రెండేళ్లుగా రెండు గ్రాముల బంగారు డాలర్లు లేవు
ఏళ్ల తరబడి వెండి డాలర్లు పట్టించుకునే వారే కరువు
కనిపించని డాలర్ విక్రయ కేంద్రం.. భక్తుల ఆవేదన
సాక్షి, తిరుమల: దేశ విదేశాల్లో ధర్మప్రచారం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసే టీటీడీకి ధర్మప్రచారంతో ముడిపడిన శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాలతో కూడిన బంగారు, వెండి డాలర్ల విక్రయాలను విస్మరిస్తోంది. ‘‘నగదిస్తాం. శ్రీవారి బంగారు, వెండి డాలర్లు ఇవ్వండి’’ అని భక్తుల విజ్ఞప్తిని టీటీడీ అధికారులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. తిరుమల ఆలయం పక్కన లడ్డూ కౌంటర్ల సమీపంలోనే శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయ కేంద్రం ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామివారు, పద్మావతి అమ్మవారు చిత్రాలతో కూడిన వెండి, బంగారు డాలర్లను చంటి బిడ్డ నుంచి వృద్ధుల వరకు ధరిస్తుంటారు. ఇది ధర్మప్రచారానికి తోడ్పాటు అందిస్తోంది.
5 గ్రాములు, 10 గ్రాముల వెండి డాలర్లు విక్రయిస్తుంటారు. వీటి ధర రూ.100 నుంచి రూ.250 లోపే ఉండటంతో తిరుమల క్షేత్ర సందర్శనకు గుర్తుగా సామాన్య భ క్తులు కొనుగోలు చేస్తుంటారు. మూడేళ్లుగా వెండి డాలర్ల కేంద్రంలో నో స్టాక్ బోర్డు పెట్టేశారు. దీనిపై భక్తులు నిత్యం ఫిర్యాదులు, విజ్ఞప్తులు చేస్తున్నా ఏమాత్రమూ పట్టించుకోలేదు. ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు.
రెండేళ్లుగా రెండు గ్రాముల బంగారు డాలర్లేవు
బంగారు డాలర్లు విక్రయించే కౌంటర్లో రెండేళ్లుగా రెండు గ్రాముల డాలర్లు స్టాకు లేదు. సంబంధిత ఆలయ విభాగం అధికారులుగాని, తిరుపతిలోని జువెలరీ విభాగం గాని తమకు ఎలాంటి సంబంధమూ లేదని చెబుతోంది. డాలర్ల కొనుగోలు వ్యవహారాలను టీటీడీ మార్కెటింగ్ విభాగానికి అప్పగించినా ఫలితం కనిపించటం లేదు. ప్రస్తుతం 10 గ్రాములు రూ.26,260, 5 గ్రాములు రూ.13,345 బంగారు డాలర్లు మాత్రమే విక్రయిస్తున్నారు. వీటిలో తక్కువ ధర కలిగిన సుమారు రూ.5,400 ధర కలిగిన 2 గ్రాముల బంగారు డాలర్లకే భక్తుల నుంచి రెట్టింపు స్థాయిలో డిమాండ్ ఉంది. ఏటీఎం కార్డుల ద్వారా కొనుగోలు చేసే భక్తులకు 2.25శాతం సర్వీసు ట్యాక్స్ కట్టాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు. ఈ విషయంలో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు పట్టించుకోవాలని భక్తులు కోరుతున్నారు.
కనిపించని డాలర్ల విక్రయ కేంద్రం
గతంలో ఆలయం ముందే డాలర్ల విక్రయం కేంద్రం ఉండేది. అందువల్ల శ్రీవారిని దర్శించుకుని వెలుపలకు వచ్చిన భక్తులు గుర్తుగా డాలర్లు కొనుగోలుచేసే వారు. రెండేళ్లుగా దాన్ని లడ్డూ కేంద్రానికి మార్పు చేయడంతో సరిగ్గా కనిపించటం లేదు. ఈ విషయంపైనా అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది.
డాలర్లు ఏవి స్వామీ?
Published Thu, Feb 4 2016 9:16 PM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మంగళగిరిలో ఓటేసేందుకు వెళ్లిన పవన్ ఓవరాక్షన్
పాముల పుష్ప శ్రీవాణి ఓటు వేశారు
బీహార్ లోక్సభ ఎలక్షన్.. మోదీ కీలక వ్యాఖ్యలు
ఓటు హక్కు వినియోగించుకున్న పేర్ని నాని కుటుంబ సభ్యులు
పల్నాడులో బరితెగించిన టీడీపీ నేతలు..
పోలింగ్ టైం : : ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖలు
ఓటు వేసిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
భారీ సంఖ్యలో తరలివస్తున్న ఓటర్లు
బౌన్సర్లతో పోలింగ్ వద్ద టీడీపీ అభ్యర్థి థామస్ హల్ చల్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్!
తప్పక చదవండి
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్!
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement