జగిత్యాల:
తెల్లవారు జామున జరిగిన హత్యతో జగిత్యాల ఉలిక్కిపడింది. పట్టణంలోని పార్క్లైన్ రోడ్డులో మంగళవారం నడి రోడ్డుపై ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు.. సిద్దిపేటలోని కాళ్లకుంట ప్రశాంత్నగర్ చెందిన ఎండీ.లాల్మహ్మద్(40). తలపై రాయితో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజుల క్రితం పాత బస్టాండ్లో యాచకుడి హత్య ఘటన మరిచిపోకముందే మరో హత్య జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వివరాలు కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. లాల్మహ్మద్, అతని తమ్ముడి యాకుబ్ కుటుంబాలు బతుకుదెరువు కోసం గ్రామాల్లో తిరుగుతూ పాతసామగ్రిని బాగు చేస్తుంటారు. బిందెలకు రంద్రాలు, చొట్టలు పడితే తీస్తుంటారు. ఈక్రమంలో గత నెల 19న సిద్దిపేట నుంచి బయలుదేరారు. పలు పల్లెలు తిరుగుతూ ఉపాధి పొందుతున్నారు. బక్రీద్ పండుగ కోసం ఇంటికెళ్లాలనుకున్నారు. ఈక్రమంలో ధర్మపురి మండలం తిమ్మాపూర్ నుంచి సోమవారం రాత్రి బస్సులో బయలుదేరి జగిత్యాల బస్టాండ్కు చేరుకున్నారు. భార్య, బిడ్డలను బస్టాండ్లో ఉంచి ఇద్దరన్నదమ్ములు పక్కనే ఉన్న కల్లుపాకలోకి వెళ్లారు. కల్లు తాగిన తర్వాత భార్య, బిడ్డలకు అన్నం తెచ్చి పెట్టమని తమ్ముడిని పంపించి, లాల్మహ్మద్ అక్కడే కూర్చున్నాడు. బస్టాండ్కు వచ్చిన యాకూబ్ కుటుంబసభ్యులకు తినుబండారాలు ఇచ్చి తను రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉన్నాడు. అప్పటికీ అన్న రాకపోవడంతో యాకూబ్ కల్లుపాకకు వెళ్లి చూడగా లాల్మహ్మద్ అక్కడ కనిపించలేదు. చుట్టుపక్కల పరిశీలించిన ఆచూకీ లభించకపోవడంతో తిరిగి బస్టాండ్కు వెళ్లి ఈ విషయాన్ని వదినకు చెప్పి పడుకున్నాడు.
పెట్రోలింగ్తో వెలుగులోకి..
తెల్లవారుజామున పోలీసులు పెట్రోలింగ్కు బయలుదేరడంతో ఈ హత్య విషయం వెలుగుచూసింది. స్థానిక పార్క్సంధిలో నడిరోడ్డుపై మృతదేహం కనిపించింది. రాయితో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. వీరి జీపును చూసి పరుగెత్తిన మతిస్థిమితం లేని వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బస్టాండ్ వద్ద నిలిచిన జాగిలం
హత్య ఘటనను పరిశోధించేందుకు పోలీసులు కరీంనగర్ నుంచి జాగిలాన్ని తీసుకొచ్చారు. జాగిలం సంఘటన స్థలం నుంచి బస్టాండ్ వరకు వచ్చి ఆగిపోయిందని సీఐ నరేశ్కుమార్ తెలిపారు. తన మరిది యాకూబ్ రాత్రి రెండు గంటల ప్రాంతంలో బస్టాండ్ నుంచి లేచి వెళ్లాడని మృతుడి భార్య బీజానా భేగం ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పారు.
ఉలిక్కిపడ్డ జగిత్యాల
Published Wed, Sep 24 2014 3:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
Advertisement