న్యూఢిల్లీ: భీమ్(భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ) యాప్ ద్వారా వ్యాపారులకు ప్రోత్సాహకాలిస్తున్న పథకం గడువును కేంద్రం వచ్చే మార్చి 31 వరకు పొడిగించింది. ఈ యాప్తో లావాదేవీలు జరిపే వ్యాపారులకు నెలకు రూ.వేయి దాకా క్యాష్బ్యాక్ లభిస్తుంది.
నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ఏప్రిల్ 14న ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందుకు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆదివారం ప్రకటన జారీ చేసింది. ఈ పథకం ప్రకారం.. తొలి 20–50 నగదురహిత లావాదేవీలకు వ్యాపారి రూ.50 క్యాష్బ్యాక్ పొందుతారు. ఆ తరువాత జరిగే ప్రతి లావాదేవీకి రూ.2 చొప్పున నెలకు గరిష్టంగా రూ.1000 లభిస్తాయి.