విమానం దారి మళ్లింపు, ఆందోళనలో ప్రయాణికులు | Sakshi
Sakshi News home page

విమానం దారి మళ్లింపు, ఆందోళనలో ప్రయాణికులు

Published Thu, Aug 25 2016 9:43 PM

విమానం దారి మళ్లింపు, ఆందోళనలో ప్రయాణికులు

ఢిల్లీ: ఎయిరిండియా విమానంలో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి న్యూయార్క్ బయలుదేరిన విమానంలో గురువారం రాత్రి సాంకేతిక లోపం ఏర్పడింది. న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం కజికిస్థాన్కు దారి మళ్లింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఘటనపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెంటనే ఎయిరిండియా సీఈవోతో ఫోన్‌లో మాట్లాడారు. విమానంలో 50 మంది తెలుగు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రత్యామ్నాయ విమానం ద్వారా ప్రయాణికులను న్యూయార్క్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా సీఈవో తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement