ఖజానా నుంచి కాకుండా సర్కారు మధ్యే మార్గం
జేఏసీకి ప్రతిపాదించిన ప్రభుత్వం.. నేడు మరోసారి చర్చలు
సాక్షి, హైదరాబాద్: దేవాలయ ఉద్యోగులు, అర్చకులకు ఖజానా నుంచి వేతనాలు చెల్లించటం సాధ్యం కాదని దాదాపు తేల్చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ఆర్థిక శాఖ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, దేవాలయ విరాళాలను నిధిగా చేసి దాని ద్వారా ఏకరూప వేతనాలు చెల్లించే యోచనలో ఉంది. దీనిపై శుక్రవారం చర్చల్లో స్పష్టత ఇచ్చే అవకాశముంది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆలయ అర్చక, సిబ్బంది జేఏసీ 10 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.
ఆలయ ఉద్యోగులు, అర్చకుల నియామకాలు ఓ పద్ధతిగా జరగకపోవటం, చాలామందికి కనీసం నియమాక ఉత్తర్వులు కూడా లేనందున ఖజానా నుంచి వేతనాలు చెల్లించటం సాంకేతికంగా సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న దేవాలయ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలనే డిమాండ్ సాధ్యమేనని అధికారులు చెప్పారు. రెగ్యులరైజ్ చేయటమంటే నియామకాలను క్రమబద్ధం చేసినట్లే గదా.. అలాంటప్పుడు ఖజానా నుంచి వేతనాలు చెల్లించటం సాధ్యమే కదా అని ప్రతి నిధులు పేర్కొన్నారు. క్రమబద్ధీకరణ ఆ దేవాలయం వరకే సాధ్యమని, అది ప్రభుత్వ నియామకంగా మార్చటం కాదని అధికారులు స్పష్టం చేశారు.
ఖజానా నుంచి వేతనాల పట్టు వీడితే ప్రభుత్వం వారికి ఆమోదయోగ్యంగా ఉండేలా ప్రత్యామ్నాయాన్ని చూపుతుందని పేర్కొన్న మంత్రి.. ఆర్థిక శాఖ ద్వారా చెల్లించే అంశాన్ని ప్రస్తావించారు. ఆర్జేసీ మొదలు ఈఓల వరకు చెల్లిస్తున్న వేతనంతోపాటు వారికి అందుతున్న ఇతర ప్రయోజనాలన్నీ వస్తే తమకు ఆమోదయోగ్యమేనని, దేవాదాయశాఖ అధికారుల పెత్తనం ఉండకూడదని జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. వెంటనే సమ్మె విరమించాలని మంత్రి కోరారు. అయితే ఆ వివరాలను స్పష్టం చేసిన తర్వాత, అవి ఆమోదయోగ్యంగా ఉంటే సమ్మె విరమిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాల ప్రతినిధులతో తాము భేటీ అవుతున్నామని, ఈ చర్చలకు మంత్రి రావాలని వారు కోరారు. ఈ వ్యవహారంపై ఏర్పాటైన కమిటీ మరో వారంలో నివేదిక ఇచ్చే అవకాశముందని, అది రాగానే తుది నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి చెప్పడంతో శుక్రవారం నాటికి విషయం తేలుతుందో లేదో సందిగ్ధంగా మారింది.
అర్చకుల వేతనాలకు ప్రత్యేక విభాగం
Published Fri, Sep 4 2015 2:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement