సాయి దేదీప్యకే టైటిల్ | Sakshi
Sakshi News home page

సాయి దేదీప్యకే టైటిల్

Published Sun, Apr 20 2014 12:21 AM

sai dadipya won title

ఆసియా అండర్-14 టెన్నిస్ టోర్నీ
 సాక్షి, హైదరాబాద్: ఆసియా అండర్-14 చాంపియన్‌షిప్ బాలికల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి దేదీప్య విజేతగా నిలిచింది. పుణేలోని బాలేవాడీ కాంప్లెక్స్‌లో శనివారం ఈ టోర్నీ ముగిసింది. ఫైనల్లో దేదీప్య 6-3, 2-6, 6-2 స్కోరుతో మన రాష్ట్రానికే చెందిన అమినేని శివానిపై విజయం సాధించింది.
 
 బాలికల డబుల్స్‌లోనూ శివానికి నిరాశే ఎదురైంది. శివాని-ఇషిత పరేఖ్ జోడి ఫైనల్లో 3-6, 5-7 తేడాతో అధ్య చల్లా-విపాషా మెహ్రా చేతిలో పరాజయం పాలైంది. బాలుర సింగిల్స్‌లో పూజన్ దేశాయ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఫైనల్లో అతను 6-2, 6-0తో అమిత్ బేన్వాల్‌ను చిత్తు చేశాడు.
 

Advertisement
Advertisement