చెన్నై: అపోలో ఆసుపత్రిలో జయలలితకు చికిత్స అందించిన నర్సు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఆమె ఇంటిలో వందకు పైగా నిద్రమాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇద్దరు కుమారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జయలలిత మృతి మిస్టరీగా మారిన నేపథ్యంలో కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు కారు డ్రైవర్తో సహా వరుసగా మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో జయకు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రి నర్సు గ్లోరియా (33) చెన్నై ఐనావరం నాగేశ్వర గురుస్వామి వీధిలో నివసిస్తోంది. భర్త విజయకుమార్ (35), అదే ప్రాంతంలో స్టేషనరీ దుకాణం నడుపుతున్నాడు. కుమారులు ప్రవీణ్కుమార్ (07), సుజిత (06) ఉన్నారు.
జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమెకు చికిత్స అందించిన నర్సులలో గ్లోరియా ఒకరు. ఇదిలా ఉండగా గత గ్లోరియా భర్త విజయకుమార్ నాలుగు నెలల క్రితం మృతి చెందాడు. గుండెనొప్పితో అతడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో భర్త మృతిపై గ్లోరియా మనోవేదనతో కనిపించేది. గత ఆదివారం గ్లోరియా తన ఇద్దరు కుమారులకు నిద్రమాత్రలు మింగించి తాను మింగింది. వీరిద్దరూ ట్యూషన్లో స్పృహతప్పి పడిపోయారు. వెంటనే వారిని చెన్నై అన్నానగర్లో గల సుందరం ఆసుపత్రిలో చేర్పించి అనంతరం అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అదే సమయం గ్లోరియాను చెన్నై రాజీవ్గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె స్థితి కొంచెం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. భర్త మృతి చెందడం వలన గ్లోరియా ఆత్మహత్యకు యత్నించిందా? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
‘జయ’ నర్సు ఆత్మహత్యాయత్నం
Published Wed, Jul 19 2017 8:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement