జాతీయ క్రీడల ఆర్గనైజర్ల నిర్వాకం
సాక్షి, హైదరాబాద్: దేశంలో బ్యాడ్మింటన్ అంటేనే గుర్తొచ్చే పేరు హైదరాబాద్. సైనా, సింధు, శ్రీకాంత్లాంటి భారత స్టార్ క్రీడాకారులంతా ఇక్కడి వారే. కానీ కేరళలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14వరకు జరిగే జాతీయ క్రీడల్లో మాత్రం వీళ్లు ఆడటానికి అవకాశం లేకుండా పోయింది. క్రీడలను నిర్వహిస్తున్న కేరళ రాష్ట్రం వైఖరి కారణంగా ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక కూడా బ్యాడ్మింటన్ జట్లను పంపలేకపోతున్నాయి. జాతీయ క్రీడల టీమ్ ఈవెంట్లో ఎనిమిది జట్లు బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. గత క్రీడల విజేత, ప్రస్తుత క్రీడల ఆతిథ్య జట్టుతో పాటు ఆరు జోన్స్ నుంచి విజేతలు టోర్నీలో పాల్గొనాలి.
సౌత్జోన్ విజేత కేరళ కాగా... గత క్రీడల చాంపియన్, ఆతిథ్య రాష్ట్రం కూడా అదే కావడంతో... మరో రెండు జట్లు పాల్గొనేందుకు అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం గత క్రీడల రన్నరప్, సౌత్జోన్ రన్నరప్ గేమ్స్లో పాల్గోవచ్చు. దీని ప్రకారం గత క్రీడల రన్నరప్ ఆంధ్రప్రదేశ్, సౌత్జోన్ రన్నరప్ కర్ణాటకలతో ఎనిమిది జట్లను ప్రకటించారు. అయితే కేరళ దీనికి అభ్యంతరం తెలిపింది. మారిన నిబంధనల ప్రకారం రెండు స్లాట్లు ఖాళీ ఉంటే అన్ని జోన్ల రన్నరప్లతో డ్రా తీసి రెండు జట్లను ఎంపిక చేయాలని వాదించింది. దీంతో ఏపీ, కర్ణాటకలలో జ్వాల, అశ్విన్ సహా పలువురు స్టార్ క్రీడాకారులు టీమ్ ఈవెంట్స్లో గేమ్స్కు దూరం కావాల్సి వస్తోంది.
కేరళ క్రీడాకారుల కోసమే...
ఈసారి జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన తమ రాష్ట్ర క్రీడాకారుల కోసం కేరళ భారీగా నజరానాలు ప్రకటించింది. పతకాలు గెలిస్తే 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు ఇస్తారు. బ్యాడ్మింటన్లో ఏపీ క్రీడాకారులు వస్తే తమ వాళ్లకు పతకాలు రావని కేరళ సంఘం భావించింది. దీంతో నిబంధనలను మార్చాలని ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైంది. ‘నిబంధనల ప్రకారం కర్ణాటక, ఏపీలతో నేను ఎనిమిది జట్ల పేర్లు పంపాను. పాత సంప్రదాయాన్నే పాటించాలని వాదించాను.
కానీ కేరళ మాటే చెల్లింది. మనవాళ్లు ఆడితే వాళ్లకు పతకాలు రావని తెలుసు. అందుకే విశ్వప్రయత్నాలు చేసి ఏపీని అడ్డుకున్నారు’ అని బాయ్ కార్యదర్శి పున్నయ్యచౌదరి చెప్పారు. మరోవైపు కర్ణాటక సంఘం అధ్యక్షుడు విమల్ కుమార్ కూడా కేరళ తీరుపై మండిపడ్డారు. నిబంధనలు ఎప్పుడు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ కేరళ సంఘం కార్యదర్శి మురళీధరన్ మాత్రం తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని చెబుతున్నారు. మొత్తానికి స్టార్స్ లేకుండానే జాతీయ క్రీడల బ్యాడ్మింటన్ జరగబోతోంది.
బ్యాడ్మింటన్లో ఏపీకి చోటు లేదు!
Published Fri, Dec 26 2014 11:58 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement