సాక్షి, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ఆహార భద్రత (రేషన్) కార్డుదారుల్లో అనర్హులు అక్షరాల నాలుగున్నర లక్షల పైనే ఉనట్లు బహిర్గతమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ఈ-పాస్ అమలు వాస్తవ పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. గత మూడు నెలలుగా ఈ-పాస్ (వేలి ముద్రల) ద్వారా సరుకులు పంపిణీ చేస్తుండటంతో వినియోగం లేని కార్డుల చిట్టా బయటపడుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయనే కక్కుర్తితో ఆర్థికంగా ఉన్న వారు సైతం ఆహార భద్రత కార్డులు పొందారు.
కానీ, నెలసరి రేషన్ సరుకులకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా వారి కోటా పక్కదారి పట్టి ప్రతి నెల వందల కోట్ల రూపాయల సబ్సిడీ బియ్యం స్వాహాకు గురైనట్లు స్పష్టమవుతోంది. ఈ -పాస్ అమలుకు ముందు ప్రతినెల సుమారు 90 నుంచి 95 శాతం వరకు కార్డుదారులు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తుండగా.... ఈ-పాస్ పూర్తి స్థాయి అమలుతో సరుకులకు దూరంగా ఉంటున్న కార్డుల సంఖ్య ఒకేసారి 60 శాతానికి పడిపోయింది. గత మూడు నెలల పరిస్థితిని పరిశీలించిన సంబంధిత అధికారగణం సరుకులకు దూరంగా ఉంటున్న కార్డుదారును అనర్హులు గుర్తించి ఏరివేసేందుకు చర్యలకు దిగుతోంది.
ఇదీ పరిస్థితి..
గ్రేటర్ హైదరాబాద్లో 13 లక్షలకు పైగా కార్డుదారులున్నారు. వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 11 లక్షల తెల్లరేషన్ కార్డులు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెల్లరేషన్ కార్డులు రద్దు చేసి ఆహార భద్రత పథకం కింద దరఖాస్తులు అహ్వనించడంతో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. నిరుపేదలతో పాటు ఆర్థికంగా బలపడ్డ వారు సైతం దరఖాస్తులు చేసుకున్నారు.
పౌరసరఫరాల అధికారులు కనీసం క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండా కేవలం ఆధార్ అనుసంధానంతో కార్డులు మంజూరు చేస్తూ వచ్చారు. దీంతో అర్హులతో పాటు అనర్హులకు కూడా కార్డులు మంజూరయ్యాయి. ఫలితంగా కార్డుల సంఖ్య ఒకేసారి పెరిగింది. కార్డులు మంజూరైన అనర్హులు మాత్రం సరుకులకు దూరంగా ఉంటూ వస్తూన్నారు. అయితే ఆహార భద్రత పధకం కింద కార్డులోని యూనిట్కు ఆరు కిలోల చొప్పున బియ్యం కోటా కేటాయించడంతో చౌకధరల దుకాణాల డీలర్లకు అనర్హుల కార్డులు వరప్రసాదంగా మారాయి. గత ఏడాదిన్నర కాలంగా వినియోగం లేని కార్డులు కోటా కూడా డ్రా అవుతూ వచ్చింది. తాజాగా ఈ పాస్ అమలుతో వినియోగం లేని కార్డుల సంఖ్య బయటపడి వారి అవినీతికి అడ్డుకట్టపడినట్లయింది.
కార్డులకే పరిమితం...సరుకులకు దూరం!
Published Thu, Jun 30 2016 11:59 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement