♦ తిరువళ్లూరు ఎస్పీ కార్యాలయంలో రహస్య విచారణ
♦ సన్నిహితుల వద్ద సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం
♦ పొన్నేరిలోనూ ఖాదర్బాషా పంచాయతీ లీలలు
తిరువళ్లూరు: రూ.20 కోట్ల రూపాయలు విలువ చేసే పంచలోహ విగ్రహాలను అక్రమంగా తరలించడంతో పాటు వాటిని విక్రయించిన కేసులో చిక్కుకుని పరారీలో ఉన్న డీసీబీ డీఎస్పీ ఖాదర్బాషా ఆచూకీ కోసం తిరువళ్లూరులో రహస్య విచారణను చెన్నై పోలీసులు చేపట్టారు. మదురై జిల్లా అరుప్పుకోటై సమీపంలోని ఆలపాడి ప్రాంతానికి చెందిన రిటైర్డ్ టీచర్ ఆరోగ్యరాజ్కు చెందిన వ్యవసాయ భూమిలో 2008వ సంవత్సరం వ్యవసాయ పనులను సాగించారు.
అప్పట్లో అరక దున్నుతుండగా శివపార్వతీల పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. అయితే వ్యవసాయభూమిలో బయటపడ్డ పంచలోహ విగ్రహాలపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వని ఆరోగ్యరాజ్ తన సన్నిహితుడు సంతానం కలిసి రహస్యంగా దాచి పెట్టారు. అనంతరం అదే ప్రాంతానికి చెందిన ఫొటోగ్రాఫర్ సుందరమూర్తి చేత ఫొటోలు తీయించి అంతర్జాతీయ స్మగ్లర్కు పంపించారు. ఈ విషయం ఆలస్యంగా బయటకు పొక్కడంతో అక్కడే సీఐగా పనిచేస్తున్న ఖాదర్బాష, హెడ్కానిస్టేబుల్ సుబ్బురాజ్ కలిసి ఆరోగ్యరాజ్ను పలిపించి తమదైన శైలిలో విచారణ చేపట్టి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.
అంతర్జాతీయ స్మగ్లర్తో చేతులు కలిపిన వైనం: ఆరోగ్యరాజ్ నుంచి పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్న ఇన్స్పెక్టర్ ఖాదర్బాష, హెడ్కానిస్టేబుల్ సుబ్బురాజ్ విగ్రహంపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అంతర్జాతీయ స్మగ్లర్ దీనదయాళన్తో సంప్రదింపులు జరిపారు. అనంతరం ఎవ్వరీకి తెలియకుండా శివపార్వతీల పంచలోహ విగ్రహాలను 20 లక్షల రూ పాయలకు విక్రయించి తద్వారా వచ్చిన సొమ్మును ఇద్దరు కలిసి పంచుకున్నారు.
వెలుగులోకి ఇలా:
గమ్మత్తుగా సాగిన విగ్రహల స్మగ్లింగ్ 2016 జూన్1న ఢిల్లీలో అంతర్జాతీయ స్మగ్లర్ దీనదయాళన్ అరెస్టుతో తిరువళ్లూరు డీఎస్పీ మెడకు ఉచ్చుబిగిసింది. దీనదయాళన్ వద్ద విచారణ జరిపిన పోలీసులు తిరువళ్లూరు డీఎస్పీ ఖాదర్బాష నుంచి సైతం విగ్రహాలను కొనుగోలు చేసినట్టు నిర్ధారించి కేసు నమోదు చేశారు. సుబ్బురాజ్ను అరెస్టు చేసిన పోలీసులు డీఎస్పీ ఖాదర్బాష కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పరారీలో డీఎస్పీ: సుబ్బురాజ్ అరెస్టు విషయం తెలుసుకున్న డీఎస్పీ మెడికల్ లీవు పెట్టి వెళ్లిపోయారు. అయితే డీఎస్పీ అచూకీ కోసం ఆరుగురితో కూడిన రెండు బృందాలు తిరువళ్లూరు ఎస్పీ కార్యాలయం, పోలీసు క్వార్టర్స్తో పాటు పలు ప్రాంతాల్లో రహస్యంగా తనిఖీ చేశారు. కాగా పొన్నేరీ డీఎస్పీగా ఉన్నప్పుడు భూసంబంధిత వివాదంలో తలదూర్చి రూ.80 లక్షల వరకు వసూలు చేశారన్న విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు షాక్ తిన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ చేపట్టిన పోలీసులు, సాయంత్రం ఏడున్నర వరకు విచారణను కొనసాగించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడడానికి నిరాకరించిన విచారణ బృందం, కొన్ని కీలక సమాచారాన్ని రాబట్టామని చెప్పి వెళ్లిపోయారు.
ఎస్పీ కోసం గాలింపు
Published Thu, Jun 29 2017 4:23 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
శ్రీనగర్లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
ఏపీలో పోటెత్తిన ఓటర్ (ఫొటోలు)
ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
Watch Live ఏపీ పోలింగ్ ప్రత్యక్ష ప్రసారం
1500 మీటర్ల విభాగంలో దీక్ష జాతీయ రికార్డు
విమానంలో ల్యాండింగ్గేర్ సమస్య.. గాల్లోనే మూడు గంటలు..
మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మరో బ్యూటీ!..
పిఠాపురంలో మహిళా ఓటర్లలో ఉత్సాహం కనిపిస్తుంది
మునుపటి కంటే ఈసారి అధిక శాతం ఓటింగ్
తప్పక చదవండి
- శ్రీనగర్లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్!
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
- నయవంచనకు చెక్ పెడదాం
- జనస్వామ్యమా! జయీభవ!!
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement