కానాపూర్(అదిలాబాద్): ఇంజనీరింగ్ పూర్తి చేసి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా కానాపూర్ మండలం పాతెల్లాపూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కె. నరేందర్(24) గత ఏడాదే ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. అప్పటి నుంచి ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఈ క్రమంలో గురువారం రాత్రి కుటుంబసభ్యులు నిద్ర పోయాక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.