తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్ టై | Sakshi
Sakshi News home page

తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్ టై

Published Tue, Aug 4 2015 9:12 PM

తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్ టై

ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణీత 40 నిమిషాల సమయంలో ఇరు జట్లు 39 పాయింట్లే సాధించడంతో మ్యాచ్ టై అయినట్లు ప్రకటించారు. తొలి అర్ధభాగంలో 20-12తో ఆధిక్యంలో ఉన్న తెలుగు టైటాన్స్ రెండో అర్ధభాగంలో తమ జోరును కొనసాగించలేక పోయింది.

జైపూర్ అటగాళ్లు తమ దాడిని ఉదృతం చేయడంతో రెండు జట్లను విజయం దోబుచులాడింది. మ్యాచ్ చివరి సెకన్ వరకూ ఉత్కంఠ నెలకొన్న ఏ జట్టూ విజయాన్ని సాధించలేకపోయింది. సొంత స్టేడియంలో ఆడుతున్నప్పటికీ విజయాన్ని సాధించలేక పోవడంతో అభిమానులు నిరాశ చెందారు.

Advertisement
Advertisement