రూ. కోటీ 90 లక్షలు చెల్లించండి | Sakshi
Sakshi News home page

రూ. కోటీ 90 లక్షలు చెల్లించండి

Published Tue, Apr 28 2015 2:03 AM

రూ. కోటీ 90 లక్షలు చెల్లించండి

బీసీసీఐని కోరిన గవాస్కర్

న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్ చైర్మన్‌గా తాత్కాలిక బాధ్యతలు స్వీకరించినందుకు రూ. కోటీ 90 లక్షలు చెల్లించాల్సిందిగా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ బీసీసీఐని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సన్నీ ఈ పదవి చేపట్టారు. అయితే ఈ కాలంలో అతడు వ్యాఖ్యాత, కాలమ్స్ రచయితగా కోల్పోయే ఆదాయాన్ని బోర్డే చెల్లించాల్సి ఉంటుందని కూడా కోర్టు తెలిపింది.

‘ఐపీఎల్ చైర్మన్‌గా ఉన్నంత కాలం మీడియా అసైన్‌మెంట్స్‌కు దూరంగా ఉన్నానని, దీంతో నష్టపరిహారం కింద రూ. కోటీ 90 లక్షలు తనకు చెల్లించాలని బోర్డుకు గవాస్కర్ లేఖ రాశారు. దీన్ని ఆర్థిక కమిటీ ఆమెదించాల్సి ఉంటుంది. అయితే కోర్టు సూచనల మేరకు మేం ఆయనకు చెల్లించాల్సిందే’ అని వర్కింగ్ కమిటీకి హాజరైన బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు సలహా కమిటీలో తన పాత్ర గురించి మరిన్ని వివరాల కోసం సచిన్ టెండూల్కర్ అడిగినట్టు చెప్పారు.
 
 

Advertisement
Advertisement