వికారాబాద్: బీటెక్ విద్యార్థి కన్నారెడ్డిని పోలీసులు చితకబాదిన కేసులో సస్పెండైన వ్యవసాయ అధికారిణి (ఏవో) నీరజ తాజాగా సాక్షి టీవీతో మాట్లాడారు. ఎరువుల దుకాణానికి అనుమతి ఇచ్చేందుకు తాను లంచం అడిగినట్టు కన్నారెడ్డి కుటుంబసభ్యులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆమె చెప్పారు. వెంటిలేటర్ లేకపోవడంతోనే ఎరువుల దుకాణం ఏర్పాటుకు అనుమతించలేదని అన్నారు.
వ్యవసాయ కార్యాలయంలో తనతోపాటు మరో ఇద్దరు మహిళా అధికారులున్నారని, తమ పట్ల కన్నారెడ్డి, వారి కుటుంబసభ్యులే అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. అంతేకాకుండా తమ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారని, అందుకే పోలీసులను ఆశ్రయించామని చెప్పారు. రాత్రికి రాత్రే తనను ప్రభుత్వం సస్పెండ్ చేస్తుందని ఊహించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తనకు నమ్మకం ఉందని, తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.
వికారాబాద్ జిల్లా ఎర్రవల్లికి చెందిన కన్నారెడ్డి స్థానికంగా ఎరువుల దుకాణం ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరగా.. ఏవో నీరజ రూ. 20 వేలు లంచం ఇవ్వాలని అడిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇచ్చేందుకు అతను నిరాకరించడంతో అతనిపై స్థానిక పోలీసులతో దాడి చేయించినట్టు కథనాలు వచ్చాయి. పోలీసులు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేసుకోకుండానే కన్నారెడ్డిపై అమానుషంగా వ్యవహరించారు. దీంతో తీవ్రంగా గాయపడిన కన్నారెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ వ్యవహారంలో వ్యవసాయ అధికారి నీరజ, మొమిన్పేట్ ఎస్సై రాజులపై పోలీసుల కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఏవో నీరజను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారు!
Published Thu, Jun 1 2017 12:06 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
తప్పక చదవండి
- ఒడిశా సీఎం ఎంపిక.. ఇద్దరు నేతలకు టాస్క్
- వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు హేయం : సామినేని
- బాలకృష్ణ-బాబీ కొత్త సినిమా గ్లింప్స్ విడుదల
- ధరణిలో గోల్మాల్.. మణికొండలో భారీ భూకబ్జా!
- వరల్డ్కప్లో టీమిండియా సరికొత్త చరిత్ర.. సచిన్ ట్వీట్ వైరల్
- చదువుకు దాచిన డబ్బులు... సైబర్ నేరగాళ్ల పాలు!
- మరిన్ని చిక్కుల్లో సీమా హైదర్.. భారత్ వచ్చిన పాక్ భర్త?
- ఒకే రన్వేపై రెండు విమానాలకు అనుమతి ఉందా?
- ఏపీలో దాడులపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సీరియస్
- అమాంతం పెరిగిన చిరాగ్ ఫ్యాన్ ఫాలోయింగ్
Advertisement