'దీపావళి సంపూర్ణంగా చేసుకోలేకపోతున్నారు' | Sakshi
Sakshi News home page

'దీపావళి సంపూర్ణంగా చేసుకోలేకపోతున్నారు'

Published Tue, Oct 21 2014 3:51 PM

'దీపావళి సంపూర్ణంగా చేసుకోలేకపోతున్నారు'

హైదరాబాద్: పాలనలో సీఎం కేసీఆర్ విఫలమైనందున తెలంగాణ ప్రజలు దీపావళి పండుగను సంపూర్ణంగా జరుపుకోలేని పరిస్థితిలో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తమ మద్దతుదారులకు మేలు చేసేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్లు లేకుండా రూ.5లక్షల వరకు పనులను కార్యకర్తలకు ఇచ్చేందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు.

ఈ విధానం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్దమన్నారు. ఈ ప్రతిపాదనను విరమించుకోకుంటే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని పొంగులేటి హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement