-
Wrestling: ఎట్టకేలకు భారత్ ఖాతాలో తొలి స్వర్ణం.. అమన్ ‘పసిడి పట్టు’
Asian Wrestling Championships 202- అస్తానా (కజకిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఎట్టకేలకు భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. ఈ టోర్నీ ఐదో రోజు గురువారం పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో అమన్ సెహ్రావత్ భారత్కు తొలి పసిడి పతకాన్ని అందించాడు. ఫైనల్లో అమన్ 9–4 పాయింట్ల తేడాతో అల్మాజ్ సమన్బెకోవ్ (కిర్గిస్తాన్)పై గెలుపొందాడు. అప్పుడు రవి దహియా నేరుగా క్వార్టర్ ఫైనల్ బౌట్ ఆడిన అమన్ 7–1తో రికుటో అరాయ్ (జపాన్)పై, సెమీఫైనల్లో 7–4తో వాన్హావో జు (చైనా)పై విజయం సాధించాడు. అమన్ ప్రదర్శనతో వరుసగా నాలుగో ఏడాది 57 కేజీల విభాగంలో భారత్ ఖాతాలోనే స్వర్ణ పతకం చేరడం విశేషం. 2020, 2021, 2022లలో రవి కుమార్ దహియా ఈ విభాగంలో విజేతగా నిలిచాడు. గాయం కారణంగా ఈసారి రవి ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. అమన్కిది రెండోది ఢిల్లీలోని విఖ్యాత ఛత్రశాల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేసే అమన్ గత ఏడాది అండర్–23 ప్రపంచ చాంపియన్షిప్లోనూ స్వర్ణ పతకం సాధించాడు. ఈ ఏడాది అమన్కిది రెండో పతకం. ఫిబ్రవరిలో జాగ్రెబ్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో అమన్ కాంస్య పతకం గెలిచాడు. మూడింట నిరాశ గురువారం జరిగిన ఇతర నాలుగు వెయిట్ కేటగిరీల్లో మూడింట భారత రెజ్లర్లకు నిరాశ ఎదురైంది. 79 కేజీల విభాగంలో దీపక్ కుక్నా కాంస్య పతకం నెగ్గగా... 97 కేజీల విభాగంలో దీపక్ నెహ్రా కాంస్య పతక బౌట్లో ఓడిపోయాడు. దీపక్ కుక్నా 12–1తో షురాత్ బొజొరోవ్ (తజికిస్తాన్)పై గెలుపొందగా... దీపక్ నెహ్రా 9–12తో మక్సూద్ వెసలోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. అనూజ్ (65 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో, ములాయం యాదవ్ (70 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్లో ఓటమి పాలయ్యారు. హైదరాబాద్ ఎఫ్సీ మ్యాచ్ ‘డ్రా’ సూపర్ కప్ టోర్నీలో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) తొలి ‘డ్రా’ నమోదు చేసింది. కేరళలో జరుగుతున్న ఈ టోర్నీలో ఈస్ట్ బెంగాల్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్ను హైదరాబాద్ 33తో ‘డ్రా’గా ముగించింది. సోమవారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో ఒడిశాతో హైదరాబాద్ ఆడుతుంది. భారత్కు తొలి ఓటమి తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా జోన్ గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. చైనా జట్టుతో గురువారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్లో టీమిండియా 0–3తో పరాజయం చవిచూసింది. తొలి సింగిల్స్లో రుతుజా భోస్లే 3–6, 5–7తో జియాంగ్ జిన్యు చేతిలో ఓడిపోగా... రెండో సింగిల్స్లో భారత నంబర్వన్ అంకిత రైనా 5–7, 1–6తో యువాన్ యు చేతిలో ఓటమి పాలైంది. దాంతో భారత పరాజయం ఖరారైంది. నామమాత్రంగా జరిగిన డబుల్స్ మ్యాచ్లో శ్రీవల్లి రష్మిక–వైదేహి చౌదరీ ద్వయం 0–6, 1–6తో జియాంగ్ జిన్యు–యాంగ్ జావోజువాన్ జోడీ చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే నాలుగో లీగ్ మ్యాచ్లో జపాన్తో భారత్ తలపడుతుంది. ఈ టోర్నీలో జపాన్ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి అజేయంగా ఉంది. -
వికాస్ ‘కంచు’ పట్టు
అస్తానా (కజకిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ రెండో రోజు పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత్కు ఒక కాంస్య పతకం లభించింది. 72 కేజీల విభాగంలో వికాస్ కాంస్య పతక బౌట్లో 8–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో జెయిన్ తాన్ (చైనా)పై గెలుపొందాడు. భారత్కే చెందిన సుమిత్ (60 కేజీలు), రోహిత్ దహియా (82 కేజీలు), నరీందర్ చీమా (97 కేజీలు) కూడా కాంస్య పతక బౌట్లలో పోటీపడ్డారు. కానీ ఈ ముగ్గురికీ నిరాశే ఎదురైంది. కాంస్య పతక బౌట్లలో సుమిత్ 6–14తో మైతా కవానా (జపాన్) చేతిలో... రోహిత్ 1–5తో అలీరెజా (ఇరాన్) చేతిలో... నరీందర్ 1–4తో ఒల్జాస్ (కజకిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
రజతం నెగ్గిన భారత రెజ్లర్ రూపిన్.. తొలి రోజు భారత్కు మూడు పతకాలు
కజకిస్తాన్లో జరుగుతున్న ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో తొలి రోజు భారత్కు మూడు పతకాలు లభించాయి. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో రూపిన్ (55 కేజీలు) రజతం... నీరజ్ (63 కేజీలు), సునీల్ (87 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. ఫైనల్లో రూపిన్ 1–3తో సౌలత్ (ఇరాన్) చేతిలో ఓడిపోగా... నీరజ్ 5–2తో జిన్సెయుబ్ సాంగ్ (దక్షిణ కొరియా)పై, సునీల్ 4–1తో మసాటో సుమి (జపాన్)పై గెలిచారు. చదవండి: #KavyaMaran: 'చల్ హట్ రే'.. నీకు నేనే దొరికానా! రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. ఎవరికీ సాధ్యం కాలేదు! వీడియో వైరల్ -
దీపక్కు రజతం.. రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు పతకాల పంట
ఉలాన్బాతర్ (మంగోలియా): ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2022లో గతేడాదితో (14) పోలిస్తే భారత్కు ఈ సారి 3 పతకాలు అధికంగా వచ్చాయి. ఆఖరి రోజు వచ్చిన రెండు మెడల్స్ కలుపుకుని భారత్ ఖాతాలో మొత్తం 17 పతకాలు (1 స్వర్ణం, 5 రజతాలు, 11 కాంస్యాలు) చేరాయి. 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా మరోసారి రజతంతో సరిపెట్టుకోగా, విక్కీ చాహర్ (92 కేజీలు) కాంస్యం చేజిక్కించుకున్నాడు. ఈ ఏడాది స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన దీపక్ కజకిస్థాన్ రెజ్లర్ అజ్మత్ దౌలెత్బెకోవ్ చేతిలో 1-6 తేడాతో ఓడాడు. నిరుడు ఇదే టోర్నీలో దీపక్ రజతంతోనే సరిపెట్టుకున్నాడు. మరోవైపు విక్కీ చాహర్ రజత పోరులో 5-3తో అజినియాజ్ (ఉజ్బెకిస్థాన్)పై నెగ్గాడు. ఆదివారంతో ముగిసిన ఈ పోటీల్లో జపాన్ అత్యధికంగా 21 పతకాలు (10 స్వర్ణం, 2 రజతాలు, 9 కాంస్యాలు) సాధించగా, ఇరాన్ (15, 10 స్వర్ణం, 2 రజతాలు, 3 కాంస్యాలు), కజకిస్థాన్ (21, 5 స్వర్ణం, 8 రజతాలు, 8 కాంస్యాలు), కిర్కిస్థాన్ (14, 4 స్వర్ణం, 3 రజతాలు, 7 కాంస్యాలు) వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో నిలిచాయి. భారత్ 17 పతకాలతో ఐదో స్థానంలో నిలిచింది. చదవండి: Formula 1: అన్స్టాపబుల్ వెర్స్టాపెన్.. కెరీర్లో 22వ విజయం -
రవి దహియా కొత్త చరిత్ర
ఉలాన్బాటర్ (మంగోలియా): భారత రెజ్లర్ రవి కుమార్ దహియా కొత్త చరిత్ర లిఖించాడు. ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో మూడు స్వర్ణ పతకాలు గెలిచిన తొలి భారతీయ రెజ్లర్గా రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ విభాగం పోటీల్లో 24 ఏళ్ల రవి దహియా 57 కేజీల విభాగంలో చాంపియన్గా నిలిచాడు. తద్వారా వరుసగా మూడో ఏడాదీ విజేతగా నిలిచి ఈ మెగా ఈవెంట్లో ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన తొలి భారతీయ రెజ్లర్గానూ ఘనత వహించాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో రవి ‘టెక్నికల్ సుపీరియారిటీ’ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించగానే విజేతగా ప్రకటిస్తారు) పద్ధతిలో 12–2తో రఖత్ కల్జాన్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. రవి 2020, 2021 ఆసియా చాంపియన్షిప్లలో 57 కేజీల విభాగంలోనే పసిడి పతకాలు సాధించాడు. శనివారం ఆసియా చాంపియన్షిప్లో భారత్కు ఓవరాల్గా ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు) లభించాయి. భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా (65 కేజీలు), గౌరవ్ బలియాన్ (79 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. 97 కేజీల విభాగంలో సత్యవర్త్ కడియాన్, 70 కేజీల విభాగంలో నవీన్ కాంస్య పతకాలు గెలిచారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
పెళ్లికార్డులో 'మోదీ' పేరు.. చిక్కుల్లో వరుడు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement