కాలం కలిసిరాక ఖరీఫ్ రైతులు చిత్తయ్యారు. వర్షాభావం కారణంగా జిల్లాలో సాగు సగానికి తగ్గింది. భవిష్యత్తును తల్చుకుంటేనే రైతున్న వెన్నులో వణుకు పుడుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలన్నర రోజులవుతోంది. అన్ని పంటలకు అదను దాటుతోంది. కానీ ఇప్పటివరకు జిల్లాలో 55 శాతమే పంటలు సాగయ్యాయి. ఇక మిగిలిన 45శాతం పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది.
కరీంనగర్ అగ్రికల్చర్ తొలకరి వర్షాలకు జూన్లో పత్తి, మొక్కజొన్న విత్తులు పెట్టిన రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. తొలిదశలో విత్తులు దెబ్బతినగా మరోసారి విత్తుకున్న రైతులను వరుణుడు కొం త ఆలస్యంగా కరుణించాడు. అదును దాటాక కురుస్తున్న వర్షాలు కొంత ఊరటనిచ్చినా.. పూర్తిస్థాయిలో పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. మున్ముందు వర్షాలు ఎలా ఉంటాయోనని ఐదెకరాల భూమి ఉన్న రైతులు కూడా రెండు మూడెకరాలకు మించి సాగు చేసేందుకు సాహసించడం లేదు.
రానున్న రోజుల్లో వర్షాలు లేకుంటే పెట్టుబడులు మట్టిపాలై అప్పులు మీదపడుతాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 5.18 లక్షల హెకార్లు కాగా, ఇప్పటివరకు 2.86 హెక్టార్లలోనే వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 4.05 లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు. వరిసాధారణ సాగు విస్తీర్ణం 2.13 లక్షల హెకార్లు కాగా, 38వేల హెక్టార్లలోనే సాగు చేశారు. పత్తి 2.30 లక్షల హెక్టార్లకు 1.84 లక్షల హెక్టార్లలో వేశారు. ఇక మొక్కజొన్న, సోయాబీన్, పసుపు, మిర్చి, పప్పుధాన్యాల పంటలు నామమాత్రంగానే సాగయ్యాయి.
పుట్టని బ్యాంకు రుణాలు
ఈ ఏడు ఖరీఫ్ సీజన్కు రూ.1650 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుం ది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు రూ.85 కోట్ల రుణాలను మాత్రమే బ్యాంకులు మంజూరు చేశాయి. జిల్లావ్యాప్తంగా కేవలం 28,300 మం ది రైతులకే ఈ రుణాలు అందించాయి. పాత రుణాలు చెల్లించిన రైతులే తిరిగి రుణాలు పొం దారు. గతేడాది ఇదే సమయానికి రూ.690 కోట్ల రుణాలను 2.30 లక్షల మందికి మంజూరు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో బ్యాంకర్లు రుణాలివ్వడం లేదు. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. రుణమాఫీపై స్ప ష్టత లేకపోగా పాత రుణాలను రైతులు చెల్లించకపోవడంతో కొత్తగా రుణాలు ఇవ్వలేకపోతున్నామని లీడ్బ్యాంకు మేనేజర్ చౌదరి చెప్పారు.
లోటు వర్షపాతమే..
జూన్లో సాధారణ వర్షపాతం 153 మిల్లీమీటర్ల కాగా.. 78.7 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. గతేడాది జూన్లో 208.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలైలో సాధారణ వర్షపాతం 221.2 మిల్లీమీటర్లకు గాను ఇప్పటివరకు 97.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గతేడాది ఇదే సమయానికి 443.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటికీ 45 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 47 మండలాలల్లో లోటువర్షం, ఏడు మండలాల్లో అత్యల్పం, మూడు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లో నీళ్లు చేరుతున్నాయి. భూగర్భ జలమట్టం కూడా కొంత పెరిగే అవకాశముంది.
కరెంటు కోతలే అసలు సమస్య
బోర్లు, బావులున్న రైతులు అధికారులు వద్దంటున్నా వరిసాగుపైనే దృష్టిపెట్టారు. తొలకరి వర్షాలకు పోసిన నార్లు ముదురుతుండటంతో ఇటీవల నాట్లు వేశారు. ఆశించిన వర్షాలు లేకున్నా నీరందించి పంటను కాపాడుకోవచ్చని భావించారు. కానీ రైతులకు అడుగడుగునా కరెంటు సమస్య ఎదురవుతోంది.
వ్యవసాయానికి ఏడు గంటలు సరఫరా చేస్తామన్న సర్కారు ప్రస్తుతం మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని రైతులు పేర్కొంటున్నారు. దీనికితోడు ఓవర్లోడ్, లోవోల్టేజీ సమస్యలతో నిత్యం కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న కరెంటు కోతలను చూస్తే.. మున్ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగేలా కనిపిస్తోంది. ఇన్ని ఆటంకాలను అధిగమించి పంటలు పండించడం అన్నదాతకు సాధ్యమయ్యేనా అనే సందేహాలు నెలకొన్నాయి.
సాగు సగమే..
Published Wed, Jul 30 2014 4:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement