బస్సు కిందపడి నాలుగేళ్ల బాలుడి మృతి | Sakshi
Sakshi News home page

బస్సు కిందపడి నాలుగేళ్ల బాలుడి మృతి

Published Fri, Jan 30 2015 2:06 PM

boy died in an accident


ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లి గేట్ వద్ద ఆర్‌టీసీ బస్సునుంచి దిగుతూ జారిపడి
 నాలుగేళ్ల బాలుడు శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలం
 గౌరారం గ్రామానికి చెందిన ధనలక్ష్మి, విష్ణుల కుమారుడు సాయి కిరణ్(4). తన తల్లి, అమ్మమ్మతో కలసి చింతపల్లికి వెళుతుండగా
 బస్సు నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ హఠాత్పరిణామంతో బాలుడి తల్లి సాయికిరణ్ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించింది.  మృత దేహన్ని ఎంతసేపటికీ తొలగించకపోవడంతో దేవరకొండ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement