వరంగల్ ఉప ఎన్నిక కోసమా ఇదంతా ? | Sakshi
Sakshi News home page

వరంగల్ ఉప ఎన్నిక కోసమా ఇదంతా ?

Published Sat, Sep 5 2015 1:34 PM

వరంగల్ ఉప ఎన్నిక కోసమా ఇదంతా ? - Sakshi

హైదరాబాద్ : కేసీఆర్ ప్రభుత్వం కేంద్రమంత్రుల పర్యటనను అడ్డుకుంటుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో కేసీఆర్ మాట్లాడుతూ... ఈ రోజు గడ్కరీ పర్యటనకు సీఎం కేసీఆర్ సమయం లేదన్నారు. ఈ నేపథ్యంలో రూ. 1900 కోట్ల యాదాద్రి - వరంగల్ హైవే శంకుస్థాపన వాయిదా పడిందన్నారు.

వరంగల్ ఉప ఎన్నిక కోసమా ఇదంతా అని కేసీఆర్ ప్రభుత్వాన్ని కిషన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్లోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. తమ పార్టీ చేపడుతున్న రైతు దీక్ష ఈ నెల 7న నిజామాబాద్, 8న హైదరాబాద్లో చేపట్టనున్నట్లు కిషన్రెడ్డి వివరించారు. ఆధిపత్యపోరు కేసీఆర్ కుటుంబంలోనే ఉందని.. తమ పార్టీలో కాదని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement