-
హీరోగా మాత్రమే చేస్తానంటూ.. ఆ హిట్ పాత్రలను రిజెక్ట్ చేసిన శోభన్ బాబు
ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమా ఉంటుంది... కెరీర్ను మలుపు తిప్పిన సినిమా. జనం మనసు దోచి, బాక్సాఫీస్ను కొల్లగొట్టిన సినిమా. కాలం మారినా... మరపురాని సినిమా. ఆంధ్రుల అందాల నటుడిగా, ఇద్దరు హీరోయిన్ల ముద్దుల ప్రియుడిగా చరిత్ర సష్టించిన హీరో శోభన్ బాబు కెరీర్లో అలాంటి ఓ స్పెషల్ సినిమా 'సోగ్గాడు'. అది ఎంత స్పెషల్ అంటే, 'వెండితెర సోగ్గాడు' అంటే శోభన్ బాబే అనేటంతగా స్పెషల్. ఈ సినిమా ఆయనకు స్టార్డమ్ను తెచ్చిపెట్టింది. అలా ఎన్నో వైవిధ్య చిత్రాల్లో నటించిన దివంగత నటుడు శోభన్ బాబు. ఒకానొక సమయంలో తన దగ్గరికి వచ్చిన కథల్ని కూడా ఆయన తిరస్కరించారని మీకు తెలుసా..? అందుకు కారణం కూడా ఆయన గతంలో ఇలా చెప్పారు. 'అభిమానులు, ప్రేక్షకులు నన్ను హీరోగా మాత్రమే చూశారు.. అదే స్థాయిలో వారి గుండెల్లో నన్ను పెట్టుకున్నారు. నా కెరీర్ మొత్తం హీరోగానే ముగిసిపోవాలి. మరో పాత్రలో నటించాలని లేదు.' అన్నారు. దీంతో ఆయన సహాయ, కీలక పాత్రల్లో నటించేందుకు ముందుకు రాలేదు. కానీ ఆయన తిరస్కరించిన పాత్రలు ఏవో ఒకసారి చూద్దాం. మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో 2005లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'అతడు'. ఈ సినిమాలోని సత్యనారాయణ మూర్తి (నాజర్) పాత్ర ముందుగా శోభన్ బాబు దగ్గరకే వెళ్లింది. ఈ పాత్ర మీరే చేయాలంటూ నిర్మాత మురళీ మోహన్ కోరారు. అందుకు రెమ్యునరేషన్గా బ్లాంక్ చెక్నే ఇచ్చారు మురళీ మోహన్.. కానీ శోభన్ బాబు నో చెప్పడం విశేషం. పవన్ కల్యాణ్ 'సుస్వాగతం' సినిమాలో రఘువరన్ పోషించిన పాత్ర మొదట శోభన్ బాబు దగ్గరికి వెళ్లింది. అందుకు భీమినేని శ్రీనివాసరావు సంప్రదించగా అప్పుడు కూడా శోభన్బాబు నో చెప్పారు. తెలుగు సినిమా చరిత్రంలో అన్నమయ్య చిరస్థాయిలో ఉంటుంది. నాగార్జున ప్రధాన పాత్రలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం 1997లో విడుదల అయింది. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషనల్ హిట్ను అందుకుంది. ఇందులో శ్రీ వేంకటేశ్వరస్వామి పాత్రను పోషించమని చిత్ర యూనిట్ కోరగా అప్పుడు కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలా ఫైనల్గా ఆ పాత్ర సుమన్ వద్దకు వెళ్లింది. అందులో ఆయన కూడా ఒదిగిపోయాడు. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ నటించిన 'బ్లాక్' తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు ఆర్.బి. చౌదరి. అందులో శోభన్ బాబు అయితే బాగా సెట్ అవుతారని ఆయన కోరారు. అందకు కూడా నో చెప్పారు శోభన్ బాబు. అలా ఎన్నో హిట్ కొట్టిన సినిమాలు ఆయన వద్దకు వచ్చాయి. కానీ వాటిని తిరస్కరించిన శోభన్ బాబు ఎట్టకేలకు ఓ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోడి రామకృష్ణ దర్శకుడిగా నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ రూపొందించాలనుకున్న మల్టీస్టారర్ చిత్రాన్ని ఆయన ఓకే చేశారు. అందులో శోభన్ బాబు,కృష్ణ, జగపతి బాబు కలిసి నటించాలనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. -
మహేశ్-త్రివిక్రమ్ మూడు సినిమాలకు అదే ప్రాబ్లమ్!?
సూపర్స్టార్ మహేశ్బాబు 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ దీనికి దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ ఏ ముహుర్తాన మొదలైందో తెలీదు గానీ బండికి బ్రేకులేసినట్లు ఆగుతూ పోతోంది. సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే హీరోయిన్, సినిమాటోగ్రాఫర్ తప్పుకొన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో అసలేం జరుగుతుందో అర్థం కాక అభిమానులు బుర్ర గోక్కుంటున్నారు. అయితే ఈ ప్రాబ్లమ్ ఇప్పటిది కాదు. త్రివిక్రమ్ పేరు చెప్పగానే మనకు డీసెంట్ సినిమాలు, అందులోని పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. అయితే ఈ దర్శకుడు తీసిన వాటిలో 'అతడు', 'ఖలేజా' మూవీస్కి లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏం మ్యాజిక్ ఉందో తెలీదు గానీ ఈ రెండు చిత్రాలు ఎప్పుడూ చూసిన ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. మనస్ఫూర్తిగా నవ్విస్తాయి. (ఇదీ చదవండి: 63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్లు!) అయితే మహేశ్ బాబుతో త్రివిక్రమ్ చేసిన ఫస్ట్ మూవీ 'అతడు'. ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో తీసిన ఈ సినిమా.. 2005లో విడుదలైంది. థియేటర్లలో చెప్పుకోదగ్గ సక్సెస్ కానప్పటికీ.. టీవీలో టెలికాస్ట్ అయి టీఆర్పీలో రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమా తీయడానికి రెండేళ్లు పట్టింది. కారణాలు ఏంటో కరెక్ట్గా తెలియనప్పటికీ తీయడం మాత్రం ఆలస్యమైంది. మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'ఖలేజా' విషయంలో దాదాపు ఇలానే జరిగింది. ఈ సినిమాతో త్రివిక్రమ్ కాస్త డిఫరెంట్గా ట్రై చేశారు. కాకపోతే అప్పట్లో ప్రేక్షకులకు ఇది ఎక్కలేదు. టీవీలో ప్రసారమైతే మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా తీయడానికి ఏకంగా మూడేళ్లు పట్టింది. పైన రెండింటికి ఎలా అయితే జరిగింతో ఇప్పుడు 'గుంటూరు కారం' విషయంలోనూ సేమ్ సీన్ రిపీటవుతుంది. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో ఇది రిలీజ్ అంటున్నారు. మరి అనుకున్నట్లు జరుగుద్దో లేదంటే వాయిదా పడుతుందో వేచి చూడాలి. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) -
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో " అతడు " సీక్వెల్
-
ఆడు మగాడ్రా బుజ్జి..! అమ్మాయి కాదు రా!!
Cyber Crimes Wing Cyberabad: ‘ఏంజెల్ ప్రియా’.. ఈ పేరు గురించి తెలుసు కదా!.. ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ల పుట్టుకకు ఒకరకంగా ఆజ్యం పోసింది ఈ పేరే. అయితే సరదాగా మొదలైన ఈ వ్యవహారం ఆ తర్వాతి కాలంలో మోసాలకు తెర లేపింది. ముఖ్యంగా మగవాళ్లే ఆడవాళ్ల పేర్లతో ఫేస్బుక్ యూజర్లను ముగ్గులోకి దించడం, కట్టుకథలు చెప్పి అందినంత దోచుకోవడం లాంటి నేరాలు బోలెడు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో కొంతకాలం తగ్గాయనుకున్న ఈ తరహా నేరాలు.. ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయట!!. సైబరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు తాజాగా ట్విటర్లో ఫన్ అండ్ అవేర్నెస్ పోస్ట్ ఒకటి వేశారు. తివిక్రమ్-మహేష్ బాబు ‘అతడు’లోని ఓ ఫేమస్ డైలాగ్ మీమ్ను వాడేశారు. ‘ఒక అమ్మాయి తనకు ఫ్రెండ్రిక్వెస్ట్ పంపి తెగ ఛాటింగ్ చేస్తుంద’ని కొడుకు మురిసిపోతుంటే.. ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదు రా’ అంటూ తండ్రి ఆ కొడుక్కి షాక్ ఇస్తాడు. ఆడు మగాడ్రా బుజ్జి..! Beware of #Fake #Facebook profile frauds @TelanganaDGP @TelanganaCOPs @cyberabadpolice @hydcitypolice @RachakondaCop @actorbrahmaji pic.twitter.com/oph4oL7Aoe — Cyber Crimes Wing Cyberabad (@CyberCrimePSCyb) October 4, 2021 తద్వారా ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సందేశం ఇచ్చారు పోలీసులు. పనిలో పనిగా నటుడు బ్రహ్మాజీని సైతం ట్యాగ్ చేసి పడేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు. సాధారణంగానే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బ్రహ్మాజీ.. ఆ ట్వీట్ను రీట్వీట్ చేశారు కూడా. ఇక సోషల్ మీడియా వాడకంలో పోలీసులది డిఫరెంట్ పంథా. కరెక్ట్ టైమింగ్, రైమింగ్తో ప్రజల్ని అప్రమత్తం చేయడం, అవగాహన కల్పించడం వాళ్ల విధిగా మారింది. ఈ క్రమంలో నవ్వులు పూయించే మీమ్స్ను సైతం వాడేస్తున్నారు. కేరళ, ముంబై పోలీసుల్లాగే.. తెలంగాణ పోలీసుల సోషల్ మీడియా వింగ్ సైతం హ్యూమర్ను పంచుతోంది. చదవండి: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ!! -
తెలుగు తెరపై ‘త్రివిక్రమ్’ మాటల మంత్రం
మాటలతో మంత్రం వేసి...డైలాగులతో ఆలోచింపజేసే అరుదైన విధానం ఆయనకి మాత్రమే సాధ్యం. పాత్రల మధ్య పంచ్ డైలాగులతో నవ్వించాలన్నా....అనుబంధాల గురించి గుండె బరువెక్కే మాటలు రాయాలన్నా అది ఆయన కలానికి మాత్రమే సాధ్యం. ‘తెగిపోయేటప్పుడు దారం బలం తెలుస్తుంది. వెళ్లిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది......మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి..కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. ’లాంటి ఎన్నో డైలాగులు ఆయన గుండె లోతుల్లోంచి రాసుకున్నవే. సినిమా చూస్తున్నంత సేపు మనల్ని కదలించే ఎన్నో సీన్లు...సినిమా అయిపోయాక కూడా ప్రేక్షకుడి మదిలో కదలాడుతూనే ఉంటాయి. అయన డైలాగుల్లో పంచ్ ఉంటుందని అంటారు కానీ, జీవితం ఉంటుందంటారు ఆయన అభిమానులు. ఆయనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు....
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
లెక్క తేలింది.. పోరు మిగిలింది..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement