బ్యాంకుకు కన్నమేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు దొంగలు
వీలుకాకపోవడంతో మద్యం తాగి, బజ్జీలు తిని లోపలే నిద్ర!
వారి వద్ద ఆయుధాలుండొచ్చని రాత్రంతా పోలీసుల కాపలా
పెద్దేముల్లోని విజయా బ్యాంకులో సినీ ఫక్కీలో ఘటన
పెద్దేముల్: అనగనగా ఇద్దరు ‘చిన్న’ దొంగలు.. రంగారెడ్డి జిల్లా పెద్దేముల్కే చెందిన వారిద్దరి పేర్లు బ్యాగరి లక్ష్మప్ప(26), బ్యాగరి సురేష్(25). వీరు స్థానిక విజయా బ్యాంకులో దోపిడీకి ప్రణాళిక రచించారు. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత మద్యం తాగి బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బ్యాంకు వెనుక గోడకు కన్నంవేసి లోపలికి ప్రవేశించారు. మొదట ఏటీఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తర్వాత లాకర్ను గునపంతో తెరిచేందుకు యత్నించినా వారి వల్ల కాలేదు. ఈ క్రమంలో బ్యాంకు నుంచి శబ్దాలు రావడం గమనించిన గ్రామస్తులు కానిస్టేబుల్ ఖదీర్ కు సమాచారమిచ్చారు. ఆయన ఎస్ఐ రమేష్కు, సీఐ రవికి తెలపడంతో వెంటనే సిబ్బందితో వారు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఇదంతా జరిగేందుకు రెండు మూడు గంటలు పట్టింది. బ్యాంకుకు వేసిన కన్నం వద్ద చెప్పులు, ఒక చొక్కా దొరికాయి. చొక్కా కాలర్పై కర్ణాటక రాష్ట్రం టైలర్ పేరు ఉంది. దీంతో బ్యాంకు దోపిడీకి వచ్చింది కర్ణాటక దొంగల ముఠా అయి ఉంటుందని పోలీసులు అనుమానించారు. వారివద్ద ఆయుధాలు ఉండొచ్చని భావించి బ్యాంకు చుట్టూ పోలీసులను మోహరించారు. తెల్లారడంతో విషయం తెలిసిన గ్రామస్తులంతా బ్యాంకు వద్దకు చేరారు. బ్యాంకు మేనేజర్ రాము కూడా తాళాలు తీసుకొచ్చారు. కానీ లోపలికి వెళ్లేందుకు పోలీసులు మాత్రం సాహసించలేదు.
ఖాకీల మర్యాద మంత్రం: ఏం చేయాలో పాలుపోక పోలీసులు దొంగలను బయటకు రప్పించేందుకు మర్యాద మంత్రాన్ని పాటించారు. ‘మీరు దొంగతనానికి వచ్చినా సరే.. మీపైన కేసులు పెట్టం.. మిమ్మల్ని ఏమీ చేయం.. బయటకు రండి’ అంటూ తెలుగు, హిందీ భాషల్లో అరగంటపాటు కన్నం నుంచే బతిమాలుకున్నారు. ఇది గ్రహించిన దొంగలు బ్యాంకు లోపలే తమవెంట తెచ్చుకున్న మద్యం తాగి, బజ్జీలు తిని హాయిగా నిద్రపోయారు.
చివరకు ఇలా దొరికారు: సమయం.. ఉదయం ఆరున్నర. దొంగల్లో ఒకరైన లక్ష్మప్ప నిద్రలేచాడు. కన్నం వద్దకు వచ్చి చూశాడు. పోలీసులు అక్కడే ఉన్నారు. అతడిని గమనించిన పోలీసులు ‘నిన్ను ఏమీ చేయం.. బయటకురా..’ అని పిలిచారు. దాంతో అతను కన్నం ద్వారా బయటకు వచ్చాడు. ఇంకా లోపల ఎంతమంది ఉన్నారని పోలీసులు ప్రశ్నించగా.. మరొకడు నిద్రపోతున్నాడని చెప్పాడు. చోరీకి వచ్చింది కర్ణాటక దొంగలు కాదని, ‘లోకల్’ దొంగలేనని నిర్ధారించుకున్న పోలీసులు ధైర్యం చేశారు. బ్యాంకు మేనేజర్ ప్రధాన ప్రవేశద్వారం తాళం తీయగా లోపలికి వెళ్లారు. లోపల వెతగ్గా బ్యాంకు స్టోర్రూం సజ్జపైన సురేష్ నిద్రపోయి ఉన్నాడు. పోలీసులు అతడ్ని నిద్రలేపి అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ రాజకుమారి, ఏఎస్పీ వెంకటస్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ దొంగలు- పోలీసుల మధ్య దోబూచులాట మంగళవారం ఉదయం 7 గంటలకు ముగిసింది.
దొంగ - పోలీస్.. దోబూచులాట!
Published Wed, Jul 30 2014 12:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement