వారి కనీస కోరికలు తీర్చాలి వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుంది
{పభుత్వం మొండి వైఖరి విడనాడాలి
ఖమ్మంసిటీ : ‘అసలు ప్రభుత్వానికి మానవత్వం ఉందా..? ఉన్నట్లయితే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను పరిశుభ్రం చేసే కార్మికుల పట్ల వివక్ష చూపదు’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. తమ కనీస కోరికలు తీర్చాలని 19 రోజులుగా కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల మద్ధతుతో జరుగుతున్న పారిశుధ్య కార్మికుల సమ్మెకు వైఎస్సార్ సీపీ శ్రేణులు శుక్రవారం సంఘీభావం తెలిపారు. పార్టీ ఖమ్మం, పాలేరు నియోజకవర్గ ఇన్చార్జులు కూరాకుల నాగభూషణం, సాధు రమేష్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మినేని వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధులు ముదిరెడ్డి నిరంజన్రెడ్డి, మందడపు వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షుడు తోట రామారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షర్మిలా సంపత్ ఈ సందర్భంగా మాట్లాడారు.
కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విభజించి పాలిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగర పాలక సంస్థలో ఉద్యోగులకు జీతాలు పెంచి, మిగతా ప్రాంతాల్లోని కార్మికులకు మొండిచేయి చూపించడం తగదన్నారు. కార్మికులకు మద్దతుగా గత వారం జరిగిన రాష్ట్ర బంద్లో పార్టీ శ్రేణులు అధికసంఖ్యలో పాల్గొన్నారని అన్నారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం హైదరాబాద్తో పాటు జిల్లాలోని పాల్వంచ పట్టణాల్లో కార్మికులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మికుల పక్షాన చేస్తున్న పోరాటాలను తెలంగాణ రాష్ట్రంలోనూ కొనసాగిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ మెడలు వంచుతామన్నారు. పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు భీమనాధుల అశోక్రెడ్డి, లాయర్స్ విభాగం అధ్యక్షుడు శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికులపై వివక్ష తగదు
Published Sat, Jul 25 2015 3:35 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Delhi liquor scam: కేజ్రీవాల్కు ‘ప్రచార’ బెయిల్
మోదీ మళ్లీ ప్రధానైతే.. దేశం ఉత్తర కొరియానే
చిక్కుల్లో హరియాణా సర్కారు!
తెలంగాణ మద్యం పట్టివేత
వైఎస్సార్సీపీలోకి వలసలు
మోదీ అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు ఉండవు
అందరివాడికే అందలం
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనది
16,772 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
పకడ్బందీగా ఎన్నికలు
తప్పక చదవండి
- తనిఖీలు చేయండి.. నిఘా పెంచండి
- అబద్ధాల మోదీ
- Aravind Kejriwal: నేను వచ్చేశా...
- బీజేపీ వైపే ప్రజలు
- మోదీ మళ్లీ ప్రధానైతే.. దేశం ఉత్తర కొరియానే
- Lok Sabha Election 2024: ఎన్నికల సమాచారం సమస్తం... వేలి కొసలపైనే!
- జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు !
- జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
- నేడు రాష్ట్రంలో అమిత్ షా ప్రచారం
- బీజేపీపై తప్పుడు ప్రచారం
Advertisement