సచివాలయంలో యువకుడి ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

సచివాలయంలో యువకుడి ఆత్మహత్యాయత్నం

Published Fri, May 22 2015 5:10 PM

సచివాలయంలో యువకుడి ఆత్మహత్యాయత్నం - Sakshi

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో ఓ యువకుడు పురుగుల మందు తాగాడు. గతంలో కాంట్రాక్టు విద్యుత్ కార్మికుడిగా పనిచేసిన తనను విధుల్లోంచి తీసేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అతడిని నల్లగొండ జిల్లాకు చెందిన యువకుడిగా గుర్తించారు. ముందు ఇద్దరు యువకులు కలిసి సచివాలయానికి వచ్చారు. వారిలో ఒకరు పురుగుల మందు డబ్బా తీసుకొని తాగేశాడు.

ముందు ఎవరు గుర్తించకపోయినా అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో పక్కనే వచ్చిన మరో యువకుడు సమీపంలో వారికి సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి ఒక్కసారిగా పోలీసులు, సమీప అధికారులు హుటాహుటిన వచ్చి ఆ యువకుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు. ఒకపక్క, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం చెప్తుండగా.. కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతున్నామంటూ కొన్ని ప్రభుత్వ సంస్థలు ఎంతోకాలంగా పనిచేస్తున్నవారిని తొలగిస్తుండటంతో వారు తీవ్ర మనస్థాపానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement