బీజేఎల్పీ నేత కిషన్రెడ్డి ఆరోపణ
అసెంబ్లీలోకి అనుమతించకపోవడానికి నిరసనగా ఆందోళన
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలోకి తమను అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద బీజేపీ సభ్యులు జి.కిషన్రెడ్డి, కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి నల్లకండువాలు ధరించి, నోటికి నల్లగుడ్డలు కట్టుకుని శాసనసభ వరకు నడిచివెళ్లారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కిషన్రెడ్డి మాట్లాడుతూ, భూసేకరణ చట్టానికి సవరణలు చేసే సమావేశానికి తమను రాకుండా అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు.
గత సభలో సస్పెండ్ అయితే ఈ సభకు రాకూడదని ఏ చట్టంలో ఉన్నదో సీఎం, స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యతిరేక, నిజాం నిరంకుశ రాచరికం మాదిరిగా ప్రస్తుత పాలన సాగుతోందని, దీనికి టీఆర్ఎస్ తగిన ప్రతిఫలం అనుభవిస్తుందని హెచ్చరించారు. భూసేకరణ సవరణ చట్టం తప్పుల తడకలతో కూడినది కాబట్టే కేంద్రం తిప్పి పంపిందని, ఈ విధంగా వెనక్కు రావడం ప్రభుత్వానికి తలవంపులు కాదా అని కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. రైతులకు సరైన పరిహారం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు చట్టం తేవడం సరికాదని ఆయన చెప్పారు.
గవర్నర్కు ఫిర్యాదు: శాసనసభ విధానాలను కూలదోసేలా, ప్రతిపక్షాలను పట్టించుకోకుండా, రాజ్యాంగాన్ని అపవిత్రం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నం దున రాజ్యాంగ పరిరక్షకుడిగా జోక్యం చేసుకోవాలని గవర్నర్ నరసింహన్కు బీజేపీ ఎమ్మెల్యేలు వినతిపత్రం సమర్పించారు. ఆదివారం జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని కూడా కేవలం పది నిమిషాల్లోనే ముగించిన తీరు ప్రభుత్వ ఆధిపత్య ధోరణిని, అసహనాన్ని స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు. చివరి సమావేశాల్లో సస్పెండ్ చేసినా ప్రత్యేక సమావేశాల్లో అనుమతి ఇవ్వాలని గవర్నర్ అన్నారని, దీనిపై స్పీకర్తో మాట్లాడతానని చెప్పారన్నారు. తమ సస్పెన్షన్లపై ప్రభుత్వం పునరాలోచించకపోతే కోర్టులను ఆశ్రయించేందుకు వెనకాడబోమని హెచ్చరించారు.
ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన
Published Mon, May 1 2017 2:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement