జ్ఞాపకాల మధురానుభూతులు... | Sakshi
Sakshi News home page

జ్ఞాపకాల మధురానుభూతులు...

Published Sat, Nov 22 2014 1:05 AM

జ్ఞాపకాల మధురానుభూతులు...

‘ప్రేమకథాచిత్రమ్’ జంట సుధీర్‌బాబు, నందిత కలిసి నటించిన చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. చంద్రు దర్శకత్వంలో లగడపాటి శిరీషాశ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. డిసెంబర్ తొలివారంలో పాటలను, చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శిరీషాశ్రీధర్ మాట్లాడుతూ -‘‘జ్ఞాపకాల మధురానుభూతులే ప్రధానాంశంగా రూపొందిన చిత్రమిది. ఇప్పటివరకూ వచ్చిన ప్రేమకథలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది.

కన్నడంలో మంచి దర్శకునిగా పేరు తెచ్చుకున్న చంద్రు... ఈ చిత్రాన్ని ఓ కావ్యంలా మలిచాడు. హరి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మా సంస్థ స్థాపించి పదేళ్లు కావొస్తోంది. ఈ సందర్భంలో వస్తున్న ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకొని మా సంస్థ ప్రతిష్ఠను పెంచుతుందని మా నమ్మకం’’ అని తెలిపారు.

Advertisement
Advertisement