- ముగిసిన ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
- 61.03 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరు
- గతేడాది హాజరైనవారు 72.53 శాతం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్లో చేరేందుకు రాష్ట్రంలో 63,777 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. జూన్ 22 నుంచి శుక్రవారం వరకు ఎంసెట్లో అర్హత సాధించి, ర్యాంకులు పొందిన 1,04,500 మంది విద్యార్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలవగా వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసే వరకు 63,777 మంది విద్యార్థులు మాత్రమే (61.03 శాతం) వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఈ వెరిఫికేషన్ చేయించుకున్న వారు మాత్రమే కన్వీనర్ కోటాలోని 70 శాతం సీట్లలో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అర్హులు.
గతేడాది కంటే తక్కువే..
గతేడాది కంటే ఈ సారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరైన వారి సంఖ్య తగ్గింది. గతేడాది మొత్తం అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్యతో పోల్చితే వెరిఫికేషన్కు హాజరైన వారి శాతం బాగా తగ్గిపోయింది. గత ఏడాది ఎంసెట్లో 91,556 మంది అర్హత సాధించగా అందులో 66,410(72.53 శాతం) మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఈ సారి 1,04,500 మంది అర్హత సాధించినా 63,777(61.03 శాతం) మందే వెరిఫికేషన్కు హాజరు కావడం గమనార్హం. గతేడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్యతో కలుపుకుని 72.53 శాతం మంది వెరిఫికేషన్కు హాజరయ్యారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ర్యాంకులు పొందిన 6,618 మందిని కలుపుకున్నా గతేడాది కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది.
వెబ్సైట్లో వివరాలు
కాలేజీలవారీగా చివరి ర్యాంకు వివరాలు, కోర్సు, కేటగిరీ, జెండర్వారీగా గత ఏడాది సీట్లు పొందిన విద్యార్థుల ర్యాంకుల వివరాలను తమ వెబ్సైట్లో (https://tseamcet.nic.in) అందుబాటులో ఉంచినట్లు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెబ్సైట్లోని ఆ వివరాలను పరిశీలించి, ఓ అవగాహనకు వచ్చాకే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు.
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ వారికి 5 నుంచి..
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఇంజనీరింగ్ ఎంసెట్ ర్యాంకులు పొందిన 6,618 మంది విద్యార్థులకు ఈ నెల 5, 6 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టేందుకు ప్రవేశాల విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. ఆ షెడ్యూల్ను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఎంసెట్లో ర్యాంకులు పొందిన విద్యార్థులతోపాటు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఎంసెట్ ర్యాంకులు పొందిన 6,618 మంది విద్యార్థులకు మొదటి దశ వెబ్ ఆప్షన్లలోనే ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు ఇంజనీరింగ్ ఫీజుల జీవో!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఫీజులు ఖరారయ్యాయి. శుక్రవారం జరిగిన ప్రవేశాలు, ఫీజుల నియం త్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) సమావేశంలో కాలేజీల వారీగా ఫీజులను నిర్ణయించారు. ఫీజుల ప్రతిపాదనలను శుక్రవారం సాయంత్రమే ప్రభుత్వానికి పంపడంతో శనివారం ఫీజులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ పరిశీలనకు పంపిస్తే ఆదివారం లేదా సోమవారాల్లో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. శుక్రవారం జరిగిన ఏఎఫ్ఆర్సీ సమావేశంలో సీబీఐటీ కాలేజీ ఫీజును గతంలో ఉన్నట్లు రూ.1,13,500గా నిర్ణయించినట్లు తెలిసింది. మొదట్లో తమ కాలేజీ ఫీజును రూ.2.59 లక్షలకు పెంచాలని యాజమాన్యం ప్రతిపాదనలు పంపించింది. కాలేజీ ఆదాయ వ్యయాలను పరిశీలించిన ఏఎఫ్ఆర్సీ మొదట కాలేజీ వార్షిక ఫీజు రూ.1,09,000గా నిర్ణయించింది. దీంతో కాలేజీ యాజమాన్యం ఆ ఫీజుకు అంగీకరించలేదు. చివరకు యాజమాన్యం వివరణలు పరిశీలించాక రూ. 1,13,500గా నిర్ణయించింది. దీంతో కాలేజీ యాజమాన్యం ఆ ఫీజుకు అంగీకరిస్తూ సంతకం చేసినట్లు తెలిసింది.
వెబ్ ఆప్షన్లకు 63,777 మంది విద్యార్థులు
Published Sat, Jul 2 2016 4:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement