⇒ 4,000 మెగావాట్ల థర్మల్ ప్లాంటు ఏర్పాటుకు లైన్ క్లియర్
⇒ దేశంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ కేంద్రంగా అభివృద్ధి
⇒ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్టీపీసీల మధ్య కుదిరిన అవగాహన
⇒ సీఎం కేసీఆర్తో సంస్థ సీఎండీ భేటీలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం భారీ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఇది దేశంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రంగా నిలవబోతోంది.
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా రామగుండంలోని ప్రస్తుత ఎన్టీపీసీ కేంద్రం ఆవరణలోనే నిర్మించాలని సంస్థ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహనకు వచ్చాయి. ఎన్టీపీసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ అరుప్రాయ్ చౌదరి, దక్షిణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.వెంకటేశ్వరన్ సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ‘రామగుండం ఎన్టీపీసీ’ విస్తరణకు సంబందించిన ప్రతిపాదనలను ఈ సందర్భంగా ఆయన ముందుంచారు. సీఎం సైతం సానుకూలంగా స్పందించారు.
పంతం నెగ్గించుకున్న ఎన్టీపీసీ
ఎన్టీపీసీకి రామగుండంలో 9,500 ఎకరాల స్థలం ఉంది. ఇప్పటికే అక్కడ 2,600 మెగావాట్ల థర్మల్ కేంద్రాలను సంస్థ నిర్వహిస్తోంది. విభజన చట్టంలోని హామీ అమలులో భాగంగా తొలి విడతగా 1,600(2ఁ800) మెగావాట్ల అదనపు సామర్థ్యంతో రామగుండం ప్లాంట్ విస్తరణ పనులను ఇప్పటికే ఎన్టీపీసీ చేపట్టింది. మిగిలిన 2,400 మెగావాట్ల ప్లాంట్లకు స్థల కేటాయింపుల విషయంలో ఎన్టీపీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొంతకాలంగా ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. నల్లగొండ జిల్లా దామరచర్లలో స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం ముందుకురాగా, ఎన్టీపీసీ మాత్రం రామగుండంపైనే పూర్తి ఆసక్తిని ప్రదర్శిస్తూ వచ్చింది.
మొత్తం 4,000 మెగావాట్ల ప్లాంట్లను రామగుండంలోనే నిర్మించాలనే ప్రతిపాదనను సంస్థ సీఎండీ అరుప్రాయ్ తాజాగా సీఎం కేసీఆర్ ముం దుంచారు. నాలుగేళ్లలో ఈ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు నీటితోపాటు కేంద్రం నుంచి బొగ్గు కేటాయింపుల అంశాన్ని స్వయంగా పరిశీలిస్తానని సీఎం కూడా హామీ ఇచ్చారు. దీంతో నాలుగేళ్లలో రామగుండం ఎన్టీపీసీ సామర్థ్యం 6,600 మెగావాట్లకు చేరనుంది.
కాగా, రామగుండం మండల పరిధిలో బీపీఎల్ సంస్థకు గతంలో కేటాయించిన నిరుపయోగ భూములను తమకు కేటాయించాలని కేసీఆర్ను ఎన్టీపీసీ సీఎండీ కోరారు. అయితే ప్రస్తుతం కోర్టు వివాదంలో ఉన్న ఈ భూములపై ఎలాంటి హామీ ఇవ్వలేమని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. ఎన్టీపీసీ విస్తరణలో భాగంగా యాష్ పాండ్(బూడిద నిల్వ స్థలం) ఏర్పాటు కోసం 400 ఎకరాలు కావాలని ఎన్టీపీసీ కోరగా, ఇప్పడున్న యాష్ పాండ్తోనే ప్రస్తుతానికి పని కానివ్వాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం.
దామరచర్లలో సోలార్ ప్లాంట్లు
నల్లగొండ జిల్లా దామరచర్లలో జెన్కో, ఎన్టీపీసీల ఆధ్వర్యంలో 6,400 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. జెన్కో ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఈ ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీ వైదొలగడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది. జెన్కో నిర్మించే థర్మల్ కేంద్రాలతోపాటు అక్కడ ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
రామగుండం ఎన్టీపీసీ ‘మెగా’ విస్తరణ
Published Tue, May 26 2015 3:36 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రోటీ చేసి, భోజనం వడ్డించిన ప్రధాని మోదీ - వీడియో
ఓటేసి మా బాధ్యత పూర్తి చేశాం(ఫొటోలు)
తెలంగాణలో ఓటేసిన రాజకీయ ప్రముఖులు (ఫొటోలు)
ఏపీ ఎన్నికల ఓటింగ్ పై కొమ్మినేని విశ్లేషణ
ఓటు హక్కు వినియోగించుకున్న YSRCP నేతలు
Obstructing field: జడ్డూ కావాలనే చేశాడా?.. సీఎస్కే కోచ్ స్పందన ఇదే!
సూపర్ మామ్: తన క్యూటీస్తో నయన తార స్పెషల్ వీడియో వైరల్
స్టేజీపై నటిస్తూ కన్నుమూసిన ప్రముఖ నటుడు
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ప్రతి ఓటరు మీ హక్కును వినియోగించుకోండి: మురుగుడు లావణ్య
తప్పక చదవండి
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- శ్రీనగర్లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్!
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
- నయవంచనకు చెక్ పెడదాం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement