* నోబెల్ గ్రహీత కైలాష్ ప్రత్యర్థిచే అవార్డుల ప్రదానం
సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్కు చెందిన వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య జమ్నాలాల్ బజాజ్ అవార్డును అందుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఇక్కడ జరిగిన 37వ జమ్నాలాల్ బజాజ్ అవార్డుల ప్రదానోత్సవంలో జానకీదేవి బజాజ్ స్మృతి చిహ్నంగా అందించే మహిళ, శిశు సంక్షేమం విభాగం అవార్డును ఆమె అందుకున్నారు.
నిర్మాణాత్మక పనుల విభాగంలో కర్ణాటకకు చెందిన జన్పద్ సేవా ట్రస్ట్ ఫౌండర్ సరేంద్ర కౌలగి, సైన్స్, టెక్నాలజీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ విభాగంలో గుజరాత్కు చెందిన సురుచి శిక్షణ్ వసాహత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, డెరైక్టర్ రామ్కుమార్ సింగ్లు అవార్డులు అందుకున్నారు. అంతర్జాతీయ విబాగంలో ఇతర దేశాల్లో గాంధేయవాదాన్ని ప్రోత్సహించే వారికి ఇచ్చే అవార్డును థాయ్లాండ్కు చెందిన ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆఫ్ ఎంగేజ్డ్ బుద్దిస్ట్ సంస్థ సంస్థాపకులు సులక్ సివారస్కా అందుకున్నారు.
నోబెల్ అవార్డు గ్రహిత కైలాష్ సత్యర్థి ఈ అవార్డులను అందజేశారు. జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాహుల్ బజాజ్, ఫౌండేషన్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్, రిటైర్డ్ న్యాయమూర్తి సీఎస్ ధర్మాధికారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జమ్నాలాల్ బజాజ్ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ సారి అవార్డు గ్రహీతలకు అందించే ప్రైజ్మనీని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచారు.
మహిళలకు గౌరవం లభిస్తేనే సమాజంలో మార్పులు: విద్య
మహిళలకు సమాన హక్కులతో పాటు గౌరవం లభిస్తేనే సమాజంలో మార్పులు సాధ్యమని చెన్నుపాటి విద్య చెప్పారు. జమ్నాలాల్ బజాజ్ అవార్డు అందుకున్న విద్య ‘సాక్షి’తో మాట్లాడుతూ మహిళలకు సమాన హక్కుల సాధన లక్ష్యంతో వాసవ్య మహిళా మండలిని స్థాపించి నట్లు చెప్పారు. సామాజికంగా, రాజకీయంగా మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళల్లో అక్షరాస్యతతోపాటు అనేక విషయాలపై అవగాహన కల్పించి వారి అభివృద్ధికి పాటుపడుతున్నట్టు చెప్పారు. పలు జిల్లాల్లో తమ సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తోందన్నారు.
సైన్స్, టెక్నాలజీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ విభాగం అవార్డు గ్రహీత రామ్కుమార్ సింగ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలు, అక్కడి వనరుల అభివృద్ధికి తమ సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా రైతులకు పనులు, శ్రమ తగ్గించే విధంగా చవకైన పనిముట్లను రూపొందిస్తున్నట్లు చెప్పారు. తాము డిజైన్ చేసిన ‘పార’తో కూలీల శ్రమ చాలా తగ్గుతుందని, వారి మోకాళ్లు, నడుంపై కూడా భారం పడదని తెలిపారు.
చెన్నుపాటి విద్యకు జమ్నాలాల్ బజాజ్ అవార్డు
Published Sat, Nov 29 2014 1:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement