నూతన శకంలోకి అడుగుపెట్టిన టాటా గ్రూప్ | Sakshi
Sakshi News home page

నూతన శకంలోకి అడుగుపెట్టిన టాటా గ్రూప్

Published Tue, Feb 21 2017 10:59 AM

నూతన శకంలోకి అడుగుపెట్టిన టాటా గ్రూప్

ముంబై : టాటా గ్రూప్ ఓ నూతన శకంలోకి అడుగుపెట్టింది. బహుళ జాతీయ సంస్థగా పేరొందిన ఈ గ్రూప్కు చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్నిరోజులు తాత్కాలిక చైర్మన్గా ఉ‍న్న రతన్ టాటా నుంచి ఎన్ చంద్రశేఖరన్ ఈ బాధ్యతలు తీసుకున్నారు. టాటా సన్స్కు చైర్మన్గా ఉంటూనే చంద్రశేఖరన్ గ్రూప్లో అత్యంత కీలకమైన టెక్ అగ్రగామి టీసీఎస్కు కూడా ఈయన చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.  150 ఏళ్లు కలిగిన టాటా గ్రూప్కు తొలిసారి నాన్-పార్సి చైర్మన్గా చంద్రశేఖరన్ ఎంపికయ్యారు.
 
దేశంలో అతిపెద్ద సాప్ట్ వేర్ ఎగుమతిదారిగా టీసీఎస్ ను రూపొందించిన ఘనతతో చంద్రశేఖరన్ ఎక్కువగా పేరొందారు. టాటాసన్స్‌ చైర్మన్‌గా నేడు బాధ్యతలు చేపట్టిన ఎన్‌.చంద్రశేఖరన్‌ నిన్న టీసీఎస్‌ సీఈఓ హోదాలో ఆఖరి బోర్డు సమావేశం నిర్వహించారు. ఆ బోర్డు సమావేశంలో ఇన్వెస్టర్లకు తీపి కబురు అందించారు. రూ.16వేల కోట్ల షేర్ల బైబ్యాక్ ఆఫర్ను  ప్రకటించారు. టాటా సన్స్ కొత్త చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రశేఖర్, వివిధ కంపెనీల సీఈవోలతో అధికారికంగా భేటీ అయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement