హైదరాబాద్ మలక్పేట వద్ద జరుగుతున్న మెట్రో రైలు పనుల్లో గురువారం తెల్లవారుజామున ప్రమాదం సంభవించింది. సిమెంటు లారీ బోల్తాపడి ఇద్దరు మరణించారు. అన్సారీ, బాబూలాల్ అనే ఇద్దరు కార్మికులు మరణించినట్లు గుర్తించారు. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పిల్లర్ల కోసం తీసిన గుంతల్లో ప్రమాదవశాత్తు సిమెంట్ లారీ బోల్తాపడగా, ఇద్దరు కూలీలు మృతి చెందారు. హైదరాబాద్ మలక్పేట్ ఫ్లై ఓవర్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కూలీలు సిమెంట్ పిల్లర్లు వేస్తుండగా, దూసుకొచ్చిన లారీ కూలీలను ఢీకొంటూ గుంతలో పడిపోయింది. దీంతో కూలీలు లారీ కింద ఇరుక్కుపోయారు. కూలీలను బయటకు తీసేందుకు ఆలస్యం కావడంతో వారిద్దరూ మృతిచెందారు. అదృష్టవశాత్తు మరో ఎనిమిదిమంది కూలీలు అదే సమయానికి మంచినీళంలె తాగేందుకు బయటకు వచ్చారు. ఈ ప్రమాదంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దిల్సుఖ్నగర్ నుంచి కోఠి వరకూ వాహనాలు ఎక్కడికక్కడే గంటలపాటు స్తంభించిపోయాయి.
కాంక్రీటు మిక్సర్ పూర్తిగా తిరగబడిపోయింది. పదిమంది వరకు లోపల ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. నాలుగు గంటలుగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. అయినా కాంక్రీటు మిక్సర్ను తొలగించేందుకు మరికొంత సమయం పట్టేలా ఉంది. కార్మికులు కింద పనిచేస్తున్నప్పుడు వారి భద్రతకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలా చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. గతంలో కూడా మలక్పేట వద్ద సుమారు నెల రోజుల క్రితం ఒక వాహనం ఇలాగే గుంతలో పడింది. అయితే ఇంతవరకు మెట్రో అధికారులు ఎవరూ దీనిపై స్పందించలేదు.
మరోవైపు హయత్నగర్ ప్రాంతంలోని పెద్ద అంబర్పేట వద్ద ఇదే సమయంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం లారీ బోల్తాపడి ఇద్దరు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మెట్రో పనుల్లో ప్రమాదం.. ఇద్దరి మృతి
Published Thu, Apr 17 2014 8:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement