న్యూఢిల్లీ: పెట్రోల్ బంక్ల విషయంలో అనుమానం కలిగి ఉండటం తప్పులేదని మరోసారి రుజువైంది. ఇప్పటి వరకు కల్తీకి మాత్రమే పాల్పడే అవకాశం ఉందని బంక్లపై ఆరోపణలు ఉన్నప్పటికీ చెల్లించిన దానికంటే తక్కువ పెట్రోల్, డీజిల్ పోస్తున్నారని తాజాగా స్పష్టమైంది. ఉత్తరప్రదేశ్లో దీనికి సంబంధించి పెద్ద రాకెట్టు గుట్టు వీడింది. వినియోగదారుడు చెల్లించే ధరకు పోయాల్సిన పెట్రోల్, డీజిల్ కన్నా 10 నుంచి 15శాతం తక్కువ పోస్తున్నారు. ఓ వ్యక్తి నుంచి సమాచారం అందుకున్న స్పెషల్ టాస్క్ పోలీసులు వివిధ పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేయగా ఈ గుట్టు రట్టయింది.
నకిలీ పెట్రోల్ పంపులను ఉపయోగించి గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఇలా ఏడాదికి ప్రతి సంవత్సరం దాదాపు రూ.250 కోట్లు వెనుకేసుకుంటున్నారని తేల్చేశారు. దేశంలో కనీసం నిబంధనలు పాటించకుండా కస్టమర్లను మోసం చేసే డీలర్లు ఓ పదిశాతంమంది ఉన్నట్లు ఇప్పటికే ఓ అంచనా ఉంది. ఆయిల్ మంత్రిత్వశాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ప్రతి ఏడాది రూ.2,500కోట్ల విలువైన పెట్రోల్, డీజిల్ను 59,595 పెట్రోల్ బంకుల్లో యూపీ ప్రజలు కొనుగోలు చేస్తున్నారట.
అయితే, ప్రజలను చాలామంది రిటెయిలర్లు దారుణంగా మోసం చేస్తున్నారని తెలుసుకున్న ప్రత్యేక టాస్క్ పోర్స్ బృందం అప్పటికప్పుడు శుక్రవారం ఏడు పెట్రోల్ బంక్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించగా నకిలీ పంపులను ఉపయోగించి వినియోగదారులను మోసం చేస్తున్నట్లు తెలిసింది. రవీందర్ అనే వ్యక్తి దీనిని ప్రధానంగా నడిపిస్తున్నట్లు తెలుసుకున్నారు. అతడు ఉత్తరప్రదేశ్లోని దాదాపు 1000 పెట్రోల్ బంకుల్లో నకిలీ పంపులను పెట్టి నడిపిస్తున్నట్లు గుర్తించారు. దీంతో మరింత అప్రమత్తమైన టాస్క్ఫోర్స్ ప్రత్యేక టీంను సిద్ధం చేసి ఇప్పుడు తనిఖీలు చేయిస్తోంది. ఈ సందర్భంగా ఆయిల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన అభినందనలు తెలియజేశారు.
బంక్ల భారీ దగా.. తక్కువే పోస్తున్నారు
Published Sun, Apr 30 2017 9:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement