* శివసేన వైఖరిపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చ
* 119 మించి ఇవ్వబోమని తేల్చిచెప్పిన శివసేన
* 135కి తగ్గమంటున్న బీజేపీ
ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. 151 స్థానాలకు పోటీ చేసి తీరుతామని తెగేసి చెబుతున్న శివసేన.. బీజేపీకి 119కి సీట్లకు మించి ఒక్కటి కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఇదే తమ తుది మాట అని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. 135 స్థానాలకు తక్కువగా పోటీ చేయవద్దని, అవసరమైతే ఒంటరిగా బరిలో దిగుదామన్న పార్టీ మహారాష్ట్ర శాఖ వాదనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తదితరులతో కూడిన కమిటీ చర్చించింది. అయితే, శివసేనతో పొత్తును వదులుకోవడంపై మోదీ, అమిత్షాలు అంత ఆసక్తి చూపలేదని సమాచారం.
సమావేశం మధ్యలో మోదీ, షాలు కాసేపు ఏకాంతంగా చర్చలు జరిపారని, ఆ తరువాత అమిత్ షా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్లో మాట్లాడారని తెలిసింది. ఆ తరువాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలోనూ ఈ అంశంపై చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి పదవి శివసేనకు ఇచ్చేందుకు అంగీకరిస్తే.. శివసేన మరి కొన్ని సీట్లు బీజేపీకి ఇచ్చేందుకు ఒప్పుకోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మెుత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నారుు. ఆదివారం ఉదయం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం తర్వాత శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కార్యకర్తలతో మాట్లాడారు. ‘బీజేపీకి ఇంకెలాంటి రారుుతీ ఇవ్వదలుచుకోలేదు. ప్రతిపక్ష పార్టీల మహాయుతి (విపక్షాల మహా కూటమి) చెదిరిపోకుండా ఉండేందుకు నేనో చివరి ప్రయత్నం చేస్తున్నా.
119 సీట్లు బీజేపీకి వదిలి మనం 151 స్థానాల్లో బరిలోకి దిగుతాం. మిగతావి ఇతర మిత్రపక్షాలకు ఇస్తాం’ అని చెప్పారు. ‘2002 గుజరాత్ ఘర్షణల అనంతరం శివసేన దివంగత అధినేత బాల్ థాకరే మీకు వెన్నుదన్నుగా నిలిచిన విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి’ అంటూ ప్రధాని మోదీకి ఠాక్రే సూచించారు. గోధ్రా అల్లర్ల తర్వాత మోడీని గుజరాత్ సీఎం పదవి నుంచి తప్పించాలని అందరూ అన్నారని, అయితే హిందూ సిద్ధాంతం కోసం ఆయనను పదవిలో ఉంచాలని బాలసాహేబ్ ఒక్కరే అద్వానీకి నచ్చజెప్పారన్నారు. కూటమి కొనసాగాలన్నదే తన అభిమతమని, అన్ని సీట్లకు పోటీ చేసేందుకు సైతం తాము సిద్ధమని ఉద్ధవ్ స్పష్టం చేశారు. అయితే శివసేన తుది ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని మహారాష్ట్ర బీజేపీ నేతలు పేర్కొన్నారు.
ఢిల్లీకి ‘మహా’ పొత్తుల గొడవ
Published Mon, Sep 22 2014 3:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement