తెగబడ్డ దోపిడీ దొంగలు | Sakshi
Sakshi News home page

తెగబడ్డ దోపిడీ దొంగలు

Published Wed, May 27 2015 8:04 AM

తెగబడ్డ దోపిడీ దొంగలు

బాలాపూర్: షిరిడీ-మైసూర్ రైలులో దోపిడీ దొంగలు తెగబడ్డారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో రైల్లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. రైల్లోకి ప్రవేశించిన 30 మంది దోపిడీ దొంగలు ఎస్ 1 బోగి నుంచి ఎస్ 14  బోగిల వరకు స్వైర విహారం చేశారు.

ప్రయాణికులను బెదిరించి భారీగా బంగారం, నగదు దోచుకున్నారు. మహారాష్ట్రలోని బాలాపూర్ వద్ద ఘటన చోటు చేసుకుంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement