8మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతి | Sakshi
Sakshi News home page

8మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతి

Published Sat, Apr 15 2017 2:21 PM

8మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతి

ముంబయి: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ఎనిమిదిమంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు నీట మునిగి మృత్యువాత పడ్డారు. సింధుదుర్గ్‌ జిల్లాలోని వైరీ బీచ్‌లో సరదాగా స్నానానికి దిగిన విద్యార్థులు కొద్ది సేపటికే గల్లంతై అనంతరం శవాలుగా తేలారు. చనిపోయిన ఈ విద్యార్థులంతా కూడా కర్ణాటకకు చెందినవారే.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెల్గాం ప్రాంతంలోగల మరాఠ ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన 40 మంది విద్యార్థులు కాలేజీ టూర్‌కు వెళ్లారు. అలా వెళ్లిన వారు సరదాగ వైరీ బీచ్‌లో గడుపుతుండగా వారిలో కొద్దిమంది స్నానానికి దిగి గల్లంతయ్యారు. అలా అయినవారిలో ఎనిమిదిమంది చనిపోయారు.
 

Advertisement
Advertisement