సాలార్‌జంగ్ మ్యూజియంలో ప్రత్యేక కార్యక్రమాలు | Sakshi
Sakshi News home page

సాలార్‌జంగ్ మ్యూజియంలో ప్రత్యేక కార్యక్రమాలు

Published Sun, May 17 2015 2:33 AM

Today in Hyderabad

బహదూర్‌పురా:  సాలార్‌జంగ్ మ్యూజియం వెస్ట్రన్ బ్లాక్‌లో జమిని రాయ్‌పై ఈ నెల 18 నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు మ్యూజియం డెరైక్టర్ డాక్టర్ ఎ. నాగేందర్ రెడ్డి తెలిపారు.18న పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ను పద్మశ్రీ అవార్డు గ్రహీత జగదీష్ మిఠల్ ప్రారంభిస్తారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జమిని రాయ్ ప్రత్యేక స్క్రీనింగ్ సినిమా ప్రదర్శన ఉంటుందన్నారు. 19వ తేదీన ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు జమిని రాయ్ సింపోసియం ఆర్ట్ ఉంటుందన్నారు. 20న పాఠశాల విద్యార్థులకు ఆర్ట్ క్యాంపు, ఎగ్జిబిషన్ మొదటి అంతస్తులో ఉంటాయన్నారు.
 

Advertisement
Advertisement