెందిన ఆ పార్టీ కార్యకర్తలు చంద్ర, అతడి అనుచరులు సాంబశివ, మధు, చిరంజీవి, నారాయణస్వామి తదితరులు చెరువులో వలలు తీసేయాలని హిదయతుల్లాను రెండు రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం చెరువు వద్దనున్న హిదయతుల్లా వద్దకు వీరంతా వెళ్లి టీడీపీ అధికారంలోకి వచ్చినందున చెరువు తమకే సొంతమని, ఇక్కడ మీరెవరూ చేపలు పట్టరాదని హెచ్చరించారు. పరుష పదజాలంతో దూషిస్తూ హిదయతుల్లాపై దాడిచేసి గాయపరిచారు. బాధితుడిని కుటుంబ సభ్యులు కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఇదేనా ప్రజాస్వామ్యం!?
రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తల దౌర్జన్యాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయి. చంద్రబాబు, లోకేశ్ కనుసన్నల్లో ఇష్టానుసారం దాడులు చేస్తూ పేట్రేగిపోతున్నారు. అధికారంలోకి వచ్చింది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను చితకబాదడానికే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఊరూరా ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ కార్యాలయాల బోర్డుల తొలగింపు, శిలాఫలకాల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడో చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న ఆటవిక రాజ్యాన్ని తలపిస్తూ పోటీపడి మరీ దాడులు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్త దుస్తులు విప్పి కొట్టడమే కాకుండా, లోకేశ్ ఫ్లెక్సీ ఎదుట మోకాళ్లపై కూర్చోబెట్టి బూతులు తిట్టారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లెలో 50 ఇళ్లకు మంచి నీరు బంద్ చేశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో అర్చకత్వ బాధ్యతలు తమ వర్గీయులకు అప్పగించాలంటూ ఓ పూజారి ఇంటిపై దాడి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ వర్గీయుల దాషీ్టకాలు ఊరూరా కనిపిస్తున్నాయి. సభ్య సమాజం ఏమనుకుంటుందనే విచక్షణ మరచి బరితెగింపుతో వ్యవహరిస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా ఇళ్లలోకి చొరబడి కొడుతున్నారు. ఎక్కడో సినిమాల్లో కనిపించే ఇలాంటి దృశ్యాలు ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నిజ జీవితంలోనూ చోటుచేసుకోవడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తుండటం దారుణం, దుర్మార్గం. పైగా కొన్ని చోట్ల వారే టీడీపీ కార్యకర్తలుగా మారి పూనకం వచ్చినట్లు ఊగిపోతుండటం గమనార్హం. ఏ తప్పూ చేయకపోయినా పల్నాడు జిల్లాలో ఊరు విడిచి వెళ్లాలని ఒక ఉప సర్పంచ్ను ఓ సీఐ తీవ్రంగా హెచ్చరించడం, బాధితుడు ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకోవడం అరాచకానికి పరాకాష్ట. పరిస్థితి చూస్తుంటే రాష్ట్రం రావణ కాష్టం అవ్వాలన్నదే బాబు, లోకేశ్ల అభిమతంగా అనిపిస్తోంది. -
దాడులపై పోలీసులు ప్రేక్షక పాత్ర
మచిలీపట్నం టౌన్: కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులను నియంత్రించకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులపై హైకోర్టులో ప్రైవేటు కేసులు వేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) వెల్లడించారు. శనివారం వారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పేర్ని నాని మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన రౌడీ మూకలు ఉద్దేశ పూర్వకంగా, అధికార మదంతో మారణహోమం సాగిస్తున్నా, విధ్వంసం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడు, జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేలు.. వారి కార్యకర్తలు చేస్తున్న దాడులపై ప్రేక్షకపాత్ర వహించేలా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఆ ఆదేశాలను పోలీసులు తూచా తప్పకుండా పాటిస్తుండటం విచారకరం అన్నారు. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్లు ఆంధ్రప్రదేశ్లోనూ తీసుకొచ్చారని విమర్శించారు. రౌడీషీటర్లు స్థానికంగా ఉన్న డీఎస్పీ, సీఐ, ఎస్సైలను ఏరా.. ఉద్యోగం చేయాలని లేదా.. నువ్వు ఇక్కడే ఉంటావా.. లేక వీఆర్కు వెళతావా.. అని మాట్లాడుతున్నా పోలీసులు మిన్నకుండి పోవడం విచారకరం అన్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలతో కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. కళ్లెదుటే దాడులు.. అచేతనంగా పోలీసులు‘బందరు గొడుగుపేటలోని ఎంకులు బంకులు ఎదురుగా ఉన్న సందులో ఒక యాదవ కుటుంబం ఇంట్లో సామగ్రి, టీవీని ధ్వంసం చేస్తే, కేసు పెట్టినా ఇనుగుదురుపేట పోలీసులు పట్టించుకోలేదు. బాధితులను వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించి సామగ్రి కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తే మళ్లీ సామగ్రి కొంటే ఇలాగే ధ్వంసం చేస్తామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం. స్థానిక చిలకలపూడి గోడౌన్స్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ కాలనీలో కూలీ పనులు చేసుకునే భార్యాభర్తలు వైఎస్సార్సీపీకి పని చేశారనే కారణంతో వారి ఇంటిపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేశారు. అడ్డుపడిన వీరిద్దరినీ తీవ్రంగా గాయపరిచారు. ఆ దంపతులను ఆసుపత్రిలో చేర్చుకోకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ సమయంలో 25కు పైగా కేసులు ఉన్న రౌడీషీటర్ నవీన్.. ఆసుపత్రికి వెళ్లి నెలల పిల్లాడిని ఎత్తుకున్న ఆ మహిళను అసభ్య పదజాలంతో దూషించాడు. ఇదంతా పోలీసుల కళ్లెదుటే జరిగింది. అయినా రౌడీ షీటర్పై కేసు పెట్టకపోగా, బాధితులపైనే ఎదురు కేసు పెట్టారు. మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీలే డీఎస్పీలు, సీఐలుగా భావించేలా చంద్రబాబు తయారు చేశారు. మహేష్ అనే వ్యక్తి విచ్చలవిడిగా బరితెగించి కుర్చీలతో ఎస్ఐ పైనే దాడి చేశాడు. కార్లు ధ్వంసం చేశాడు. అయినా ఇంత వరకు కేసు నమోదు చేయలేదు. ఇంత జరుగుతున్నా జిల్లా ఎస్పీ స్పందించకపోవటం విచారకరం. మాజీ ఎమ్మెల్యేలు అందరం ఎస్పీని కలిసి విన్నవించాలని నిర్ణయం తీసుకున్నాం. విజయవాడ నుంచి బయలుదేరిన వల్లభనేని వంశీ, కైలే అనిల్కుమార్లను పోలీసులు రానివ్వకుండా నిర్బంధించారు. రేపో, ఎల్లుండో డీజీపీ, ఎస్పీలను కలిసి దాడుల ఘటనలపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం. ఈ దాడుల ఘటనలపై వీడియో ఆధారాలతో హైకోర్టులో ప్రైవేటు కేసు వేస్తున్నాం’ అని పేర్ని నాని తెలిపారు.మేం వస్తున్నాం.. ధైర్యంగా ఉండండి...మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భౌతిక దాడులకు దిగుతూ చేతులు, కాళ్లు విరగ్గొట్టడంతో పాటు గ్రామాల్లో ఉండొద్దని హెచ్చరిస్తున్నారన్నారు. ఈ ఘటనలకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని తెలిపారు. ‘దాడులు జరుగుతుంటే పోలీసులు నిలబడి చూస్తూ ఎంజాయ్ చేస్తుండటం దారుణం.స్థానికంగా దాడులు జరుగుతున్న సమయంలో ఆయా ప్రాంతాల పోలీసులకు సమాచారం అందించినా, స్పందించడం లేదు. వచ్చినా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఈ ఘటనలపై కేసులు కట్టడం లేదు. దాడులు చేస్తున్న వారే కాకుండా దాడులను చూస్తూ మిన్నకుండిపోయిన పోలీసులపై కూడా కేసులు వేస్తాం. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో జిల్లాలోని ముఖ్య నాయకులందరం ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులకు గురైన వారి ఇళ్లకు వెళ్లి ధైర్యం చెబుతాం. ఇకనైనా దాడులు ఆగకుంటే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు పైకి వస్తారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఎదురైతే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు, మచిలీపట్నం, పెడన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), ఉప్పాల రమేష్ (రాము) పాల్గొన్నారు.పేర్ని కిట్టు, నాయకులను అడ్డుకున్న పోలీసులుటీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన బాబి దంపతులను పరామర్శించేందుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బందరు పట్టణంలోని చిలకలపూడి ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే బాబి దంపతులు వైఎస్సార్సీపీ పక్షాన నిలిచారనే నెపంతో కూటమి శ్రేణులు వారి నివాసంపై దాడికి పాల్పడ్డారు. సామగ్రి ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా శనివారం బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తన నివాసం నుంచి నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్దాదా, కార్పొరేటర్లతో కలిసి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి పరామర్శకు వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డుకున్నారు.అదనపు బలగాలను రప్పించి దారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పరామర్శకు అనుమతి ఏమిటని పేర్ని కిట్టు, తదితరులు పోలీసులను దాటుకుని వెళ్లి బాబి దంపతుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. పరామర్శించిన వారిలో కార్పొరేటర్లు మేకల సుబ్బన్న, జోగి చిరంజీవి, ఐనం తాతారావు, మాచవరపు రాంప్రసాద్, పల్లి శేఖర్, పర్ణం సతీష్, శ్రీరాం చిన్నా ఉన్నారు. -
కార్యకర్తల్ని కాపాడుకుంటాం: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్రపతి, గవర్నర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. కళ్లేదుటే దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ మరో బిహార్గా మారుతోందంటూ ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్లపైనా టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. న్యాయపరంగా కోర్టులోనే తేల్చుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు నిర్ణయించారు.టీడీపీ దాడులపై మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు మా పై దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతల, కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారు. దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదు’’ అని కొడాలి నాని ధ్వజమెత్తారు.వైఎస్సార్సీపీపై జరుగుతున్న దాడుల పై హైకోర్టుకు వెళ్తాం. దాడులు చేసిన వారితో పాటు. చూస్తూ ఉన్న పోలీసులపై కేసులు వేస్తాం. రాబోయే రెండు రోజుల్లో కృష్ణాజిల్లాలో పర్యటిస్తాం. గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతాం. కార్యకర్తలను కాపాడుకుంటాం. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తాం. శాంతిభద్రతల సమస్య వస్తే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని కొడాలి నాని చెప్పారు. -
ఇదేం ప్రజాస్వామ్యం ?
-
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ గురించి చేసిన ట్వీట్ ఏ మాత్రం పద్ధతిగా ఉన్నట్లు అనిపించదు. వందల గ్రామాలు, పట్టణాలలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు చెలరేగి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లపై దాడులు చేస్తుంటే ఖండించకపోతే మానే, పరోక్షంగా వాటిని సమర్థిస్తున్నట్లుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.కౌంటింగ్ జరుగుతున్న రోజే వైఎస్సార్సీపీ ఓడిపోతోందని తెలిసిన క్షణం నుంచే టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. గత నాలుగు రోజులుగా కత్తులు, కర్రలతో యథేచ్ఛగా తిరుగుతుంటే, ఎక్కడో ఒకటి, అరచోట తప్ప, మిగిలిన అన్ని ప్రాంతాలలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. హింసాకాండకు ఎవరూ పాల్పడవద్దని చెప్పవలసిన సీనియర్ నేత చంద్రబాబు నాయుడు ఏమని అంటున్నారో చూడండి. "రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి" అని అన్నారు.ఎక్కడైనా ఓడిపోయినవారు కవ్వింపు చర్యలకు దిగే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ ఎక్కడైనా జరిగితే వెంటనే టీడీపీ మీడియా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టి ఉండేది కాదా! ఒకపక్క అంతగా టీడీపీ వారు చెలరేగిపోతున్న సమయంలో ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలు అనడం ఏమిటి? ఆ పేరుతో దాడులు చేసుకోండని చెప్పినట్లు శ్రేణులు అర్థం చేసుకోవా! ఈ నెల పన్నెండున ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పదకుండు రాత్రివరకు ఇలాంటి దాడులు జరుగుతాయన్న ప్రచారం ఉంది. ఈలోగా అనూహ్యంగా ఈనాడు అధినేత రామోజీరావు కన్నుమూశారు కనుక ఈ దాడులను ఏమైనా ఆపుతారేమో చూడాలి.టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం అంటే, వారు దాడులు చేసినప్పుడు వైఎస్సార్సీపీవారు ఏమైనా ప్రతిదాడికి దిగుతారేమో జాగ్రత్త అని చెప్పినట్లు అనిపిస్తుంది తప్ప శాంతిభద్రతలను కాపాడాలని కోరుకున్నట్లుగా లేదు. వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అలర్ట్ గా ఉండి.. ఎటువంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలి అని ఆయన అన్నారు. దీనిని బట్టి టీడీపీ నేతలు ఏమి చేయాలో అర్థం చేసుకోవాలన్నమాట. వైఎస్సార్సీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా కార్యకర్తలు పూర్తి సంయమనం పాటించాలి అని ఆయన సూచించారు. అంతే తప్ప టీడీపీ కార్యకర్తలు దాడులు చేయవద్దని అనడానికి ఇష్టపడడం లేదనుకోవాలి. పోలీసులు సైతం ఇంతవరకు జరిగిన హింసాకాండను వైఎస్సార్సీపీ వారి చర్యగానే చూడాలి తప్ప, టీడీపీ దాడులుగా చూడకూడదని అనుకునే అవకాశం కనిపించడం లేదా?వందల చోట్ల ఈ దాడులు జరిగితే పోలీసులు ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఇదేనా రాజ్యాంగం, చట్టబద్ధపాలన అంటే! పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని ముక్తాయింపుగా చివరిలో ఒక మాట అన్నారు. అసలు ఇది ట్విటర్ లో చెప్పవలసిన విషయమా! పోలీసు డీజీపీ తదితర ఉన్నతాధికారులను పిలిచి సమీక్షించి, లేదా వారికి ఫోన్ చేసి వెంటనే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఏపీకి చెడ్డపేరు రాకుండా చూడాలని చెప్పవలసిన చంద్రబాబు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే వచ్చే రోజులు ఇంకెంత భయానకంగా ఉంటాయో అనే సందేహం వస్తుంది.అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎవరు హింసాయుత చర్యలకు దిగినా తప్పే. గ్రామాలలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలపై దాడులు చేస్తే అది వైఎస్సార్సీపీ మూకల చర్యలు అని అనుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లుగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయడం, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది పనుల శిలాఫలకాలు ధ్వంసం చేయడం వైఎస్సార్సీపీవారి పనేనని టీడీపీ చెప్పేలా ఉంది. మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశి, కొడాలి నాని, తదితరుల ఇళ్లపైకి దాడి చేసింది వైఎస్సార్సీపీ మూకలని చెప్పదలిచారా? ఒక పక్క టీడీపీ జెండాలతో కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు, అసాంఘీక శక్తులు స్వైర విహారం చేస్తుంటే, వైఎస్సార్సీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డా సంయమనంగా ఉండాలని టీడీపీ వారిని కోరుతున్నానని చంద్రబాబు అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. రాజ్యాంగ విధులను కాలరాయడమే.గతంలో ఏ ఒక్క చిన్న ఘటన జరిగినా నానా హడావుడి చేసిన చంద్రబాబు ఇప్పుడు తాపీగా ఒక కామెంట్ ను అది కూడా ట్విటర్ లో చేసి ఊరుకున్నారు. ఇది సమంజసమేనా? కానీ దీని గురించి ఆయనను అడిగేదెవ్వరు. ప్రశ్నిస్తానని చెబుతూ రాజకీయాలలోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా గెలిచానన్న ఆనందంలో ఇలాంటివాటిపై కనీసం స్పందించలేకపోతున్నారు. జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులను కూడా ఆయన నిరోధించడం లేదు. ఈ నేపధ్యంలోనే టీడీపీ నేత వర్మ కారుపై జనసేన కార్యకర్తలు చేసిన దాడిని కూడా ఆయన ఖండించినట్లు అనిపించడం లేదు. ఇక లోకేష్ ఎర్రబుక్ సిద్ధం అంటూ ఆయా చోట్ల టీడీపీ వారు ప్లెక్సీలు పెడుతున్నారని కొందరు చెబుతున్నారు. అది మరింత రెచ్చగొట్టే చర్య అవుతుంది. అధికారంలోకి వచ్చాక కూడా అలాంటివాటిని ప్రోత్సహిస్తే విపరిణామాలు ఎదురవుతాయి.వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి ఘటనలు దాదాపు జరగలేదు. అయినా హింసాకాండ అంటూ తమకు మద్దతు ఇచ్చే మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేయించారు. ఇప్పుడు ఆ మీడియాలో ప్రస్తుత హింసకు సంబంధించి కథనాలేవీ ప్రముఖంగా రావడం లేదు. ఈ పరిస్థితిలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన పార్టీ నేతలతో జిల్లాలవారీగా కమిటీలు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పే యత్నం చేస్తున్నారు. బహుశా ఆయన కూడా కొద్ది రోజులలో టీడీపీ దాడులవల్ల తీవ్రంగా గాయపడిన, ఆస్తులు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పవచ్చు.కొద్ది మంది ఈ దాడులలో గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వైఎస్సార్సీపీ ఓటమి భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మస్థైర్యంతో ఉండవలసిన సమయం ఇది. ఏ పార్టీకి అయినా గెలుపు, ఓటములు ఉంటాయి. జగన్ అన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం కొలువు తీరకముందే ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలను కుప్పకూల్చారనిపిస్తుంది. చంద్రబాబు కక్షలకు ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందని ఆయన అన్నారు. చివరికి యూనివర్సిటీలలో కూడా టీడీపీ శక్తులు అరాచకం సృష్టిస్తుంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయితే ఎవరికి చెప్పుకోవాలి.ప్రధానమంత్రి మోదీ కూడా ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియదు. దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా మాట్లాడే ప్రధాని ఏపీని మాత్రం విస్మరించడం బాధాకరం. ఈ హింసాకాండలో బాధితులైన కార్యకర్తలకు అండగా ఉంటానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కచ్చితంగా బాధితులకు ధైర్యం చెప్పవలసిన సమయం ఇది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారి బయటకు వచ్చి ఆయా ప్రదేశాలకు వెళ్లి పరిశీలన చేస్తే వైఎస్సార్సీపీ క్యాడర్ కు నైతికబలం వస్తుంది. అలాగే రెచ్చిపోయే టీడీపీ మద్దతుదారులు కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని చెప్పాలి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలు చేస్తున్న అరాచకాలకు ముగింపు పలికేలా చర్యలు తీసుకోకపోతే ఆయన మళ్లీ 2014నాటి పాలనను పునరావృతం చేయడానికే సిద్ధపడుతున్నారన్న సంకేతాలు వెళతాయని అర్థం చేసుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బార్పై టీడీపీ శ్రేణుల దాడి...
నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట శివారు జొన్నలగడ్డ రోడ్డులో తాను నిర్వహిస్తున్న పల్నాడు బార్ అండ్ రెస్టారెంట్పై టీడీపీకి చెందిన వ్యక్తులు దాడిచేసి రూ.1.40 లక్షల విలువైన మద్యం అపహరించారని బార్ యజమాని, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు షేక్ నూరుల్ అక్తాబ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. బార్కు బలవంతంగా తాళాలు వేశారని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... ‘తొలుత గురువారం నాకు ఓ వ్యక్తి ఫోన్ చేసి నూతన ఎమ్మెల్యేతో మాట్లాడుకున్న తర్వాతే బార్ వ్యాపారం చేయాలని చెప్పారు. ఈ మేరకు నేను బార్కు తాళాలు వేసి వెళ్లాను. అనంతరం రాత్రి 10గంటల సమయంలో ఇద్దరు టీడీపీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో 20మంది బార్ వద్దకు వచ్చి తాళాలు పగులకొట్టి కౌంటర్లోని మద్యం బాటిళ్లను తీసుకెళ్లారు. అదే సమయంలో మీ యజమాని వచ్చి మా ఎమ్మెల్యేను కలవాలని వారు అక్కడున్న సిబ్బందిని హెచ్చరించారు. వారు వెంట తెచ్చుకున్న తాళాలను బార్కు వేసుకుని వెళ్లారు. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే బార్ వద్దకు వెళ్లి తాళాలను పరిశీలించి జిల్లా ఎస్పీ మలికాగార్గ్కు ఫోన్ చేసి విషయం తెలియజేశాను.’ అని షేక్ నూరుల్ అక్తాబ్ పేర్కొన్నారు. తాను ఎస్పీకి ఫోన్లో సమాచారం ఇచ్చిన వెంటనే రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ రోశయ్య, పోలీసు సిబ్బంది వచ్చి పరిశీలించారని తెలిపారు. శుక్రవారం రూరల్ పోలీసు అధికారులు, క్లూస్టీమ్, ఎక్సైజ్ ఎస్ఈబీ సీఐ నయనతార, ఎస్ఐలు వచ్చి పంచనామా చేసి స్టాకు వివరాలు తనకు ఇచ్చారని చెప్పారు. తన ఫిర్యాదు మేరకు నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. -
విశ్వవిద్యాలయాలపై టీడీపీ దాడులు
తిరుపతి (తిరుపతి జిల్లా): చదువుల నిలయాలైన విశ్వవిద్యాలయాలపై తెలుగుదేశం పార్టీ మూకలు దాడులకు దిగుతున్నాయి. రెండు రోజుల క్రితం వైద్య విశ్వవిద్యాలయంపై దాడికి పాల్పడిన టీడీపీ వర్గాలు శుక్రవారం రాయలసీమకే తలమానికమైన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వీఎస్యూ) పై దాడులకు తెగబడ్డాయి. సుమారు 50 మంది టీడీపీ కార్యకర్తలు శుక్రవారం ఎస్వీయూలోకి కర్రలు, రాడ్లతో చొరబడ్డారు. నేరుగా పరిపాలన భవనంలోకి ప్రవేశించి, వైస్ చాన్సలర్ (వీసీ) శ్రీకాంత్రెడ్డి చాంబర్లోకి దూసుకెళ్లారు. ఆయనపైకి నీళ్ల సీసాలు, కర్రలు విసురుతూ దాడి చేశారు. అక్కడ ఉన్న ఫైళ్లను విసిరేశారు. ‘వెంటనే రాజీనామా చేయరా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పడిపోయినా ఇంకా సీటులో కూర్చున్నావా’ అని హెచ్చరిస్తూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. వీసీపై టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్నారని ఉద్యోగులు సమాచారమిచ్చినా పోలీసులు పట్టించుకున్న పాపానపోలేదు. ఓ పక్క టీడీపీ మూకల వీరంగం, మరోపక్క పోలీసులు పట్టించుకోకపోవడంతో వర్సిటీ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు.వారి సీట్ల నుంచి లేచి పరుగులు పెట్టారు. మహిళా ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. వీసీపై దాడులు, ఉద్యోగులు పరుగులు తీస్తున్న దృశ్యాలను కొన్ని మీడియా సంస్థలు ఉత్సాహంగా వీడియోలు తీయడం కనిపించింది. టీడీపీ దాడులు, ఆ మీడియా అత్యుత్సాహాన్ని వర్సిటీ సిబ్బంది, ప్రజలు తప్పుపడుతున్నారు. వర్సిటీకి సంబంధం లేని బయట వ్యక్తులు వర్సిటీలోని ప్రవేశించడం దారుణమని, ఆ మీడియా సంస్థల తీరూ గర్హనీయమని విమర్శిస్తున్నారు.వీఎస్యూలో శిలాఫలకాలను ధ్వంసం చేసిన టీడీపీ నాయకులువెంకటాచలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్యూ) లో పలు శిలాఫలకాలను టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. వీఎస్యూలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుతో సెంట్రల్ లైబ్రరీని వైస్ చాన్సలర్ జీఎం సుందరవల్లి ఇటీవల ప్రారంభించి, శిలాఫలకాలను ఆవిష్కరించారు. శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో వర్సిటీలోకి ప్రవేశించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వీరంగం సృష్టించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అనంతరం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన భవనం వద్దకు చేరుకున్నారు. వీఎస్యూలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో భవనాన్ని ఎలా నిర్మిస్తారని, ఆయన విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిపాలన భవనంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించాలని, లేకుంటే తామే ధ్వంసం చేస్తామని అధికారులను హెచ్చరించారు. దేవాలయం వంటి విశ్వవిద్యాలయంలో టీడీపీ నాయకులు దాడులు చేయడంపై అధ్యాపకులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
స్టేషన్లో పులివర్తి గ్యాంగ్ వీరంగం
సాక్షి, నెట్వర్క్: ఎన్నికల అనంతరం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో స్వైర విహారం చేస్తున్న టీడీపీ కార్యకర్తలు ఏకంగా పోలీసు స్టేషన్లోనే అధికారులపై దాడులకు తెగబడ్డాయి. విజయోత్సవ ర్యాలీల ముసుగులో వైఎస్సార్సీపీ శ్రేణులపై భౌతిక దాడులకు తెగబడుతున్న పచ్చ ముఠాలు నియోజక వర్గంలో భయానక పరిస్థితులను సృష్టించాయి. రెండు రోజుల క్రితం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, వార్డు సభ్యుడిపై దాడులకు దిగగా తాజాగా మరో కార్యకర్తపైనా టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 16 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డాయి. వందల మందిని వెంటేసుకుని: చంద్రగిరిలోని కొత్తపేటకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త అంగేరి రాజశేఖర్ శుక్రవారం ఉదయం ఓ దుకాణం వద్ద ఉండగా టీడీపీకి చెందిన ఉగ్రాణం గురునాథం మరి కొందరితో కలసి దాడి చేశాడు. గాయపడ్డ బాధితుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు టీడీపీ నాయకులను స్టేషన్కు రప్పించారు. ఈ విషయం తెలిసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు సుమారు 200 మంది అక్కడకు చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మస్తాన్ను స్టేషన్కు పిలిపించాలని సీఐనే ఆదేశించారు. అనంతరం అక్కడకు చేరుకున్న మస్తాన్ను టీడీపీ కార్యకర్తలు చంద్రగిరి పోలీసు స్టేషన్ లోనే డీఎస్పీ రవికుమార్, సీఐ రామయ్య కళ్లెదుటే, సీసీ కెమెరాల సాక్షిగా చితకబాదారు.సీఐ, డీఎస్పీపై దాడి మస్తాన్పై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సీఐ, డీఎస్పీలపై సైతం టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. దాడుల్లో డీఎస్పీ కింద పడిపోగా సీఐ తృటిలో తప్పించుకున్నారు. దీంతో పోలీసు సిబ్బంది డీఎస్పీని లోపలికి తరలించారు. అనంతరం నాని అనుచరులు మస్తాన్తో క్షమాపణ చెప్పించుకుని పంపించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు సమాచారం. దాడి ఘటనను వైఎస్సార్సీపీ శ్రేణులు ఎస్పీ దృష్టికి తెచ్చాయి.పాకాలలో పూల అంగడి ధ్వంసం ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అనుకూలంగా పని చేశాడనే కక్ష్యతో పాకాలలో పూల అంగడి నిర్వహిస్తున్న సతీ‹Ùను పులవర్తి నాని అనుచరులు చితకబాదారు. పూల అంగడిని ధ్వంసం చేసి పూలన్నీ రోడ్డుపై పారబోశారు. స్థానికులు వారించడంతో ని్రష్కమించారు. -
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చిందని మండిపడ్డారు. టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయని, యంత్రాంగం మొత్తం నిరీ్వర్యం అయిపోయిందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని, పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయిందని చెప్పారు.ఉన్నత చదువులకు కేంద్రాలైన యూనివర్సిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బ తీసి, కేవలం మూడు రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి, పౌర స్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోందని, గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, తన అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్సీపీ తోడుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు. -
పిఠాపురం వర్మపై జనసేన దాడి
కాకినాడ, సాక్షి: పిఠాపురం టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగారు. రాళ్లు, కొబ్బరికాయలతో దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్తో మంతనాలు జరిపేందుకు వర్మ వెళ్లారు.ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి వర్మను అడ్డుకున్నారు. ‘మాకు తెలియకుండా మా గ్రామం ఎందుకు వచ్చారు.. మాకు తెలియకుండా మా గ్రామంలో ఇతర పారీ్టల వాళ్లను ఎందుకు కలుస్తున్నారు’ అంటూ వర్మను నిలదీశారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ వర్మ వారికి బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు.రాళ్లు, కొబ్బరి కాయలతో వర్మ కారుపై దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. వారి నుంచి తప్పించుకుని ఆయన కారులో వేగంగా వెళ్లిపోయారు. వర్మపై దాడి విషయం తెలియడంతో గొల్లప్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జనసేన నేతలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా వారు శాంతించలేదు. జనసేన నేతల దాడి నుంచి తప్పించుకుని వచ్చిన వర్మ గొల్లప్రోలు– చేబ్రోలుకు మధ్యలో ఉన్న తన గెస్ట్హౌస్కు చేరుకోగా పోలీసులు ఆయనకు రక్షణ ఏర్పాట్లు చేశారు. నన్ను చంపడానికి ప్రయత్నించారు: వర్మ ఎన్నికల్లో పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలపడానికి వెళితే జనసేన శ్రేణులు తనపై దాడి చేశాయని టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. ఆయన శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు చిలకపూరి ప్రభాకరరావు పిలుపు మేరకు సర్పంచ్లు ఎన్నికల్లో తమకు అనుకూలంగా పని చేశారన్నారు. దీంతో తాను సర్పంచ్ను కలిసి కృతజ్ఞతలు తెలపడానికి వన్నెపూడి వెళ్లానన్నారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన మాజీ టీడీపీ నేతలు, ప్రస్తుతం అధికారం కోసం జనసేనలోకి వెళ్లిన కొందరు నేతలు తనపై దాడికి దిగారని ఆరోపించారు. తనపై ఇటుకలు, గాజు గ్లాసులు, డ్రింక్ సీసాలు, కంకర రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దాడిలో తనతో పాటు మరికొందరికి గాయాలయ్యాయన్నారు. అల్లరి మూకలను జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. జనసేన నేతలు తనను చంపడానికి ప్రయతి్నంచారని ధ్వజమెత్తారు. 9 నెలలుగా ఉదయ్ తనను వేధిస్తున్నాడని.. జనసేనకు పనిచేయడం తన ఖర్మ అని వ్యాఖ్యానించారు.తనపై హత్యాయత్నం వెనుక ఉదయ్ హస్తం ఉందని ఆరోపించారు. తనపై దాడి చేస్తున్నప్పుడు వన్నెపూడికి చెందిన టీడీపీ కార్యకర్తలు సుమారు 150 మంది తనకు రక్షణ వలయంగా ఉండడంతో తాను బయటపడ్డానన్నారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ గొల్లప్రోలు పోలీసు స్టేషన్ వద్ద వర్మ టీడీపీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. -
వైఎస్సార్ సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారు: పేర్నినాని
-
అరాచకాన్ని అరికట్టండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులపై యథేచ్ఛగా కొనసాగుతున్న దాడులు, హింసాకాండను తక్షణం అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ను పార్టీ కోరింది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల విడుదల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న వేళ అల్లరిమూకలు సంధి కాలాన్ని ఎంపిక చేసుకుని విధ్వంసాలకు తెగబడటం వెనుక పక్కా కుట్ర ఉందని స్పష్టం చేసింది.అరాచక శక్తులు చెలరేగుతున్నా పోలీసు యంత్రాంగం ఉదాశీనంగా వ్యవహరించడం పరిస్థితిని మరింత దిగజారుస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేలా తక్షణం కఠిన చర్యలకు ఆదేశించాలని కోరింది. ఈమేరకు రాష్ట్రపతి, గవర్నర్కు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఎస్.నిరంజన్ రెడ్డి గురువారం విడివిడిగా లేఖలు రాశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టి ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించాలని డీజీపీ హరీశ్కుమార్ గుప్తాను మరో లేఖ ద్వారా కోరారు. ఆ లేఖల్లో పేర్కొన్న వైఎస్సార్సీపీ ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఇవీ..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, పిల్లలపై దాడులు..రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై అసాంఘిక శక్తులు యథేచ్చగా హింసాకాండకు పాల్పడుతున్నాయి. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతు తెలిపిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలు, పిల్లలపై దాడులకు దిగడంతోపాటు ఇక మీదట మరింత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బహిరంగంగానే హెచ్చరిస్తున్నాయి. బాధిత కుటుంబాలు ప్రాణ భయంతో ఇళ్లు, గ్రామాలను విడిచిపెట్టి వెళుతున్నాయి. వైఎస్సార్సీపీకి చెందినవారి ఆస్తులపై దాడులు చేస్తూ జీవనాధారాన్ని నాశనం చేస్తుండటంతో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు శాఖ నిర్లిప్తతఅల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్న ఉదంతాలు ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలో ప్రసారమవుతున్నా పోలీసు యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందనా లేదు. పరిస్థితి తీవ్రతను ఏమాత్రం పట్టించుకోకుండా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. గత 24 గంటల్లో దాడులు, దౌర్జన్యాలు అమాంతం పెరగడం వెనుక పక్కా కుట్ర ఉంది. ఇవిగో ఆధారాలు వైఎస్సార్సీపీనేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై రౌడీమూకల దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసకాండకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, మీడియాలో ప్రచురితమైన కథనాలను మీకు సమర్పిస్తున్నాం. వాటిని పరిశీలించి రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న విధ్వంసకాండ తీవ్రతను గుర్తించాలని కోరుతున్నాం. తక్షణం దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించాలి. శాంతి భద్రతలను కాపాడి ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించండి. -
ఊరూరా విధ్వంసం.. అదే టీడీపీ లక్ష్యం
తెనాలి అర్బన్/బైరెడ్డిపల్లె (చిత్తూరు జిల్లా)/మదనపల్లె /విజయనగరం ఫోర్ట్/నాడెండ్ల/ తాడికొండ: అధికారం వచ్చిందన్న సంతోషం ముసుగులో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై ఓ వైపు దాడులు కొనసాగిస్తూ ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేస్తున్నారు. శిలాఫలకాలు, సచివాలయాల బోర్డులను పగులగొడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ దాడులను ఆపాల్సిన ఆ పార్టీ పెద్దలు చోద్యం చూస్తుండటం పట్ల ప్రజలు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకేనా అధికారం కట్టబెట్టిందంటూ మండిపడుతున్నారు. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో కొందరు అధికార పార్టీ నాయకులు విధ్వంసానికి దిగారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ధ్వంసం చేయడమే కాకుండా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై బుధవారం రాళ్లతో దాడి చేశారు. చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్లో నాడు–నేడు పథకం కింద అదనపు తరగతి గదులు నిర్మించారు. దానిని అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కూటమి గెలుపొందడంతో కొందరు అధికార పార్టీ నాయకులు బుధవారం రాత్రి పాఠశాలలోనికి వెళ్లి శిలాఫలకాన్ని పగలకొట్టారు. రణరంగచౌక్లో ఉన్న వైఎస్సార్ విగ్రహంపై రాళ్లతో దాడి చేశారు. కొద్ది రోజుల క్రితం విగ్రహం సమీపంలో టైల్స్, రిటైనింగ్ వాల్స్ నిర్మించారు. దాదాపు 80 శాతం పని పూర్తయింది. మిగిలిన పని పూర్తి చేసేందుకు సదరు కాంట్రాక్టర్ సిద్ధమయ్యారు. ఇంతలో ఎన్నికల ఫలితాలు రావడం.. తెనాలి ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ గెలవడం జరిగింది. దీంతో కొందరు టీడీపీ నాయకులు నిర్మాణ పనులు జరపడానికి వీలులేదని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులపై హుకుం జారీ చేశారు. దీంతో అధికారులు సదరు కాంట్రాక్టర్ను ఆ పనులు పూర్తి చేయొద్దని అడ్డుకుంటున్నారు. వెల్నెస్ సెంటర్ బోర్డు ధ్వంసంపలమనేరు నియోజకవర్గం బైరెడ్డి మండలంలోని కంభంపల్లె సచివాలయ పరిధిలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రాల శిలాఫలకాలను, వెల్నెస్ సెంటర్ బోర్డును టీడీపీ కార్యకర్తలు బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలపై జగన్ బొమ్మ కనిపిస్తే ధ్వంసం చేస్తాం అంటూ దుర్భాషలాడుతూ హంగామా సృష్టించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించామనే గర్వంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దాడులు ఆపకపోతే మొదట్లోనే చెడ్డపేరు రావడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు. సిమెంట్ బల్లలు ధ్వంసంపల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం సంకురాత్రిపాడు గ్రామంలో బుధవారం రాత్రి టీడీపీ వర్గీయులు గ్రామ సచివాలయం వద్ద బీభత్సం సృష్టించారు. సచివాలయం భవనంపైకి ఎక్కి.. బోర్డులు, శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ట్రాక్టర్తో దిమ్మెలు కూలగొట్టారు. బొడ్డురాయి సెంటర్లో ఉన్న వైఎస్సార్సీపీ జెండాను చింపేశారు. సచివాలయం సమీపంలో దాతలు ఏర్పాటు చేసిన సిమెంటు బల్లలను ధ్వంసం చేశారు. సచివాలయంపై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు కట్టారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ పథకం దిమ్మెను సైతం ధ్వంసం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేరుపై పేడ అలికారు. నాదెండ్ల మండలంలోని ఇర్లపాడు గ్రామం ఎస్సీ కాలనీలో టీడీపీ వర్గీయులు గొడ్డళ్లు, కర్రలతో వైఎస్సార్ విగ్రహం తల, చేతులను విరగ్గొట్టారు. బైక్లకు టీడీపీ జెండాలు కట్టుకుని బాణసంచా కాలుస్తూ కాలనీలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.పోలీసుల సాక్షిగా విగ్రహాల ధ్వంసంగుంటూరు జిల్లా తుళ్లూరులో తెలుగుదేశం పార్టీ నాయకుల వికృత చేష్టలు, విగ్రహాల విధ్వంసాల పరంపర కొనసాగుతూనే ఉంది. పోలీసు కాపలా ఉన్నప్పటికీ వారి ఎదుటే తుళ్లూరులో రెండు విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. తుళ్లూరు గ్రామానికి చెందిన ఆలూరి శివ, మూల్పూరి నరేష్ అనే టీడీపీ నాయకులు అర్ధరాత్రి తుళ్లూరు తులసీ థియేటర్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం తల పగలగొట్టి కాలువలో పడవేశారు. అనంతరం ఎస్సీ కాలనీలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు వచ్చి సుత్తితో ధ్వంసం చేస్తుండగా ఎస్సీ కాలనీకి చెందిన వారు అడ్డుకొనేందుకు యత్నించగా వారిపై దాడి చేశారు. ఈ తంతు అంతా పోలీసులు కాపలాగా ఉన్నప్పుడే జరగడం గమనార్హం. ప్రశ్నించిన వారిపై విచక్షణా రహితంగా దాడులకు దిగడంతో ఇరు వర్గాల మధ్య వివాదం ముదిరి తోపులాట జరిగింది. అప్పుడు తీరిగ్గా పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.ఆస్పత్రి బోర్డు తొలగింపు విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నేమ్ బోర్డును గురువారం సాయంత్రం టీడీపీ కార్యకర్తలు తొలగించారు. ఈ ఘటనను చూసిన ఆస్పత్రికి వచ్చిన రోగులు, వైద్య సిబ్బంది అవాక్కయ్యారు. అధికారం వచ్చి రెండు రోజులు కాకముందే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంతలా దౌర్జన్యానికి దిగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు మాట్లాడుతూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. పార్కు బోర్డ్ పగులగొట్టిన దుండగులుఅన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని వైఎస్సార్ సొసైటీ కాలనీలోని మున్సిపల్ పార్క్ నేమ్ బోర్డ్ను గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. గురువారం ఉదయం నేమ్ బోర్డ్ ధ్వంసం చేసిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులు, మీడియాకు సమాచారం అందించారు. నేమ్బోర్డ్లో వైఎస్సార్ పేరును మాత్రమే చెరిపివేసి, మిగిలిన అక్షరాలను అలాగే ఉంచడంపై ప్రజలు అనుమానం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
టీడీపీ దాడులపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని, గవర్నర్ వెంటనే జోక్యం చేసుకొని పచ్చ మూకల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అరాచకాలను తీవ్రంగా ఖండించారు. దాడులను అడ్డుకోవాలని గురువారం ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా గవర్నర్కు విజ్ఞప్తి చేయడంతో పాటు, పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది.ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. ఐదేళ్లు పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలి. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం’ అని పేర్కొన్నారు. -
‘అనంత’లో టీడీపీ దౌర్జన్యకాండ
అనంతపురం: ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ కార్యకర్తలు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అరాచకాలు సృష్టిస్తున్నారు. గురువారం కూడా వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడ్డారు. ఉరవకొండలోని కణేకల్లు క్రాస్ వద్ద హోటల్లో బుధవారం టీ తాగుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఒక్కసారిగా తల, కాళ్లు, చేతులపై కర్రలతో దాడి చేశారు. ఇంత జరుగుతున్నా అక్కడే బందోబస్తులో ఉన్న స్పెషల్ పార్టీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో వైఎస్సార్సీపీ వార్డు సభ్యురాలు ఆశాబీ ఇంట్లోకి టీడీపీ కార్యకర్తలు చొరబడి ఆమె కుమారులు అక్బర్, ఇర్ఫాన్లపై దాడి చేశారు. చిలమత్తూరు మండలంలోని వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల వద్దకు టీడీపీ కార్యకర్తలు వెళ్లి దాడులకు తెగబడ్డారు. బుధవారం వైఎస్సార్సీపీ కార్యకర్త నరసింహమూర్తిపై దాడి చేసి, తల పగులగొట్టారు. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త నాగభూషణం ఇంట్లో చొరబడి దాడికి యత్నించారు.తాడిమర్రి మండలం ఎం.అగ్రహారంలో గ్రామ సచివాలయం శిలాఫలకాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆత్మకూరు మండలం గొరిదిండ్లలో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బొమ్మనహాళ్ మండలం దేవగిరిలో సచివాలయం ఆర్చ్పై ఉన్న వైఎస్సార్ బొమ్మను ధ్వంసం చేశారు. సచివాలయం, రైతు భరోసా శిలా ఫలకాలను ధ్వంసం చేసేందుకు యతి్నంచగా స్థానికులు అడ్డుకున్నారు. ఉప్పరపల్లిలో సచివాలయం, ఆర్బీకే బోర్డులను ధ్వంసం చేశారు. -
మా ప్రాణాలు కాపాడండి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు, సానుభూతిపరులపై ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై రాజకీయ ప్రత్యర్థులు, అసాంఘిక శక్తులు దాడులతో వ్యవస్థీకృత హింసకు పాల్పడుతుండటంపై బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గ్రామాలు, ఆస్తులను వదిలేసి కట్టుబట్టలతో వెళ్లకుంటే హతమారుస్తామంటూ హెచ్చరిస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తూ పిల్లలు, మహిళలను సైతం హింసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ఘటనలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయని విన్నవించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న వ్యవస్థీకృత హింసను సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా స్వీకరించి ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించాలని అభ్యర్థించారు. వ్యవస్థీకృత హింసకు సంబంధించి మీడియా కథనాలు, సోషల్ మీడియా వీడియోల సాక్ష్యాధారాలతో బాధితులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి గురువారం ఈ–మెయిల్ ద్వారా పిర్యాదు చేశారు. బాధితుల ఆక్రందన ఇదీ..⇒ ప్రస్తుతం రాష్ట్రంలోని పాలనా యంత్రాంగంలో నెలకొన్న అస్థిర పరిస్థితులను ఆసరాగా చేసుకుని అసాంఘిక శక్తులు వైఎస్సార్సీపీ మద్దతుదారులు, సానుభూతిపరులు, పిల్లలు, మహిళలపై వ్యవస్థీకృత హింసకు పాల్పడుతున్నాయి. ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. ⇒ పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించడంతో అసాంఘిక శక్తులు యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడుతున్నాయి. గత 24 గంటల్లో హింసాత్మక సంఘటనలు భారీగా పెరిగాయి. ⇒ సర్వోన్నత న్యాయస్థానం తక్షణమే స్పందించి చర్యలకు ఆదేశించకుంటే ఈ వ్యవస్థీకృత హింస నుంచి బాధితులకు రక్షణ లభించదు. ఈ అంశాన్ని సుమోటో పిల్గా స్వీకరించి విచారించాలి. రాష్ట్ర ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడాలి. -
కార్యకర్తలను కాపాడుకుంటాం
అనంతపురం కార్పొరేషన్: ప్రాణాలు అడ్డువేసైనా టీడీపీ దాడుల నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలను కాపాడుకుంటామని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్పారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్తో కలిసి ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 4 గంటల్లోనే రాప్తాడులో 27 అవాంఛనీయ ఘటనలు జరిగాయని ప్రకాష్రెడ్డి చెప్పారు. కనగానపల్లి మండలంలోని 7 గ్రామాల్లో, రామగిరిలో 6 గ్రామాల్లో, చెన్నేకొత్తపల్లిలో 7 గ్రామాల్లో, ఆత్మకూరులో 5 ప్రాంతాల్లో, రాప్తాడులో రెండోచోట్ల వైఎస్సార్ïÜపీ శ్రేణులు, వారి ఆస్తులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారన్నారు.చాలామందికి తీవ్ర గాయాలై ఆస్పత్రుల పాలయ్యారని చెప్పారు. గొరిదిండ్లలో వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చారన్నారు. ఎస్కేయూలోనూ వైఎస్సార్ విగ్రహాన్ని తొలగిస్తున్నారని అన్నారు. ఈ దాడులపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎవరిపైనా తమ నాయకులు, కార్యకర్తలు ఇలా దాడులకు పాల్పడలేదని తెలిపారు. ఎవరెంతగా రెచ్చగొట్టినా శాంతియుతంగా ఉండాలని కార్యకర్తలకు చెప్పామని, అది వైఎస్సార్సీపీ నైజమన్నారు. పార్టీ శ్రేణులపై దాడులు జరుగుతున్నా ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆ పార్టీ పెద్దలు నోరుమెదపడం లేదన్నారు. పోలీసు వ్యవస్థను నమ్ముదామని, వారు స్పందించకుంటే కోర్టులను ఆశ్రయిద్దామని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించి, మంచి చేస్తే స్వాగతిద్దామన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తారా? ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఇస్తారా? సీపీఎస్ రద్దు చేస్తారా? 20 లక్షల ఉద్యోగాలిస్తారా అని ప్రశ్నించారు. తాలిబన్ల తరహాలో దాడులు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. టీడీపీ శ్రేణులు తాలిబన్ల తరహాలో దాడులకు పాల్పడుతున్నారన్నారు. తమ ప్రాణాలను అడ్డు వేసైనా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. దాడులపై జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిలో మనోధైర్యాన్ని నింపుతామని తెలిపారు. -
Israel-Hamas war: శరణార్థుల శిబిరంపై దాడి.. 33 మంది మృతి
డెయిర్ అల్ బలాహ్(గాజా): ఇజ్రాయెల్ బలగాలు సెంట్రల్ గాజాలో వరుస దాడులు కొనసాగిస్తున్నాయి. నుసెయిరత్లోని అల్–సర్డి స్కూల్పై గురువారం వేకువజామున జరిపిన దాడుల్లో 14 మంది చిన్నారులు, 9 మంది మహిళలు సహా మొత్తం 33 మంది చనిపోయారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అల్–సర్డి స్కూల్లో శరణార్థి శిబిరం నడుస్తోంది. ఉత్తర గాజాలోకి ఇజ్రాయెల్ ఆర్మీ ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి ప్రాణాలరచేతిలో పట్టుకుని వచ్చిన వారంతా ఈ శిబిరంలో తలదాచుకుంటున్నారు. అయితే, హమాస్ మిలిటెంట్లు ఈ స్కూల్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలటరీ ఆరోపిస్తోంది. కాగా, గురువారం ఇజ్రాయెల్ ఆర్మీ నుసెయి రత్లోనే మరో నివాస భవనంపై జరిపిన దాడిలో మరో ఆరుగురు మృత్యువాత పడ్డారు. అల్–అక్సా మార్టిర్స్ ఆస్పత్రి క్షతగా త్రులతో కిటకిటలాడుతోందని స్థానికులు తెలిపారు. విద్యుత్ సరఫరా కూడా ఆస్పత్రి లోని కొన్ని ముఖ్యమైన వార్డుల్లోనే ఉందని చెప్పారు. మృతదేహాలతో కూడిన ప్లాస్టిక్ బ్యాగులు ఆవరణలో వరుసగా పడేసి ఉన్నాయని, బాధితుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోందన్నారు. -
పార్టీ శ్రేణులకు అండగా నిలవండి: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రజలకు మంచి చేశాం.. కచ్చితంగా పార్టీ ఫునర్వైభవం సాధించి తీరుతుందని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద నమ్మకం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ నేతలు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, పోటీచేసిన అభ్యర్థులు గురువారం సాయంత్రం తాడేపల్లికి వెళ్లి వైఎస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ దాడుల గురించి నేతలు ప్రస్తావించగా.. పార్టీ తరఫున న్యాయపరమైన చర్యలకు వెళ్తున్నామని, ఈ టైంలో పార్ట శ్రేణులకు అండగా నిలవాలంటూ నేతలకు వైఎస్ జగన్ సూచించారు.వైఎస్ జగన్తో పార్టీ నేతలు.. ‘‘ప్రజలకు మంచి చేశాం, కచ్చితంగా పార్టీ పునర్ వైభవం సాధిస్తుందనే నమ్మకం మాకుంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో జీవన ప్రమాణాలు పెంచడానికి మీరు(జగన్ను ఉద్దేశించి) చేసిన విశేష కృషి కచ్చితంగా ప్రజల మనసుల్లో నిలిచిపోయింది. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాల్లో తీసుకొచ్చిన గణనీయమైన మార్పులు ప్రజల జీవితాలను మార్చేదిశగా గొప్ప అడుగులుగా నిలిచిపోతాయి. .. ఈవీఎం మేనేజ్మెంట్ అనుమానాలు, ఈసీ–కొంతమంది పోలీసు అధికారుల కుట్రల నేపథ్యంలో కూడా సీట్లు గణనీయంగా తగ్గిపోయాయి. అయినా కూడా 40శాతం ఓటింగ్ వచ్చిందంటే సంక్షేమ పథకాలే కారణం. గడచిన ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉన్నాయి.. ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తాం. గడచిన ఐదేళ్లు సుపరిపాలనకు ఒక గీటురాయిలా నిలిచిపోతుంది. .. కొన్నిరోజుల్లో రానున్న కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలుపై కచ్చితంగా ప్రజల దృష్టిఉంటుంది. ఈ ఐదేళ్లపాలనతో కచ్చితంగా బేరీజు వేసుకుంటారు. మాటమీద నిలబడి, ఇచ్చిన హామీలను నెరవేర్చిన విశ్వసనీయ పార్టీగా వైఎస్సార్సీపీకి ప్రజల మనసులో చోటు ఉంది. పార్టీ పునర్వైభవానికి గట్టి పునాది కూడా ఇదే. .. ఎన్నికలు జరిగిన తీరుపై అనే సందేహాలున్నాయి. మన పార్టీ అనుకూల గ్రామాల్లో కూడా ఓట్లు రాకపోవడంపైనా అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల వ్యవహారంపై ఒక పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో అక్రమాలకు తెర తీశారు. ఎన్నికల సంఘం కూటమి అనుకూల అధికారులు, పోలీసు అధికారుల మధ్య కుమ్మక్కు నడిచింది. వైఎస్సార్సీపీ నాయకుల్ని, కార్యకర్తలను ఉద్దేశ పూర్వకంగా భయభ్రాంతులకు గురిచేశారు. పోలింగ్ సమయంలో భయానక పరిస్థితులు సృష్టించారు’’ అని నేతలు పార్టీ అధినేత వద్ద ప్రస్తావించారు.రాష్ట్రవ్యాప్తంగా దాడులు:కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులపై పార్టీ నాయకులు, వైఎస్ జగన్ వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్మాదంతో స్వైరవిహారం చేస్తున్నారని, ఎక్కడికక్కడ దాడులకు దిగుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తుల విధ్వంసాలకు దిగుతున్నారు. పార్టీ నాయకులతో వైఎస్ జగన్.. పార్టీ శ్రేణులకు అండగా నిలవండి. వారికి తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి. న్యాయపరంగా తీసుకోవాల్సిన వాటిపై పార్టీపరంగా చర్యలు తీసుకుంటున్నాం. గవర్నర్కు కూడా పార్టీ తరఫున ఫిర్యాదు చేశాం.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్సీపీ జెండా మోసిన వాళ్లపై టీడీపీ దాడులు: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందని అన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అరాచక చేష్టలకు దిగింది. దీంతో వైఎస్సార్సీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి.. ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. గవర్నర్ నజీర్ను కలిసిన అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులే టార్గెట్గా టీడీపీ దాడులు జరిపిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. బిహార్ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందని మండిపడ్డారు. బిహార్ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తోందన్నారు. టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని అన్నారు. టీడీపీ నేతలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ జెండా మోసిన వారిపై దాడులకు తెగబడుతున్నారు.నూజివీడులో పట్టపగలే కత్తులతో దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు పేర్ని నాని. ఇళ్లలోకి చొరబడి ఆస్తులను ధ్వసం చేస్తున్నారని మండ్డారు. టీడీపీ దాడులు చూసి గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా? లేనట్టా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి కమిటీలు వేశామని, 26 జిల్లాల్లోనూ మా లీగల్ టీమ్లు యాక్టివేట్ అయ్యాయని తెలిపారు. బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. టీడీపీ గుండాల దాడులతోపాటు.. పోలీసుల తీరుపై కూడా గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.వైఎస్సార్సీపీ నేతల బృందానికి రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు. గవర్నర్ను కలిసిన వాళ్లలో తాజా ఎంపీలు గురుమూర్తి, తనుజా, ఎమ్మెల్యేలు శివప్రసాద్, మత్యలింగం, విశ్వేశ్వర రాజు, పర్చూర్ నేత బాలాజీ ఉన్నారు. -
టీడీపీ అరాచకాలపై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి’’ అని వైఎస్ జగన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.గౌరవ గవర్నర్ గారు @governorap వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు,…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2024 సంబంధిత వార్త: టీడీపీ, జనసేన విధ్వంసం.. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు -
టీడీపీ, జనసేన విధ్వంసం.. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో టీడీపీ, జనసేన శ్రేణులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. యథేచ్ఛగా విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నాయి. వాహనాలను ధ్వంసం చేస్తున్నాయి. మంగళవారం మొదలుపెట్టిన ఈ అరాచకపర్వాన్ని టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు బుధవారం కూడా కొనసాగించారు. ఈ రెండురోజులు ప్రభుత్వ భవనాల వద్ద ఫలకాలను చిత్రపటాలను ధ్వంసం చేస్తూ స్వైరవిహారం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మహానేత వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేసి, విగ్రహాల వద్ద కూటమి జెండాలు ఏర్పాటు చేశారు.ఇప్పటంలో ప్రజల భాగస్వామ్యంతో నిర్మించిన దివగంత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా పేరుతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ భవనం పైభాగంలో జనసేన, టీడీపీ జెండాలను ఏర్పాటు చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును తొలగించారు. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో 1, 2 సచివాలయాల వద్ద వైఎస్ జగన్ డిజిటల్ బోర్డులను తొలగించి రోడ్డుపై పడవేసి చిత్రపటంపై రాళ్లు వేశారు. నూతన సచివాలయం శిలాఫలకంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాన్ని చిన్నపిల్లలతో పగులగొట్టించారు. రైతుభరోసా కేంద్రంపై నవరత్నాల బోర్డును ధ్వంసం చేశారు. పల్నాడు జిల్లా గోళ్ళపాడులో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ శిలాఫలకాన్ని పగులగొట్టారు. తిరుపతి జిల్లా పుత్తూరులో పలు ఆలయాల వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆర్కే రోజా పేరిట ఉన్న శిలాఫలకాలను బుధవారం సాయంత్రం తెలుగుదేశం నాయకులు ధ్వంసం చేశారు. శ్రీకామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరస్వామి ఆలయం లోపల ఏర్పాటు చేసిన అన్నదాన, కళ్యాణోత్సవ మండప శిలాఫలకాన్ని, ఆరేటమ్మ ఆలయం వద్ద పలు అభివృద్ధి పనుల పేరిట ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని, గేట్పుత్తూరులోని గోవిందమ్మ ఆలయం వద్ద ప్రారంభించిన జగనన్న సమావేశమందిర శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. తెలుగుదేశం నాయకులు డి.జి.ధనపాల్, బి.శ్రీనివాసులు చేసిన ఈ విధ్వంసంపై పుత్తూరు సెంగుంధర్ మక్కల్ నల సంఘం ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎస్.ఎన్.గోపిరమణ, టి.జి.శక్తివేలు, ఎం.ఎస్.తిరునావక్కర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలోని యలమంచిపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త షేక్ మస్తాన్పై టీడీపీ నాయకులు దాడిచేశారు. అడ్డుకోబోయిన ఆయన తల్లి షేక్ బీబీ తలపైకొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఆమెను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తడకలూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త యలమా వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. మరికొన్ని గ్రామాల్లో కూడా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. గ్రామాల్లో వివాదాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కోరారు. పంచాయతీలో ఫైళ్ల అపహరణ ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు సచివాలయం, హెల్త్క్లినిక్ ఆవరణలోని శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, అబ్బయ్యచౌదరి ఫొటోలను సుత్తితో పగులగొట్టారు. తన కార్యాలయంలో వస్తువుల్ని ధ్వంసంచేసి ఫైళ్లు అపహరించారని సర్పంచ్ జిజ్జువరపు నాగరాజు చెప్పారు. కొప్పులవారిగూడెంలోని సచివాలయ ఆవవరణలోని శిలాఫలకాలను, ప్రభుత్వ సామగ్రిని ధ్వంసం చేశారు. సచివాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసే స్థూపానికి టీడీపీ జెండా కట్టారు. ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో బొర్రా నారాయణరావు చికెన్ దుకాణాన్ని టీడీపీ, జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీనిపై నారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం సచివాలయం–1పై ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు. వార్డు సభ్యులు ముప్పిడి లక్ష్మణరావు, లక్ష్మణరావులపై దౌర్జన్యానికి దిగారు. నంద్యాల జిల్లా అవుకు మండలం సంగపట్నంలో సచివాలయం, హెల్త్క్లినిక్ పైలాన్లను ధ్వంసం చేశారు. టీడీపీ, జనసేన శ్రేణులు విధ్వంసాలకు పాల్పడుతుండగా సమాచారం ఇచ్చినా పోలీసులు స్పందించలేదని పలు గ్రామాల్లో బాధితులు తెలిపారు.కైకలూరులో వైఎస్సార్విగ్రహం ధ్వంసంకైకలూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం వడ్లకూటితిప్పలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద 2010లో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆకతాయిలు కూలగొట్టారు.ఈ ఘటనను వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే డీఎన్నార్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఖండించారు. విగ్రహాల కూలి్చవేత ఘటనలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.నీ జీవితం నా చేతుల్లో..వలంటీర్కు టీడీపీ నేత బెదిరింపుపల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరు గ్రామానికి చెందిన వలంటీర్ బాబురావును గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తీవ్రంగా బెదిరించారు. ‘అరేయ్ బాబురావుగా నీ పతనం స్టార్ట్ కాబోతుంది.. ఇక నువ్వు ఫిక్స్ అయిపో.. ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లో ఉందిరా.. నిన్ను నువ్వు కాపాడుకోవాలనుకున్నా.. నిన్ను వేరే వాళ్ళు కాపాడాలన్నా.. నీ జీవితాన్ని నేను తిరగరాసినా ఇప్పుడు. నీకు భయం అంటే ఏంటో చూయిస్తారా.. నా కొడకా. అరేయ్ బాబురావుగా.. ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లో ఉంది రా.. నీ తలరాత బ్రహ్మ రాసినా ఇప్పుడు నీ జీవితాన్ని నేను తిరగరాస్తా.. కొడకా..’ అంటూ స్టేటస్ పెట్టి మరీ హెచ్చరించారు. మరోవైపు పెదమక్కెన గ్రామంలోని ఎస్సీ కాలనీలో దళితుల ఇళ్లపై టీడీపీ వారు రాళ్లు, సీసాలు విసిరారు. అజయ్కుమార్ జీవనాధారమైన ఆటోను ధ్వంసం చేశారు.వైఎస్సార్సీపీ నేతలు,కార్యకర్తలపై దాడులు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ వర్గీయులపై కర్రలు, రాళ్లతో దాడులు చేస్తున్నారు. అడ్డొచ్చినవారిని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఏలూరు రూరల్ మండలాధ్యక్షుడు శ్రీనివాసరాజు, రాష్ట్ర వడ్డికుల కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవ్కుమార్, గార్లమడుగు వైఎస్సార్సీపీ నాయకుడు కృష్ణ కారులో వెళుతుండగా విజయరాయి వద్ద టీడీపీ వారు దాడిచేశారు. ‘గెలిచింది మేమే.. మాకు తిరుగులేదు.. రండి ఇప్పుడు..’ అంటూ కర్రలు, రాళ్లతో కారు అద్దాలు పగులగొట్టారు. కారులో ఉన్న కృష్ణను బలవంతంగా బయటకు లాగి పిడిగుద్దులు గుద్ది రోడ్డుపై పడేశారు. కొంతదూరం లాక్కెళ్లి కొట్టారు. గతంలో చింతమనేని ప్రభాకర్పై చేసిన విమర్శలకు క్షమాపణలు చెబుతున్నా అంటూ కృష్ణతో చెప్పించి వీడియో రికార్డు చేశారు. అడ్డుపడేందుకు ప్రయత్నించిన శ్రీనివాసరాజు, సంజీవ్కుమార్లను తోసేశారు. కారు అద్దాలు పగలడంతో వైఎస్సార్సీపీ నాయకులకు గాయాలయ్యాయి. ఈ దాడిని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కొచ్చెర్లకోట పంచాయతీ సిద్ధాయపాలెంలో సింహం లలిత, ఆమె తండ్రి చొప్పరపు బాలస్వామిపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన బాలస్వామిని తొలుత మార్కాపురం జిల్లా వైద్యశాలకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యూట్యూబర్ సుంకేసుల ఆదిశేషు ఇంటిపై టీడీపీ వర్గీయులు కొడవళ్లతో దాడిచేశారు. ఆ సమయంలో ఆదిశేషు ఇంట్లో లేకపోవడంతో వారు మహిళలతో దురుసుగా మాట్లాడి సామగ్రిని చిందరవందర చేశారు. ఆదిశేషు భార్య, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Pagination
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ఈ సినిమాతో మేమిచ్చే మెసేజ్ ఇదే..
రైనీ డే కావాలి.. రెడ్ అలర్ట్ లో షూట్
ఏపీలో జోక్యం చేసుకుంటారా ?
వెండితెరపై కనిపించనున్న మరో ఎన్టీఆర్
సుధీర్ గురించి అడగ్గానే హీరోయిన్ ఎలా సిగ్గు పడుతుందో చూడండి
టీ20 వరల్డ్కప్లో ఇవాళ (జూన్ 10) మరో ఆసక్తికర సమరం
బంగారం కొనాలంటే ఇప్పుడే త్వరపడండి.. భారీగా దిగొచ్చిన ధరలు..
ఒకే రన్వేపై రెండు విమానాలకు అనుమతి ఉందా?
ట్విట్టర్లో కోహ్లి అరుదైన ఫీట్..
మ్యాచ్ రూపురేఖల్ని మార్చేసిన బుమ్రా
Advertisement