హైదరాబాద్లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ రంగారెడ్డి జిల్లా సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ వైఎస్సార్ సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి. చిత్రంలో సత్యం శ్రీరంగం, శివకుమార్, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, గట్టు రామచంద్రరావు, సురేష్రెడ్డి, అమృతాసాగర్.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన ప్రతి కార్యక్రమం చేవెళ్ల నుంచే ప్రారంభించేవారని, ఇకపై తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ తలపెట్టే కార్యక్రమాలన్నీ చేవెళ్ల నుంచే మొదలుపెడతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర కమిటీ సభ్యుడు కొండా రాఘవరెడ్డి అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జిల్లా నేతలనుద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రంలో సమస్యలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయని, వాటి పరిష్కార విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని అన్నారు. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వె ళ్లి పరిస్థితిని తెలుసుకోవాలని పిలుపుని చ్చారు. నిరంతరం ప్రజల్లోఉంటూ సమస్యలపై పోరాటం సాగించాలన్నారు. కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం రోజుకో సర్వేతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
జిల్లాలోని 48 డివిజన్లలో పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు శ్రేణులు కృషి చేయాలన్నారు. పార్టీ బలగమంతా తక్షణమే ప్రజల్లోకి వెళ్లాలని, గ్రేటర్ పరిధిలో సమస్యలపై ప్రభుత్వాన్ని, అధికారగణాన్ని నిలదీయాలని సూచిం చారు. 2019లో వైఎస్సార్సీపీ రాష్ట్రంలో బలీయశక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో భాగంగా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అమృతాసాగర్, యువజన విభాగం అధ్య క్షుడు సురేష్రెడ్డి, రాష్ట్ర నాయకులు ఏనుగు మహిపాల్రెడ్డి, సీఈసీ సభ్యులు శ్రీరంగంసత్యం, నియోజకవర్గ నేతలు రుక్మారెడ్డి, ప్రభుకుమార్, సూర్యనారాయణరెడ్డి, ముస్తాక్ అహ్మద్, చెరుకు శ్రీనివాస్, నాగిరెడ్డి, కె.రాఘవరెడ్డి తదితరులు త్వరలో చేపట్టాల్సిన కార్యక్రమాలనుద్దేశించి సలహాలు, సూచనలిచ్చారు.
చేవెళ్ల నుంచే మొదలుపెడదాం..
Published Tue, Oct 21 2014 12:20 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement