సలహాలివ్వడం జర్నలిస్టుల బాధ్యత: నరసింహన్ | Sakshi
Sakshi News home page

సలహాలివ్వడం జర్నలిస్టుల బాధ్యత: నరసింహన్

Published Sun, Nov 29 2015 6:35 PM

సలహాలివ్వడం జర్నలిస్టుల బాధ్యత: నరసింహన్

హైదరాబాద్: హైదరాబాద్ లో ఆదివారం జరుగుతున్న ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవ సంబరాలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, తదితర ప్రముఖులు హాజరయ్యారు. జర్నలిజం అంటే విమర్శలు చేయడమే కాదు.. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం జర్నలిస్టుల బాధ్యత అని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ప్రతి విషయాన్ని సెన్సేషన్ చేయొద్దని, కొన్ని విషయాల్లో బాధ్యతగా వ్యవహరించాలని గవర్నర్ పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement