మరోసారి ఆస్పత్రిలో చేరిన అరుణ్ జైట్లీ | Sakshi
Sakshi News home page

మరోసారి ఆస్పత్రిలో చేరిన అరుణ్ జైట్లీ

Published Mon, Sep 22 2014 12:30 PM

Arun Jaitley admitted to hospital again

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన సోమవారం ఉదయం ఆస్పత్రిలో చేరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పరీక్షల అనంతరం అరుణ్ జైట్లీ మంగళవారం మధ్యాహ్నం డిశ్చార్జ్ కానున్నట్లు సమాచారం.  డయాబెటిస్ అదుపులో ఉంచడానికి ఆయన కొద్ది రోజుల క్రితం లాప్రోస్కోపీ చేయించుకున్న విషయం తెలిసిందే.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement