ఆడపిల్ల కోసమంటూ బాలికపై లైంగికదాడి | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల కోసమంటూ బాలికపై లైంగికదాడి

Published Thu, Jul 13 2017 12:28 PM

ఆడపిల్ల కోసమంటూ బాలికపై లైంగికదాడి - Sakshi

► ఆడపిల్ల కోసం ఏడాదిగా బలవంతం
► భార్యభర్తలపై కేసు 
 
శంకరపట్నం(హుజూరాబాద్‌): కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం ఏరడపెల్లి గ్రామానికి చెందిన బాలికపై ఏడాదిగా లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీను కథనం.. ఏరడపెల్లి గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికపై ఇదే గ్రామానికి చెందిన లోకిని రమేశ్‌(32) ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. పెళ్లి అయిన ఆయనకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. అయితే ఆడపిల్ల కోసం సహకరించమని బాలికను లోబర్చుకున్నాడు.

భర్త తీరును భార్య  ప్రోత్సహించింది. సహకరించాలని బాలికపై ఒత్తిడి చేసింది. అంతేకాదు కేశవపట్నంలో భూమి ఇవ్వాలనుకుంటున్నామని ఆశా చూపారు. ఈక్రమంలో గర్భందాల్చిన సదరు బాలికకు అబార్షన్‌ కూడా చేయించారు. దీంతో బాధితురాలు బుధవారం స్థానిక పోలీసులను ఆశ్రయించింది. న్యాయం చేయాలని వేడుకుంది. భార్యాభర్తలపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. 

Advertisement
Advertisement