కాళేశ్వరంపై కేంద్రాన్ని కోరిన మర్రి శశిధర్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి అజయ్నారాయణ్ ఝాను కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి కోరారు. శుక్రవారం అజయ్నారాయణ్ను ఢిల్లీలో కలుసుకున్న శశిధర్రెడ్డి.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలను పాటించడం లేదని వివరించారు.
అనంతరం శశిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక, పర్యావరణ, సామాజిక అభివృద్ధిపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణను హైదరాబాద్లో కూడా నిర్వహించాల్సి ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 15 ప్రాంతాల జాబితాలో హైదరాబాద్ లేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రభావానికి సంబంధించిన సమగ్ర నివేదికను ప్రజాభిప్రాయ సేకరణ జాబితాలో ఉన్న ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తి వివరాలు లేని ప్రభావ అంచనా నివేదికను అందుబాటులో ఉంచిందన్నారు. ఈ కారణాల వల్ల అభిప్రాయ సేకరణను వాయిదా వేయించి, ప్రభుత్వం పూర్తిగా నిబంధనలు పాటించేలా ఆదేశాలివ్వాలని కోరారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు బహిరంగంగా మాట్లాడటం సబబుకాదని కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి శశిధర్రెడ్డి అన్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయించండి
Published Sat, Aug 19 2017 3:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement