ఖాళీల భర్తీకి మళ్లీ ‘డిప్యుటేషన్’
నియామకానికి కమిషనర్ గ్రీన్సిగ్నల్
ప్లానింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టి
సిటీబ్యూరో : హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు కొత్త రక్తం ఎక్కించేందుకు రంగం సిద్ధమైంది. ప్రధానంగా రెవెన్యూ, ఫారెస్ట్, డీటీసీపీ తదితర విభాగాల్లో మంచి రికార్డు ఉన్న అధికారులను డిప్యుటేషన్పై తీసుకోవాలని హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా నిర్ణయించారు. ఈ మేరకు ఆయా విభాగాలకు ఉన్నతాధికారులకు లేఖలు రాయాలని అధికారులను ఆదే శించారు. సంస్థలో పేరుకుపోయిన అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు గాను కొత్త జట్టును ఏర్పాటు చేసే దిశగా ఆమె చర్యలు చేపట్టారు. కాగా హెచ్ఎండీఏలో డిప్యుటేషన్పై దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు అధికారులను ఇటీవల మాతృ సంస్థలకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ పనుల నిమిత్తం హెచ్ఎండీఏకు వచ్చే వారికి సత్వర సేవలందించేందుకుగాను సంస్థను సమూలంగా సంస్కరించాలని కమిషనర్ పట్టుదలతో ఉన్నారు.
ఇందులో భాగంగా నిజాయితీ పరులతో కూడిన కొత్త బృందాన్ని ఏర్పాటు చేసి పారదర్శన పాలన అందించాలని ఆమె యోచిస్తున్నారు. గతంలో భూ పరిపాలనా విభాగం, ఓఆర్ఆర్ ప్రాజెక్టులో 36మంది రెవిన్యూ విభాగానికి చెందిన అధికారులు డిప్యుటేషన్పై పనిచేసేవారు. ప్రస్తుతం వారి సంఖ్యను కుదించి ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు, తాహశీల్దార్లు-5, డిప్యూటీ తాహశీల్దార్లు-10, ఐదుగురు సర్వేయర్లతో కలిసి మొత్తం 22మందిని కొత్తగా డిప్యుటేషన్పై తీసుకోనున్నారు. అంతేగాకుండా హెచ్ఎండీఏలో కీలకమైన చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (సీఏఓ) పోస్టు భర్తీకి అకౌంటెంట్ జనరల్ (ఏజీ)కు లేఖ రాయనున్నారు. ప్లానింగ్ విభాగాన్ని పూర్తిస్థాయిలో సంస్కరించాల్సి ఉన్నందున దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందుకుగాను ఎం.ఎ. అండ్ యూడీ లేదా డీటీసీపీ విభాగాల నుంచి నిజాయితీ పరులైన అధికారులను డెరైక్టర్లు, ప్లానింగ్ ఆఫీసర్లుగా తీసుకోవాలని నిర్ణయించారు.
అటవీ శాఖ నుంచి...
ఔటర్ రింగ్రోడ్డుతో పాటు హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధికి కమిషనర్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. హరిత హారం పథకం కింది హెచ్ఎండీఏకు ఇప్పటికే రూ.50కోట్లు నిధులు కేటాయించినందున వాటిని చక్కగా సద్వినియోగం చేసుకొని హరిత హైదరాబాద్గా తీర్చిదిద్దాలని ఆమె లక్ష్యంగా నిర్ణయించారు. అయితే... అర్బన్ ఫారెస్ట్రీ విభాగంలోని అటవీ శాఖ అధికారులందరినీ మూకుమ్మడిగా మాతృశాఖకు పంపినందున, ఇప్పుడు అదే శాఖ నుంచి మళ్లీ కొత్తగా 12మంది అధికారులను తీసుకోవాలని నిర్ణయించారు. దీనికితోడు ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ సిబ్బంది లేకపోవడంతో హెచ్ఎండీఏలో పనులు పూర్తిగా స్తంభించిపోవడంతో త్వరలో టెండర్ పిలిచి 50-60మంది సిబ్బందిని తీసుకోవాలని నిర్ణయించారు. కాగా ఇప్పటికే రోడ్డునపడ్డ అవుట్ సోర్సింగ్ సిబ్బంది తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొంటున్నారు.
హెచ్ఎండీఏకు కొత్త రక్తం!
Published Mon, Apr 27 2015 11:49 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement