మన్మోహన్‌పై అస్సాంలో అభిశంసన తీర్మానం | Sakshi
Sakshi News home page

మన్మోహన్‌పై అస్సాంలో అభిశంసన తీర్మానం

Published Tue, Jul 26 2016 1:36 AM

మన్మోహన్‌పై అస్సాంలో అభిశంసన తీర్మానం

గువాహటి : మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా అస్సాం ప్రయోజనాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ మన్మోహన్‌పై అస్సాం అసెంబ్లీలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. తెలిసో తెలియకో రాష్ట్రానికి మన్మోహన్ నష్టం చేకూర్చారంటూ రాష్ర్ట ఆర్థికమంత్రి హిమంతా బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు.

అస్సాంకు ప్రత్యేక రాష్ట్ర హోదా అంశంపై చర్చ సందర్భంగా శర్మ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్రప్రభుత్వ నిర్లిప్త ధోరణి కారణంగానే ఆయిల్ రిఫైనరీలో రాష్ట్రానికి వాటా దక్కలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

Advertisement
Advertisement