ధోనిసేనకు ప్రధాని ఓదార్పు | Sakshi
Sakshi News home page

ధోనిసేనకు ప్రధాని ఓదార్పు

Published Fri, Mar 27 2015 1:14 AM

ధోనిసేనకు ప్రధాని ఓదార్పు - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచకప్ సెమీస్‌లో ఓటమిపాలైన భారత జట్టుకు ప్రధాని నరేంద్ర మోది సాంత్వన వచనాలు పలికారు. ఓడినా ప్రదర్శన పట్ల గర్వం వ్యక్తం చేశారు. ‘గెలుపోటములు జీవితంలో భాగం. భారత జట్టు ప్రపంచకప్ మొత్తం చాలా బాగా ఆడింది’ అని ప్రధాని ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా భారత్ సెమీస్ పరాజయంపై ట్విట్టర్‌లో స్పందించారు. ‘భారత జట్టు బాగా ఆడింది. వచ్చే ప్రపంచకప్ కోసం బెస్టాఫ్ లక్. అద్భుతంగా ఆడిన ఆసీస్‌కు అభినందనలు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement