తీరిగ్గా ఫోన్‌ తీసి.. తాపీగా క్యాండీ క్రష్‌ ఆడారు! | Sakshi
Sakshi News home page

తీరిగ్గా ఫోన్‌ తీసి.. తాపీగా క్యాండీ క్రష్‌ ఆడారు!

Published Thu, Jun 29 2017 10:52 AM

Some police officers seen playing games in seminar



ఒకవైపు ముఖ్యమంత్రి, పోలీసుశాఖ అధిపతి సీరియస్‌గా ప్రసంగిస్తూ.. భద్రతా పాఠాలు బోధిస్తుండగా.. మరోవైపు పోలీసులు మాత్రం అదేమీ పట్టనట్టు తీరికగా తమ మొబైళ్లు తీసి.. అందులో క్యాండీ క్రష్‌ గేమ్స్‌ ఆడుతూ కాలక్షేపం చేశారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, డీజీపీ పీకే ఠాకూర్‌ శనివారం పాట్నాలో పోలీసుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వక్తలు గంభీరంగా ప్రసంగించారు.

ఆ ప్రసంగాలు ఈ సదస్సులో పోలీసులకు బోర్‌ కొట్టాయేమో..  పోలీసు అధికారులు మాత్రం తీరిగ్గా తమ మొబైల్‌ఫోన్‌లో కాలక్షేపం చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. కొందరు పోలీసు అధికారులు తమ ఫోన్లలో క్యాండీ క్రష్‌ ఆడుతూ కనిపించగా.. మరికొందరు సోషల్‌ మీడియా ఖాతాలు తెరిచి.. అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన భార్య మెలానియా గురించి వచ్చిన జోకులు చూస్తూ గడిపారు.

Advertisement
Advertisement