-
పవన్కు దమ్ముంటే ఎన్నికల్లో గెలవాలి
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్సీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా సింగరపల్లి గ్రామంలో జనసేన కార్యకర్త ఆత్మహత్యకు తానే కారణమంటూ పవన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ‘జనసేన కార్యకర్త వెంగయ్య వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు. నా వల్లే, నా కార్యకర్తల వేధింపుల వల్లే అతను మరణించినట్టు జనసేన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సింగరపల్లి వెళ్తే నాపై దౌర్జన్యానికి ఉసిగొల్పారు. తపంచాలు, నాటు బాంబులతో తిరిగిన వ్యక్తితో నా కార్యకర్తలకేం సంబంధం? ఈ వ్యవహారంలో నా ప్రమేయం ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. వాస్తవాలు తెలుసుకోకుండా పవన్ కూడా మా నియోజకవర్గానికి వచ్చి నాపై ఆరోపణలు చేశారు. భారీ మెజారిటీతో గెలిచిన నేను.. రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడి గెలవగలను. దమ్ము, ధైర్యం ఉంటే పవన్ ప్రజాతీర్పు కోరగలరా? ఆయన గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఓడిపోతే పవన్ పార్టీ మూసేసుకుని వెళ్లిపోతారా?’ అని ప్రశ్నించారు. -
నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఎమ్మెల్యే సవాల్
సాక్షి, తాడేపల్లి: వెంగయ్య మృతికి తాను కారణం కాదని.. జనసేన నేతల ఆరోపణల్లో వాస్తవం లేదని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వెంగయ్య మృతికి విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో వెంగయ్య ఆత్మహత్య చేసుకుంటే.. తనకు ఆపాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రోడ్డుపై రాళ్లు అడ్డంగా పెట్టి.. తనని అడ్డుకుని.. బలవంతంగా వాహనం నుంచి దింపే ప్రయత్నం చేశారని అన్నా రాంబాబు గుర్తు చేశారు. చదవండి: ‘2018లో చంద్రబాబే పారిపోయారు ‘‘సింగరపల్లిలో 95 శాతం సిమెంట్ రోడ్లు వేశాం. చందు అనే వ్యక్తి నన్ను అడ్డుకున్నాడు. ఆ సమయంలో వెంగయ్య అక్కడే ఉన్నాడు. వెంగయ్యకు నాకు వివాదం లేదు.. వాగ్వాదం జరగలేదు. చిన్న వివాదాన్ని ఎడిటింగ్ చేసి దుష్ప్రచారం చేశారు. పవన్కల్యాణ్లా శవ రాజకీయాలు చేయడం నాకు రాదు.వెంగయ్య మృతికి నేను కారణమని నిరూపిస్తే రాజీనామా చేస్తానని’’ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సవాల్ విసిరారు. చదవండి: నిమ్మగడ్డ ఏకపక్ష ధోరణి సరికాదు: సామినేని -
తప్పులు ఒప్పుకోకుంటే చంద్రబాబు ఇంటివద్ద దీక్ష
సాక్షి, వైఎస్సార్ జిల్లా : వచ్చే శాసనసభ సమావేశాల నాటికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తప్పులను ఒప్పుకుని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన ఇంటి ముందు ఆమరణ దీక్షకు దిగుతానని గిద్దలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు హెచ్చరించారు. టీడీపీ దుష్టపాలనకు చరమగీతం పాడి ప్రజలకు మేలు చేసే కొత్త యువ నాయకత్వాన్ని అందించింనందుకు కృతజ్ఞతగా ఈ నెల 4న గిద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రారంభించిన తిరుమల పాదయాత్ర 8వ రోజైన బుధవారం నాటికి వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణ శివార్లలో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ జి.వెంకటసుబ్బయ్యతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానిక సాయి ఫంక్షన్హాలులో ఎమ్మెల్యే అన్నా రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకుని నైతిక విలువలకు తిలోదకాలిచ్చారని మండిపడ్డారు. అటువంటి చంద్రబాబు జగన్ పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంద రోజుల పాలనలో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారని, అది జీర్ణించుకోలేని చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. -
‘చంద్రబాబు ఇంటి ముందు దీక్షకు దిగుతా’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాదయాత్ర ఎనిమిదో రోజుకు చేరుకుంది. తిరుమలకు పాదయాత్రలో భాగంగా నేడు రాంబాబు వైఎస్సార్ జిల్లాలోని బద్వేల్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య, వైఎస్సార్సీపీ నాయకులు, ఆర్య వైశ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ‘ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో చేసిన తప్పిదాలను వచ్చే శాసనసభ సమావేశాల కల్లా ఒప్పుకోకపోతే బాబు ఇంటిముందే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా’నని అన్నా రాంబాబు ప్రకటించారు. కాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే తిరుమలకు పాదయాత్ర చేస్తానన్న ఆయన ఇప్పుడు మొక్కు తీర్చుకుంటున్నారు. అందులో భాగంగానే 4వ తేదీన ప్రకాశం జిల్లాలోని కాకర్ల గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
నల్లకాల్వకు చేరిన ఎమ్మెల్యే పాదయాత్ర
సాక్షి, కంభం (ప్రకాశం): గిద్దలూరు ఎమ్మెల్యే అన్నావెంకట రాంబాబు తిరుమల పాదయాత్ర రెండో రోజు కంభం మండలం చిన్నకంభం గ్రామానికి చేరింది. చిన్నకంభం గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. పోరుమామిళ్ళపల్లి, చిన్నకంభం, దేవనగరం, జెబికె పురం గ్రామాల మీదుగా నల్లకాల్వ గ్రామం వరకు పాదయాత్ర సాగింది. చిన్నకంభం గ్రామం వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు యేలం వెంకటేశ్వర్లు, చిన్నకంభం వైఎస్సార్ సీపీ నాయకులు రసూల్, సాగర్, గుండం, గజ్జల ఓంకారం, మాజీ ఎఎంసీ చైర్మన్ చెన్నారెడ్డి, మాజీ జెడ్పీటీసీ జాకీర్, మాజీ ఎంపీపీలు రవికుమార్, ఓసురారెడ్డి, నాయకులు కొత్తపల్లిశ్రీను, శరబారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఘన స్వాగతం పలికిన నాయకులు బేస్తవారిపేట: వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడంతో పాటు, తాను అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా తిరుమలకు కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకునేందుకు చేపట్టిన పాదయాత్ర గురువారం బేస్తవారిపేట మండలంలోకి చేరింది. వెంకటేశ్వరస్వామి భారీ ప్రతిమ, వెంకటేశ్వర స్వామి సంకీర్తనలతో కోళాట భజనల నడుమ కోటస త్యమాంబదేవి ఆలయం వద్ద నుంచి చింతలపాలెం, సోమవారిపేట, బేస్తవారిపేట, చిన్న కంభం రోడ్డు మీదుగా అశేష జనసందోహం నడుమ ఉత్సాహంగా సాగింది. పాదయాత్రను విజయవంతం చేయాలి రాచర్ల: తిరుమలకు పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు రాచర్ల మీదుగా వెళుతున్నారని కార్యకర్తలు నాయకులు విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ మండల నాయకుడు యేలం మురళి గురువారం తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని కోరారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement