బిల్డింగ్‌పై నుంచి పడి వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

బిల్డింగ్‌పై నుంచి పడి వ్యక్తి మృతి

Published Mon, Mar 30 2015 5:58 PM

man accidental death

హైదరాబాద్ : కొత్తగా నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ రెండో అంతస్తు పై నుండి ప్రమాదవశాత్తూ కిందపడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్ మలక్పేట్లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..  నగరానికి చెందిన ప్రకాశ్(40) అనే వ్యక్తి  మలక్పేట్లో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ వద్ద వాచ్మెన్గా పని చేస్తున్నాడు. కాగా సోమవారం ఉదయం 11గంటల సమయంలో ప్రమాదవశాత్తూ బిల్డింగ్ రెండో అంతస్తు పై నుండి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను ఆసుపత్రిలో మరణించాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement