వడోదర: ఇప్పటివరకు భర్త బాధితులను చూశాం.. తమ షాడిస్టు భర్తల నుంచి తమను కాపాడంటూ మొరపెట్టుకునే భార్యలనూ చూశాం.. కానీ తొలిసారి అందుకు విరుద్ధంగా ఈసారి భర్తల వంతైంది. భరించలేకపోతున్నాం.. దయచేసి మా భార్యల నుంచి మమ్మల్ని కాపాడండోయ్ అంటూ గుజరాత్లో మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేసిన హెల్ప్ లైన్ను భర్తలు ఆశ్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.
గృహహింస, ఈవ్ టీజింగ్ తదితర వేధింపుల నుంచి మహిళలను రక్షించేందుకు పోలీసులు అభయం అనే హెల్ప్ లైన్ గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించింది. అందుకోసం ప్రత్యేకంగా 181 అనే టోల్ ఫ్రీ నంబర్ కేటాయించారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆ నెంబర్కు మహిళల కన్నా పురుషులే ఎక్కువగా ఫోన్లు చేస్తున్నారని వారు చెప్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, గృహహింసకు పాల్పడుతున్నారని సదరు భర్తలు హెల్ప్ లైన్కు ఫోన్ చేసి వాపోతున్నారట. భార్యలు తమ తల్లిదండ్రులతో సరిగా మెదలడంలేదని, దానికి తోడు అత్తల పోరు కూడా ఎక్కువై పోయిందని వారు భయపడుతూ చెప్తున్నారట.
గత ఆరు నెలలుగా ఈ హెల్ప్లైన్కు 25శాతం మంది పురుషులే ఫోన్ చేశారని హెల్ప్ లైన్ అధికారులు తెలిపారు. ఎలాగైనా తమ భార్యలకు మంచి మార్గదర్శకాలు సూచించి వారిలో మార్పు తీసుకురావాలని వారు కోరుతున్నారని వివరించారు. అయితే, కేవలం మహిళల కోసం ఏర్పాటుచేసిన హెల్ప్ లైన్ ద్వారా వారి పురుషుల సమస్యలు పరిష్కరించాలని తాము అనుకోవడం లేదని, కానీ, విషయం మాత్రం తీవ్రంగానే ఉందని అధికారులు తెలిపారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 181 కు వచ్చిన ఫోన్ కాల్స్ మొత్తం 7,919 ఉండగా వాటిల్లో మహిళలు ఫిర్యాదు చేసినవి 5,718 కాగా, పురుషుల చేసినవి 1,201.. అంటే దాదాపు 28శాతం భార్యల బాధితులు చేసినవే.
ప్లీజ్.. మా భార్యల నుంచి రక్షించండి..
Published Tue, Mar 31 2015 9:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
ఈవీఎంల కమిషనింగ్ పూర్తి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి
కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లు
ప్రజల గొంతుౖనై పోరాడా..
అంతకు మించి...
అటకెక్కిన కాంగ్రెస్ హామీలు
విద్యుత్ శాఖకు రూ.20 లక్షల నష్టం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement