ఎంసెట్‌లో పాస్.. ఇంటర్‌లో ఫెయిల్! | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌లో పాస్.. ఇంటర్‌లో ఫెయిల్!

Published Fri, May 27 2016 3:08 AM

ఎంసెట్‌లో పాస్.. ఇంటర్‌లో ఫెయిల్!

ఎంసెట్‌లో ర్యాంకు పొంది ఇంటర్‌లో ఫెయిలైన 18,143 మంది
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్‌లో ఫెయిల్ అవడంతో 18,143 మంది విద్యార్థులకు ర్యాంకులను ప్రకటించలేదు. మరో 3,114 మంది తమ ఇంటర్ మార్కుల వివరాలను అందజేయకపోవడంతో వారి ర్యాంకులను కూడా ప్రకటించలేదు. తెలంగాణ ఎంసెట్‌కు మొత్తంగా 2,46,540 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 2,23,542 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 2,00,861 మంది ఎంసెట్‌లో అర్హత సాధించారు. అయితే 18,143 మంది ఇంటర్‌లో ఫెయిల్ అయ్యారు. మరో 3,114 మంది ఇంటర్ ఉత్తీర్ణత వివరాలను ఇవ్వనందున ఎంసెట్ కమిటీ 1,79,609 మందికి మాత్రమే ర్యాంకులను ప్రకటించింది.

Advertisement
Advertisement