హన్మకొండ సిటీ : ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించాలని వరంగల్ రీజినల్ మేనేజర్ ఇ.యాదగిరి డిపో మేనేజర్లకు సూచిం చారు. హన్మకొండలోని వరంగల్ రీజినల్ కార్యాలయం లో మంగళవారం డిపో మేనేజర్ల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిపోల వారీగా ప్రగతిని సమీక్షించారు. అనంతరం ఆర్ఎం మాట్లాడుతూ రీజియన్లో వరంగల్-1, హన్మకొండ డిపోలు లాభాల్లో ఉన్నాయని తెలిపారు. వరంగల్-2, పరకాల, భూపాలపల్లి, నర్సం పేట, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు డిపోలు న ష్టాల్లో ఉన్నాయన్నారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు రీజియన్ రూ.1.84 కోట్ల నష్టాల్లో ఉందని వివరించారు.
ఆర్టీసీని లాభాల్లోకి తేవడానికి బస్సుల వారీగా ఆదాయాన్ని సమకూర్చాలని డిపో మేనేజర్లకు సూచించారు. గరుడ, ఇంద్ర బస్సుల ఆదాయం మెరుగ్గా ఉందన్నారు. అదేవిధంగా సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల పరిస్థితి ఆశాజనకంగా, డీలక్స్ బస్సుల పరిస్థితి నిరాశజనకంగా ఉందని పేర్కొన్నారు. సబర్బన్ బస్సుల ఆదాయం తగ్గిందని వివరించారు. వీటి ఆదాయం పెం చేందుకు ప్రధాన స్టేజీల వద్ద ట్రాఫిక్ గైడ్లను నియమిస్తున్నట్లు చెప్పారు. జూలైలో వరంగల్ రీజియన్ ఇంధన పొదుపులో అగ్రభాగంలో ఉందన్నారు. సమయ పాలనలో మహబూబాబాద్, భూపాలపల్లి డిపోలు వెనుకబడి ఉన్నాయని వివరించారు. డిప్యూటీ సీటీఎం భవానీప్రసాద్, డిప్యూటీ సీఎంఈ అంచూరి శ్రీధర్, ఏఓ వై.కృష్ణ, డిపో మేనేజర్లు పాల్గొన్నారు.
ఇంధనాన్ని పొదుపు చేయూలి..
ఇంధన పొదుపుతో పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని ఆర్టీసీ ఆర్ఎం ఇ.యాదగిరి డ్రైవర్లకు సూచించారు. వరంగల్లోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ శిక్షణ కాలేజీలో ఆర్టీసీ డ్రైవర్లకు ఇంధన పొదుపు పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు సాధారణ ఇంజిన్ శక్తిని ఉపయోగించి వాహనాన్ని నడపడంతో కేఎంపీఎల్ తక్కువగా వస్తుందన్నారు. పవర్పాయింట్ను ఉపయోగించి సరైన దిశలో ఎక్స్లెటర్ వాడితే డీజిల్ తక్కువ ఖర్చయి అత్యధిక కేఎంపీఎల్ వస్తుందన్నారు. డీజిల్ ఎంత ఎక్కువ ఖర్చయితే అంత కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎంఈ అంచూరి శ్రీధర్, రాజు పాల్గొన్నారు.
ఆర్టీసీని లాభాల్లోకి తేవాలి
Published Wed, Aug 27 2014 4:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
మరింత ఆలస్యంగా..?
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement